యాప్నగరం

షణ్ముక్ ఒక్కడే తోపుకాదు.. ఎవరికి ఉండేది వాళ్లకి ఉంటుంది: పక్కింటి కుర్రాడు చందు సాయి

చందు సాయి అంటే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ.. పీకే పక్కింటి కుర్రాడు అంటే మాత్రం సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్. అయితే ఈ మధ్యకాలంలో యూట్యూబ్‌లో కనిపించడం మానేశాడు. ఇప్పుడు మళ్లీ కొత్త జర్నీ మొదలుపెట్టాడు.

Samayam Telugu 10 Apr 2021, 11:37 pm
‘తమడా మీడియా’ నుంచి బయటకు వచ్చేసిన పక్కింటి కుర్రాడు అలియాస్ చందు సాయి (పీకే) ఇన్ఫినిటమ్ మీడియాతో కలిసి పనిచేయబోతున్నాడు. గత కొన్నాళ్లుగా యూట్యూబ్‌లో కనిపించడం మానేసిన చందు సాయి మళ్లీ కొత్త జర్నీ మొదలుపెట్టాడు.
Samayam Telugu షణ్ముక్ జస్వంత్, చందు సాయి
shanmukh jaswanth and chandu


అయితే తన కంటెంట్ బాగుంది కనుకనే ఇన్నాళ్లూ తమడా మీడియా తనను ప్రమోట్ చేసిందని.. ఒకవేళ తన కంటెంట్ బాలేకపోతే ఎవరూ చూసేవారు కాదని అన్నారు చందు సాయి. కంటెంట్ లేకుండా ఎంత ప్రమోట్ చేసి గాలి కొట్టినా జనంలోకి వెళ్లదని అన్నారు చందు సాయి. ఇన్నాళ్లూ ‘పక్కింటి కుర్రాడు’గా జనంలో ఉన్నానని.. ఇకపై తన జర్నీ చందు సాయిగా ఉండబోతుందని చెప్పాడు.

ఈ సందర్భంగా కొత్తగా చేరిన సంస్థగా గురించి గొప్పగా చెప్పాడు చందు సాయి. ఇన్ఫినిటమ్ మీడియా వాళ్లు ప్రతిదీ బిజినెస్‌గా చూడరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే. షణ్ముక్ కూడా ఇదే సంస్థలో ఉన్నాడు కాబట్టి.. పరిచయం ఏర్పడింది. మంచి బూస్టింగ్ ఉంది. యూట్యూబ్‌లో అతన్ని మించినోడు లేడంటే ఎవరికి ఉండేది వాళ్లకి ఉంటుంది. ఎవరి స్కిల్ వాళ్లది. చిరంజీవి తోపు.. అలాగని నాగార్జున గారు తోపు కాదంటారా? బాలయ్య తోపు కాదా? ఎవరి స్టైల్ వాళ్లది.. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి హిట్ వస్తుంది. అందరూ పోటీపడాలి. ఒకరే తోపు అంటే కాదు.. టైం రావాలి అంతే.. ఎవరికి టైం వస్తే వాళ్లు టాప్‌లో ఉంటారు’ అని చెప్పుకొచ్చారు పక్కింటి కుర్రాడు చందు సాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.