యాప్నగరం

Vadinamma జూలై 27 ఎపిసోడ్: నానీ కాళ్లు కడిగిన బావమరిది కిరణ్, సీత-రఘురాంల బంధానికి అగ్నిపరీక్ష

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘వదినమ్మ’ సీరియల్.. 604 ఎపిసోడ్‌కి నేడు(2021 జూలై 27)న ఎంటర్ అయ్యింది. అయితే నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా మారింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 27 Jul 2021, 12:04 pm
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘వదినమ్మ’ సీరియల్.. 604 ఎపిసోడ్‌కి నేడు(2021 జూలై 27)న ఎంటర్ అయ్యింది. అయితే నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా మారింది.
Samayam Telugu ‘వదినమ్మ’ జూలై 27 ఎపిసోడ్ (photo courtesy by star మా and disney+ hotstar)
Vadinamma July 27 episode


604 ఎపిసోడ్‌ హైలైట్స్..
మొత్తానికి పగబట్టిన దమయంతి సీత ఇంటికి వెళ్లి.. నేను మారాను.. నా కూతురి కోసం తగ్గాను అనడంతో కథనం ఉత్కంఠగా మారింది. కూతురితో ప్రేమగా మాట్లాడి.. ‘సాయంత్రానికి అమ్మాయిని మా అల్లుడ్ని తీసుకుని మా ఇంటికి వచ్చెయ్యండి.. గతంలో జరిగింది ఏదీ గుర్తు పెట్టుకోకండీ’ అంటూ రిక్వస్ట్ చేసి వెళ్తుంది దేవయాని. దాంతో సీతతో సహా అంతా హ్యాపీ ఫీల్ అవుతారు. సీత సంబరంగా రఘురాంకి ఫోన్ చేసి.. దమయంతి వచ్చిందని ఆమె చెప్పిన సంగతి చెప్పి సంబరపడుతుంది. రఘురాం భరత్‌కి ఫోన్ చేసి చెబుతాడు.

ఇక అంతా కలిసి సాయంత్రానికి దమయంతి ఇంటి ముందు దిగుతారు. శిల్ప సంతోషానికి అవధులు ఉండవు. నానీ కూడా కాసేపట్లో శోభనం అంటూ శైలు, సిరి ఏడిపించడంతో సిగ్గుపడతారు. అందరినీ సంతోషంగా ఆహ్వానిస్తుంది దమయంతి. అయితే శైలు అందరిని ఒక్క నిమిషం అని ఆపి.. బావమరిది నానీ కాళ్లు కడగాలి అనడంతో కిరణ్ రగిలిపోతాడు. చచ్చినా కడగను అంటూ ఫైర్ అయ్యి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. దాంతో దమయంతి కిరణ్‌ని బతిమలాడి తీసుకొచ్చి నానీ కాళ్లు కడిగిస్తుంది. దాంతో అంతా ఫుల్ హ్యాపీ అవుతారు. భరత్, లక్ష్మణ్‌లు వీడియోలు ఫోటోలు తీయ్యడంతో కిరణ్ చాలా అవమానంగా ఫీల్ అవుతాడు.

ఇక భోజనాలు ఏర్పాట్లు చేస్తుంది దమయంతి. అక్కడ కూడా ఒకరికి ఒకరు తినిపించుకోవాలి. భార్య భర్తకు భర్త భార్యకు తినిపించాలి అని శైలు మెలిక పెట్టడంతో.. దమయంతి విసుక్కుంటుంది లేకి బుద్దులు అని మనసులో తిట్టుకుంటుంది. చేసేది లేక అంతా సిగ్గు పడుతూ తినిపించుకుంటే.. దమయంతి మాత్రం అయిష్టంగానే భర్త చేత్తో పెట్టిన స్వీట్ తింటుంది. ఇక కమింగ్ అప్‌లో మరో కేక్ షురు చేస్తుంది సిరి. ఏదో ఒకటి భార్యకు ముఖ్యమైన వస్తువుని ఒక చోట దాస్తారు. అది భర్తే వెళ్లి తీసుకుని రావాలి.. అంటూ ఏదో కొత్త గేమ్ చెబుతుంది . దాంతో సీత కళ్లకు గంతలు కట్టుకున్న రఘురాం.. ‘నువ్వు ఓడిపోతే ఇన్నేళ్ల మన బంధం ఓడిపోయినట్లే’ అంటూ ఎమోషనల్‌గా డైలాగ్ చెబుతుంది. దాంతో రఘురాం కూడా అంతే ఎమోషనల్‌గా.. ‘ఇది నేను సీత మెడలో వేసిన మూడుముళ్ల బంధానికి పరీక్ష’ అంటాడు. దాంతో కథనం ఆసక్తిగా మారింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘వదినమ్మ’ కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.