యాప్నగరం

‘వదినమ్మ’ మే 17 ఎపిసోడ్: 20 కోట్లు.. 4 రోజులు.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘వదినమ్మ’ సీరియల్.. 544 ఎపిసోడ్‌కి నేడు(2021 మే 17)న ఎంటర్ అయ్యింది. అయితే నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా మారింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 17 May 2021, 12:32 pm
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘వదినమ్మ’ సీరియల్.. 544 ఎపిసోడ్‌కి నేడు(2021 మే 17)న ఎంటర్ అయ్యింది. అయితే నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా మారింది.
Samayam Telugu ‘ఇంటింటి గృహలక్ష్మి’ మే 17 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Intinti Gruhalakshmi 17 May episode


544 ఎపిసోడ్‌ హైలైట్స్..
రఘురాం పోలీస్ స్టేషన్ నుంచి లక్ష్మణ్‌ని తీసుకుని రాకపోవడంతో.. సీత, రాజేశ్వరి, సిరి అంతా బాధపడతారు. తర్వాత రఘురాం పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పడంతో.. అంతా కూల్ అవుతారు. సీత బాధగా.. ‘మనకంటే ఎక్కువ శైలు బాధపడుతుంది’ అనడంతో.. రఘురాం సిరిని శైలు దగ్గరకు వెళ్లి ఓదార్చమంటాడు. దాంతో సిరి వెళ్తుంది. శైలు ధైర్యం చెబుతుంది. ఇక సీన్ కట్ చేస్తే.. మరునాడు సీత, రఘురాంలు లాయర్‌ని తీసుకుని బెయిల్‌తో లక్ష్మణ్‌ని విడిపిస్తారు. అయితే లక్ష్మణ్‌ని విడుదల చెయ్యాలంటే.. ఓ కండీషన్ ఉందని.. అలా అయితే లక్ష్మణ్‌ని విడుదల చేస్తానని పోలీస్ చెప్పడంతో.. రఘురాం కండీషన్ ఏదైనా సరే.. ఫర్వాలేదు అంటాడు.

లక్ష్మణ్ కంపెనీకి.. కస్టమర్స్‌కి మధ్య ఉన్న డీలర్స్.. 4 రోజుల్లో 20 కోట్లు చెల్లిస్తే.. లక్ష్మణ్‌ని విడిపిస్తాం..’ అనడంతో.. అందుకు ఓకే చెప్పి లక్ష్మణ్‌ని ఇంటికి తీసుకొస్తారు. శైలు లక్ష్మణ్‌ని హగ్ చేసుకుని చాలా సంతోషిస్తుంది. ‘వెళ్లి ఫ్రెష్ అవ్వరా’ అంటే లక్ష్మణ్ మాత్రం ఏడుస్తూ.. ‘అన్నయ్యా సమస్య నాది.. దీని నుంచి బయటపడేదాకా నేను శైలు మీకు దూరంగా ఉంటాం’ అంటాడు లక్ష్మణ్ . దాంతో రఘురాం, భరత్, సిరిలతో పాటు సీత అంతా కూడా.. ‘సమస్య ఎవరిదైనా అంతా కలిసే ఎదుర్కొందాం’ అని ధైర్యం చెప్పడంతో చాలా ఎమోషనల్ అవుతారు. ఆ సీన్ ప్రేక్షకుల మనసుల్ని మెలిపెట్టేలా ఉంది.

మొత్తానికీ లక్ష్మణ్ కూల్ అవ్వడంతో అంతా ఒకే ఇంట్లో ఉంటారు. మధ్యవర్తులు మాట్లాడటానికి ఇంటికి రావడంతో.. ‘4 రోజుల్లో 20 కోట్లు ఎలా చెల్లిస్తారు? చెల్లించకపోతే మామూలుగా ఉండదు’ అంటూ వాళ్లు మాట్లాడుతుంటారు. దాంతో లక్ష్మణ్ 4 రోజుల్లో అంటే కష్టం అంటాడు. దాంతో వాళ్లు రెచ్చిపోతారు. రఘురాం వాళ్లని కూల్ చేస్తాడు. మాట ఇచ్చింది నేను అంటూ మరోసారి డబ్బు సద్దేస్తానంటూ మాటిస్తాడు. కమింగ్ అప్‌లో.. సీత, రఘురాంలు డబ్బు సద్దడం గురించి కంగారు పడుతూ ఉంటారు. అయితే రఘురాం మాత్రం.. నమ్మకంగా.. ‘మాట ఇచ్చాను.. నమ్మకం ఉంది.. డబ్బు తీర్చేద్దాం’ అంటాడు. మరి ఎలా తీరుస్తారు? ఉన్న ఇల్లు అమ్మేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘వదినమ్మ’ కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.