యాప్నగరం

Vadinamma జూన్ 14 ఎపిసోడ్: కోయంబత్తూరు వెళ్లిపోయిన భరత్!? ‘ఆశలు వదులుకోవాల్సిందే’ షాకింగ్ న్యూస్

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘వదినమ్మ’ సీరియల్.. 568 ఎపిసోడ్‌కి నేడు(2021 జూన్ 14)న ఎంటర్ అయ్యింది. అయితే నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా మారింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 15 Jun 2021, 10:41 pm
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘వదినమ్మ’ సీరియల్.. 568 ఎపిసోడ్‌కి నేడు(2021 జూన్ 14)న ఎంటర్ అయ్యింది. అయితే నేటి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా మారింది.
Samayam Telugu ‘వదినమ్మ’ జూన్ 14 ఎపిసోడ్ (photo courtesy by star మా and disney+ hotstar)
Vadinamma June 14 episode


568 ఎపిసోడ్‌ హైలైట్స్.. Vadinamma serial today episode
సీత కిడ్నీ దానం,యాక్సిడెంట్ క్రమంలో రఘురాం కుటుంబంలో విషాదం అలుముకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శైలు కూడా పూర్తిగా మారిపోయింది. తండ్రితో తెగతెంపులు చేసుకుంది. అయితే రఘురాం కుటుంబం అంతా బాధల్లో ఉంటే.. పార్వతమ్మ, దుర్గమ్మ వచ్చి.. చురకులు వేస్తూ సూటిపోటి మాటలతో మరింత బాధపెడతారు. ‘సీత భర్తకు చెప్పకుండా వెళ్లడం ఏంటీ.. నువ్వు ఎలా వెళ్లనిచ్చావ్ అంటూ పార్వతమ్మ రాజేశ్వరిని ప్రశ్నిస్తూ వెటకారం చేస్తుంది. ఇక టీ అయినా పెట్టి ఇస్తాం.. మిమ్మల్ని ఓదార్చడానికే వచ్చాం అంటారు దుర్గమ్మా, పార్వతమ్మలు. అయితే సిరి ‘టీలు కాఫీలు ఏం అవసరం లేదు’ అంటుంది కోపంగా. అయినా సరే.. ‘కనీసం మేమైనా తాగుతాం’ అంటూ వంటగదిలోకి వెళ్లిన పార్వతమ్మ, దుర్గమ్మ.. వంట చేసి కాస్త తిందురుగానే రండీ అంటూ మళ్లీ పుల్లవిరుపు మాటలే మాట్లాడతారు. దాంతో అంతా మరింత బాధపడతారు.

‘అమ్మా శైలు నువ్వు మీ పుట్టింటితో తెగతెంపులు చేసుకున్నావట.. తప్పు చేశావేమో’అంటూ వెటకారం చేస్తుంటే.. సిరి అడ్డుపడి.. ‘అమ్మా అవన్నీ గిప్పుడు అవసరమా.. నువ్వు ఎక్కువ మాట్లాడితే.. ఊరుకునేది లేదు.. నేను తెగతెంపులు చేసుకోవాల్సి వస్తుంది’ అంటూ వార్నింగ్ ఇస్తుంది. అయితే ఆమె ఊరుకోకుండా.. ‘పోయినోళ్లతో మనమూ పోతామా’ అంటూ వెటకారం చెయ్యడంతో రఘురాం రగిలిపోతాడు. ‘పోలేదు ఎవరు పోలేదు.. నువ్వు చూశావా? నువ్వు చూశావా?? నా సీత చచ్చిపోవడం నువ్వు చూశావా’ అంటూ ఆవేశంతో ఊగిపోతాడు. భాస్కర్.. పార్వతమ్మ.. దుర్గమ్మ సావాసం వల్లే అలా అయ్యింది అని భాస్కర్ దుర్గమ్మని తిడితే.. పార్వతమ్మని సిరి తిడుతుంది. మొత్తానికి ఆవేశంతో ఊగిపోయిన రఘురాం బాధగా అక్కడ నుంచి లోపలికి వెళ్లిపోతే భాస్కర్ వచ్చి ధైర్యం చెబుతాడు. కచ్చితంగా సీతకు ఏం కాదు బావా.. నువ్వు బాధపడకు.. విరవాలు తెలుసుకోవడానికి బస్టాండ్‌కి వెళ్దాం పదా అంటాడు.

సీన్ కట్ చేస్తే భాస్కర్ బైక్ తీసుకుని బయలుదేరుతుంటే.. భాస్కర్‌కి అజ్జెంట్‌గా రామ్మని వాళ్ల సూపర్‌వైజర్ ఫోన్ చేస్తాడు. దాంతో భారత్ వచ్చి.. ‘బావా నువ్వు వెళ్లు.. నేను వెళ్తానులే బస్టాండ్‌కి.. అన్నయ్యా నువ్వు కూడా రెస్ట్ తీసుకో’ అంటూ నచ్చజెబుతాడు. కమింగ్అప్‌లో Vadinamma serial.. భరత్ ఇంకా తిరిగి రాలేదని రఘురాం టెన్షన్ పడుతుంటే.. భరత్ బస్టాండ్‌కి వెళ్లి అక్కడ ఎక్వైరీలో సీత మహాలక్ష్మి పేరు చెబుతాడు. అయితే అదే ఊరిలోనా కోయింబత్తూర్‌లో అనేది తెలియదు కానీ.. అక్కడున్న వ్యక్తి.. ‘ఆ పేరుతో ఎవరు పేషెంట్స్ లేరు.. ఆమె లోయలో పడి బాడీ కూడా దొరకలేనట్లు అర్థం.. ఆశలు వదులుకోవాల్సిందే’ అని చెప్పడంతో భరత్ షాక్‌లో ఉండిపోతాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘వదినమ్మ’ కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.