యాప్నగరం

Guppedantha Manasu జూన్ 28: పసుపు, కుంకుమలతో బయటపడిన రిషిధార ప్రేమ.. అదిరిపోయే సీన్

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2022 జూన్ 28)న 486 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Guppedantha Manasu June 28 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 28 Jun 2022, 11:06 am
గత ఎపిసోడ్‌లో రిషి, వసులు మినిస్టర్‌ని కలిసి.. తిరిగి వస్తుంటే రోడ్డు బ్లాక్ అయ్యి ఉంటుంది. ఆకలేస్తుందని అక్కడే పుచ్చకాయ తినడానికి ఆగుతారు. అదే సీన్ కంటిన్యూ అవుతుంది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ 2022 జూన్ 28 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu 2022 June 28 episode


486వ ఎపిసోడ్‌ హైలైట్స్..
తింటూ ఉండగా రిషి మీసాలపైన పుచ్చకాయ ముక్క అతుక్కుంటుంది. అది చూసిన వసు.. వెంటనే తన ఫోన్ తెచ్చి ఫొటో తీసి.. రిషికి చూపిస్తుంది. ‘చెప్పొచ్చుగా.. ఫొటో తీసి చూపించాలా’ అంటూ తుడుచుకుంటాడు రిషి. ‘మీరు అలానే చేశారుగా’ అంటూ గతంలో జరిగి దాన్ని గుర్తు చేసి.. ‘నవ్వొచ్చుగా సార్’ అనుకుంటుంది మనసులో. రిషి నవ్వడు. ‘సార్ బయలుదేరదామా’ అంటుంది వసు. ‘వద్దులే.. సాయంత్రం దాకా ఇక్కడే ఉండి.. డిన్నర్ కూడా పుచ్చకాయే తినేద్దాం.. అప్పటికి ఇక్కడ రోడ్డు పనులు పూర్తి అయిపోతాయి కదా.. అప్పుడు బయలుదేరదాం’ అంటాడు రిషి వెటకారంగా. దెబ్బకు వసు కారు ఎక్కుతుంది.

ఇక సీన్ కట్ చేస్తే.. జగతి మహేంద్రతో.. ‘వసు, రిషిలు మళ్లీ కలిసిపోతున్నారనిపిస్తోంది’ అంటూ సంబరంగా చెబుతుంది. ‘రిషి దేన్నీ అంత తేలిగ్గా మరిచిపోడు కదా జగతి.. అంతెందుకు నీ విషయమే తీసుకో.. 20 ఏళ్లుగా ధ్వేషిస్తూనే ఉన్నాడు’ అంటాడు మహేంద్ర. ఆ మాటకు జగతికి బాధేస్తుంది. ‘నిజమే మహేంద్రా.. నా కొడుకు నన్ను ధ్వేషిస్తున్నాడు’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడి అక్కడ నుంచి వెళ్లబోతుంటే.. ‘అయ్యో జగతి నువ్వు బాధపడతావ్ అనుకోలేదు.. మన రిషి మనస్తత్వం నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను అంతే.. వాళ్లు కలుస్తున్నారని ఆశపెట్టుకుంటున్నావ్ కదా.. తీరా అది జరగకపోతే బాధపడతావని ఆలోచించి అలా అన్నాను’ అంటూ సర్దిచెబుతాడు. ఇక వసు ఇంటికి వచ్చేసి.. రిషి రాసిన ప్రేమ లేఖని రాసుకుని తనలో తనే మాట్లాడుకుంటూ రిషిని పొగుడుతూ మురిసిపోతుంది. రిషికి కాల్ చేస్తుంది కానీ కట్ చేస్తాడు. ‘ఇంత జరిగాక అన్నీ మరిచిపోయి ఎలా ఉండాలి నీతో’అనుకుంటాడు రిషి.

ఇక మరునాడు ఉదయాన్నే రిషి కాలేజ్‌కి వచ్చేసరికి.. ఓ ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసిన రిషి.. ‘వావ్ ఇది నిజంగా గుడ్ న్యూసే.. స్కాలర్ షిప్ టెస్ట్‌లో వసు సాధించింది.. ఫస్ట్ వచ్చిందనే గుడ్ న్యూస్ చెప్పినందుకు థాంక్యూ’ అంటూ అదే ఆనందంలో చుట్టూ చూస్తాడు. అటుగా పుష్పతో కలిసి వెళ్తున్న వసు దగ్గరకు పరుగుతీస్తాడు. అంతా మరిచిపోయి గతంలో మాదిరి గళగళ మాట్లాడేస్తూ.. వసు చేయి తీసుకుని కంగ్రాట్స్ చెబుతాడు. వసు ఆశ్చర్యంలో ఉండిపోతుంది. ‘ఏం అయ్యింది సార్’ అంటుంది పుష్ప. ‘స్కాలర్ షిప్ టెస్ట్‌లో వసుధారకు ఫస్ట్ వచ్చింది. పుష్పా నువ్వు వెళ్లి మన ప్రొఫెసర్స్ అందరికీ చెప్పి.. నోటీస్ బోర్డ్‌లో పెట్టించు’ అంటాడు. సరేనని పుష్ఫ వెళ్తుంది. వెంటనే వసు రిషి చేయి తీసుకుని.. ‘థాంక్యూ సార్.. ఇదంతా మీ చలవే.. మీరు ఆరోజు నా వెన్నంటే లేకపోతే నేను ఈ విషయం సాధించేదాన్నే కాదు’ అంటుంది. దాంతో రిషి క్షణాల్లో తను ప్రపోజ్ చేసిన సీన్ గుర్తొచ్చి.. వసు చేతిని వదిలేసి.. కోపంగా ముఖం పెట్టి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

ఇక పుష్ప ఆ గుడ్ న్యూస్‌ని జగతి, మహేంద్ర వాళ్లకు చెబుతుంది. అప్పుడే జగతిని పొగుడుతుంది మరో ప్రొఫెసర్ వసు సాధించిన విజయాల గురించి. దాంతో జగతి.. ‘వసుధార ఇప్పుడు నా స్టూడెంట్ కాదు.. తను గెలిచినా ఓడినా అది రిషి సార్‌కే చెందుతుంది’ అంటుంద జగతి. అది రిషి చెబిన పడుతుంది. ‘నేను గెలిచి ఓడానా? ఓడిపోయి గెలిచానా?’ అనుకుంటాడు రిషి మనసులో

ఇక సీన్ కట్ చేస్తే.. జగతి మహేంద్ర దగ్గరకు వచ్చి.. ‘మరో గుడ్ న్యూస్’ అంటుంది. ‘ఏంటది?’ అంటే.. ‘మినిస్టర్ గారు కాల్ చేశారు.. వసుధార సాధించిన విజయానికి.. ప్రభుత్వం తరపున అభినందనగా ఉంటూనే.. ఒక సామాజిక కార్యక్రమం చేద్దాం అన్నారు..’ అంటుంది. ‘అయితే ఇది రిషి, వసులకు కలిసి వచ్చేలా నువ్వే ప్లాన్ చెయ్ జగతి.. ఓ పదిరోజులు ఒకరితో ఒకరు ఉండేలా ఏదొకటి చెయ్ జగతి’అంటూ సంబరపడతాడు మహేంద్ర. ‘నీతో ఇదే సమస్య మహేంద్రా.. ముందు విషయం వాళ్లిద్దరికీ చెప్పాలి కదా’ అంటుంది జగతి.

ఇక మిస్టర్ ఇగో.. ఎప్పుడూ వెళ్లే అమ్మవారి దగ్గరకే వెళ్తాడు. ‘అమ్మా నువ్వు నా మాట వింటావ్.. నా మనసు తెలుసుకుంటావ్.. గతంలో ఒకసారి నీ దగ్గరకు వచ్చాను.. ఏం జరుగుతుందో తెలియదు.. కానీ జరగాల్సిందే జరిగింది. తన మనసులో ఏం ఉందో తెలియదు.. కానీ నేను లేను అనేసింది. నాకేం తెలియపోవచ్చు.. నీకు అన్నీ తెలుసు.. ఏం చెయ్యాలని ఉందో నువ్వే చేసేసెయ్.. నేను అడగలేను’ అంటూ తన మనసులోని భారాన్ని దించుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడే వసు ఆ అమ్మవారి దగ్గరకు రావడం చూపిస్తారు డైరెక్టర్.

కమింగ్ అప్‌లో..
రిషి.. పసుపుతో వసుధార అని రాస్తాడు అమ్మవారికి ముందు. వసు వచ్చి అవతలవైపు రిషి అని కుంకుమతో రాస్తుంది. రిషి సార్ లేనిదే నేను లేను.. నా విజయం లేదు..’ అంటూ తన మనసులోని మాటలను అమ్మవారి ముందు బయటపెడుతుంది. అయితే ఇద్దరూ అక్కడే ఉన్నారా? ఒకరు వెళ్లిన తర్వాత మరొకరు వచ్చారా? వసు రాసిన పేరుని రిషి.. రిషి రాసిన పేరుని వసు చూస్తారా లేదా? అనేది రేపటి ఎపిసోడ్‌లో చూడాల్సిందే. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.