యాప్నగరం

Guppedantha Manasu ఆగస్ట్ 2 ఎపిసోడ్: వసు కంటతడి-రిషిలో అలజడి.. ఇరుక్కున్న మహేంద్ర

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 ఆగస్ట్ 2)న 205 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. guppedantha manasu serial today august 2 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 2 Aug 2021, 10:23 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 ఆగస్ట్ 2)న 205 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ ఆగస్ట్ 2 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu August 2 episode


205వ ఎపిసోడ్‌ హైలైట్స్..
వసు శిరీష్‌తో చనువుగా ఉండటం గుర్తు చేసుకుని రగిలిపోతాడు రిషి. ‘వసు నేను సినిమాకి వెళ్తున్నాం’ అని శిరీష్ మాటని పట్టుకుని.. ‘వసుధరా.. తన గురించి నాకెందుకు ఈ టెన్షన్’ అంటూ విసుక్కుంటాడు కూడా. ఇక సీన్ కట్ చేస్తే.. జగతి బర్త్‌డే ఫోటోస్ రావడంతో.. రిషినే తెగ పొంగిపోతూ చూసుకుంటుంది. వసు ‘మేడమ్.. ఈ ఆనందాన్ని రెట్టింపు చెయ్యడానికి పాయసం చేస్తాను’ అంటుంది. పాయసం చెయ్యడానికి వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడే వస్తాడు రిషి. ఆవేశంగా ఊగిపోతూ.. ‘ఒక అమ్మాయికి అడ్మీషన్ ఇప్పించి.. ఇంట్లో పెట్టుకోవడం కాదు.. జాగ్రత్త కూడా ముఖ్యమే అంటూ ఫైర్ అవుతాడు.

ఇక వసు ఆ వాయిస్ విని.. బయటికి వస్తుంది. ‘మేడమ్‌కి నా గురించి ఏం చెబుతాన్నారు’ అంటుంది. ‘నువ్వు తెలివైన దానివే కావచ్చు.. కానీ అన్నీ తెలుసు అనుకోవడం తప్పు.. నువ్వు శిరీష్ సినిమాకి వెళ్లడం గురించి నీ మంచి గురించే చెబుతున్నాను’ అంటాడు. దాంతో వసు సీరియస్ అవుతుంది .నా పర్సనల్‌తో మీకు పనేంటీ అంటూ రివర్స్ అవుతుంది. దాంతో రిషి.. ‘నువ్వు ఎప్పుడు నా పర్సనల్‌లో ఎంటర్ కాలేదా’ అంటాడు. ‘నా పరిదిలోనే నేను ఉంటా.. ఎంటర్ అయ్యాను సార్.. ఇలా కాదు’అంటూ సీరియస్ అవుతుంది. దాంతో జగతి గొడవను ఆపేందుకు వసుపై కోప్పడుతుంది. దాంతో వసు తగ్గుతుంది. రిషి వెళ్లిపోతాడు.

ఇంటికి వెళ్లి రగిలిపోతుంటే.. మహేంద్ర వస్తాడు. ‘రిషి.. నిన్న నేను శిరీష్ సినిమాకి వెళ్లాం.. వసుకి పద్దతి తెలుసు కదా.. రాను అనేసిందట.. నేను వెళ్లాల్సి వచ్చింది’ అంటూ జరిగింది చెబుతాడు. దాంతో రిషీ షాక్ అయ్యి.. ‘అయ్యో నాకు చెప్పాలి కదా’ అంటూ కారు వేసుకుని వెళ్లిపోతాడు. మహేంద్ర షాక్‌లో ఉంటాడు. జగతి దగ్గరకు వెళ్లి.. ‘అసలు నీ కొడుకు నాకు అర్థం కాడు.. నీ కొడుకుని నువ్వే తీసేకో’ అంటాడు ఆవేశంలో. అది జగతి కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంది.

ఇక వసు ఆటో కోసం ఎదురు చూస్తుంటే.. మిస్టర్ ఇగో కారులో వచ్చి.. మాట్లాడాలి కారు ఎక్కమంటాడు. వసు కూడా.. ‘నేను మాట్లాడాలి.. ఇక్కడ కాదు’ అంటూ కారు ఎక్కి కూర్చుంటుంది. ఇద్దరూ ఓ చోటకి వెళ్లి ఇదే విషయంపై వాదించుకుంటూ ఉంటారు. ‘నాకు నిజం తెలియక మాటలు అనేశాను.. సారీ చెబుదాం అనుకుంటున్నాను’ అంటాడు రిషి. ‘సారీ కోసం ఎవరూ మొహమాసి లేరు సార్.. నిజంగానే శిరీష్‌తో వెళ్లి ఉంటే అది నా పర్సనల్’ అంటూ వసూ ఇచ్చి పడేస్తుంది. ఆ గొడవ కమింగ్ అప్‌లో కూడా కంటిన్యూ అవుతుంది కానీ.. సీన్ కట్ చేస్తే.. వసు మహేంద్ర ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ రిషికి కనిపిస్తుంది. ‘డాడ్ వసుని ఏం అన్నారు.. తను ఎందుకు ఏడుస్తుంది’ అంటూ రిషి సీరియస్ అవుతాడు. మహేంద్ర బహుశా జగతి, రిషీలను కలపడం గురించి మాట్లాడుతుంటే మాత్రం ఇరుక్కున్నట్లే. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.