యాప్నగరం

Guppedantha Manasu జూన్ 19 ఎపిసోడ్: వసుకి జ్వరం తగ్గాలని రిషి ఉపవాసం.. ప్రేమకు వేళాయెనే

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 జూన్ 19)న 167 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. ఇప్పుడు guppedantha manasu serial today june 19 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 19 Jun 2021, 10:55 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 జూన్ 19)న 167 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ జూన్ 19 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu June 19 episode


167వ ఎపిసోడ్‌ హైలైట్స్..
వసు కోసం జగతి, మహేంద్ర టెన్షన్ పడుతుంటే.. రిషి ఇంటి ముందుకు వచ్చి.. కారు హారన్ కొడుతూనే ఉంటాడు. ‘ఎవరు మేనస్ లేకుండా..’ అని మహేంద్ర, జగతి బయటికి వస్తారు. ‘వసుధారని బయటికి రమ్మనండి డాడ్’అని రిషి అనగానే.. ‘అను రాదు రిషి’ అనడంతో.. ‘హో విషయం మీదాకా తెలిసోయింది? పొగరు తనకి.. చెప్పేసిందా’ అంటూ ఏదేదో మాట్లాడేస్తాడు. దాంతో మహేంద్ర షాక్ అవుతాడు. ‘ఏం అంటున్నావ్ రిషీ.. తనకి బాలేదు.. జ్వరంగా ఉంది’ అనడంతో ఒక్కసారిగా రిషి షాక్ అవుతాడు. పరుగు పరుగున వసు ఉన్న రూమ్‌కి వెళ్లిపోతాడు. జగతి, మహేంద్ర షాక్ అవుతారు.

‘ఏంటీ వీడు?’ అనుకుంటారు. అయితే రిషి వసు రూమ్‌లో ‘వసుధార వసుధార’ అని పిలుస్తూనే ఉంటాడు. తలపై చెయ్యివేసి జ్వరం చెక్ చేస్తాడు. వెంటనే ‘డాడ్.. డాడ్..’ అని పిలిచి.. ‘వసుకి ఒళ్లు కాలిపోతుంది. అర్జెంట్‌గా హాస్పెటల్‌కి తీసుకుని వెళ్దాం పదండీ’ అని హడావుడి చేస్తాడు. దాంతో మహేంద్ర.. ‘తను వాళ్ల బావ గురించి భయపడింది నాన్నా.. తన మనసుకి అయిన గాయంతో ఈ జ్వరం వచ్చింది. .డాక్టర్ వచ్చి చెక్ చేశారు.. టాబ్లెట్స్ ఇచ్చారు’ అని రిషికి అర్థమయ్యేలా చెబుతాడు. అయితే రిషి.. ‘వసు మనసుకి కష్టం అయ్యిందని మహేంద్ర చెప్పిన మాటలతో చాలా డల్‌గా అయిపోతాడు. దానికి కారణం నేనే అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

దారిలో వెళ్తూ ఉండగా ఓ అమ్మవారు కనిపించడంతో.. అక్కడే ఆగిపోతాడు. దగ్గరకు వెళ్లి.. ‘అమ్మా.. అని చేతులెత్తి.. మొక్కుతూ.. ‘ఈ పిలుపుకి దూరమై బతుకుతున్నా.. నువ్వు సాయం చేసే అమ్మవని నమ్ముతున్నా’ అంటూ స్టార్ట్ చేస్తాడు. స్టార్టింగ్ రిషి డైలాగ్స్ ఎమోషనల్‌గా ఉన్నప్పటికీ తర్వాత తర్వాత ఆ డైలాగ్స్ కాస్త ఓవర్‌గా అనిపిస్తాడు. మొక్కుతున్నాను కానీ పువ్వులే తేలుదు.. కొబ్బిరికాయల తేలుదు.. అంటూ రిషి అంత బేలగా మాట్లాడే సీన్ కాస్త రిషి క్యారెక్టర్‌ని తగ్గించేట్టుగా అనిపిస్తోంది. మరీ అంత పేలవంగా డైలాగ్స్ రాయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది.

ఇక అమ్మ వారి దగ్గర మొక్కుకుని.. ఇంటికి బయలుదేరతాడు రిషి. అయితే దేవయాని ధరణికి.. వార్నింగ్ ఇస్తుంది. ‘ఏంటి ఈ మధ్య నువ్వు రిషీతో ఎక్కువ మాట్లాడుతున్నావ్. ఇక నుంచి రిషి ఏం చెప్పినా నాకు వివరంగా చెప్పాల్సిందే.. తేడా వస్తే మాత్రం నా సంగతి తెలుసుగా.. ఊరుకోను’ అని వార్నింగ్ ఇస్తుంది. అయితే కమింగ్ అప్‌లో.. రిషి.. వసు కోసం ఉపవాసం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అదే విషయాన్ని ధరణితో.. వివరం చెప్పకుండా.. ‘వదినా.. ఎవరికైనా బాగోలేదంటే.. ఉపవాసం చేస్తాం కదా.. నేను ఈ రోజంతా ఉపవాసం చేస్తాను’ అని అంటాడు. ధరణి ‘ఎవరి కోసం అని అడుగుతుంది కానీ రిషి ఏం సమాధానం చెబుతాడో రేపు చూడాలి. ఇక సీన్ జగతి ఇంట్లో ఓపెన్ చేస్తే.. ‘రిషి వసు కోసం చాలా తాప్రయపడుతున్నాడు’ అని మహేంద్ర అంటాడు. అప్పటికే లేచి కూర్చున్న వసు వింటుంది. రిషికి ఆకలేసిన ప్రతిసారీ ఫ్లవర్స్ కట్ చేసి అతికించాలని నిర్ణయించుకుంటాడు. వసుకి తగ్గేదాక తినకూడదని రిషి అనుకుంటాడు. ఆకలేస్తున్న ప్రతిసారీ ఫ్లవర్స్ అతికించుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఈ సీన్స్ అన్నీ తరువాయి భాగంలో చూద్దాం! ‘గుప్పెడంత మనసు’ కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.