యాప్నగరం

guppedantha manasu updates: సీసీ ఫుటేజ్‌ చూసి నిజం తెలుసుకున్న రిషి.. వసుపై ఉగ్రరూపం!

Guppedantha Manasu Upcoming Twist: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. 2022 సెప్టెంబర్ 21న 559వ ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. అయితే రాబోయే ట్విస్ట్ అదిరిపోయింది.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 22 Sep 2022, 5:12 pm
నిన్నటి ఎపిసోడ్‌లో రిషి మహేంద్రకు సారీ చెప్పడంతో పాటు.. వసుకి గడుపు విధిస్తాడు. మూడు రోజులు టైమ్ తీసుకో.. కానీ నాకు నచ్చే సమాధానం మాత్రమే చెప్పు.. అంటూ గట్టిగానే తన మనసులో ఉన్న విషయాన్ని చెబుతాడు. ఈ క్రమంలోనే లేటెస్ట్ ప్రోమో ఆసక్తిగా మారింది.
Samayam Telugu Guppedantha Manasu Upcoming Twist
‘గుప్పెడంత మనసు’ ట్విస్ట్(photo courtesy by star మా and disney+ hotstar)


బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న గుప్పెండత మనసు సీరియల్.. గత కొన్ని రోజులుగా చాలా ఉత్కంఠగా కొనసాగుతోంది. రిషి, వసులు ఒకరి మనసు ఒకరు తెలుసుకున్న నాటి నుంచి.. దేవయాని చేసిన రచ్చ వరకూ.. ప్రతీదీ ఆసక్తిగానే సాగింది. అయితే వసు.. రిషికి ప్రపోజ్ చేసిన తర్వాత.. రిషి వసుతో మనసు విప్పిన మాట ఒకటే. మన మధ్య దాపరికాలు ఉండకూడదు అని. అప్పుడే మరో ప్రశ్న వేశాడు. అదేంటంటే.. ‘చివరి పరీక్ష రోజున నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు అని. అయితే వసు నిజం చెప్పలేదు. ‘ఇప్పుడు సాక్షీనే ఇదంతా చేసింది అని రిషి సార్‌కి తెలిస్తే ఊరుకోరు.. కచ్చితంగా మళ్లీ గొడవ అవుతుంది’ అనుకుంటూ ఆ రోజు నిజం చెప్పదు. అదే ఇప్పుడు సమస్యగా మారనుంది.

ప్రోమో హైలైట్స్..
కాలేజ్‌లో తన క్యాబిన్‌లో రిషి తన ల్యాప్ టాప్‌కి పెన్ డ్రైవ్ అమర్చి.. సీసీ ఫుటేజ్ ఆన్ చేస్తాడు. ఆ ఫుటేజ్ ఆ రోజు వసుని కిడ్నాప్ చేసిన ఫుటేజ్. దానిలో వసుని ఒక ఆడ ఆవిడ ముక్క మూసి కిడ్నాప్ చేయడంతో పాటు.. అక్కడే ఉన్న సాక్షీ కూడా కనిపిస్తుంది. సాక్షీ? అంటూ షాక్ అవుతూ పైకి లేస్తాడు. ‘డేమిట్.. వసుధార ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచావా?’ అంటూ రగిలిపోతాడు. దాపరికాలు ఉండకూడదు అని చెప్పిన తర్వాత కూడా వసు దాచిన రెండో విషయం ఇది. మొదటి గురుదక్షిణ ఒప్పందం. దాన్ని దేవయాని బయటపెడితే.. దీన్ని సీసీ ఫుటేజ్ బయటపెట్టింది. చూడాలి మరి రిషి వసుని ఎలా నిదీస్తాడు.

మరోవైపు ఈ లేటెస్ట్ ప్రోమోలో మరో బిట్ కూడా ఆసక్తిగా మారింది. రిషి ఇంటికి వెళ్తాడు. ధరణీ రూమ్‌కి కంగారుగా వెళ్తాడు. వెనుకే వసు కూడా వెళ్తుంది. అప్పటికి ధరణీ నిద్రపోయి ఉంటుంది. ‘తను నాకోసం వస్తేనే ఇలా అయ్యింది సార్..’ అంటుంది దిగులుగా బాధగా. వెంటనే రిషి కోపంగా.. మనసులో ఏదో పెట్టుకుని.. ‘నీ కోసం ఎవరు వచ్చినా ప్రశాంతంగా ఉండనివ్వవు..’ అనేస్తాడు. నిజానికి ప్రేమికుల మధ్య అది చాలా పెద్ద మాట. వసు ఆ మాటకు తట్టుకుంటుందో లేక ఏడుస్తుందా? నాదేం తప్పు ఉందని నిలదీస్తుందో చూడాలి.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.