యాప్నగరం

Guppedantha Manasu ఆగస్ట్ 5 ఎపిసోడ్: సీరియస్ సింహాన్ని సైకిల్ ఎక్కించుకున్న వసు, ఇద్దరూ ఆ అమ్మవారి గుడికే..

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 ఆగస్ట్ 5)న 206 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. guppedantha manasu serial today august 5 episode హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 5 Aug 2021, 8:51 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 ఆగస్ట్ 5)న 206 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ ఆగస్ట్ 5 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu August 5 episode


206వ ఎపిసోడ్‌ హైలైట్స్..
రిషి, మహేంద్ర ఇద్దరూ వర్క్ ఔట్స్ చేస్తూ... మాట్లాడుకుంటూ ఉంటారు. జగతి గురించి నాతో మాట్లాడొద్దు అని ఇన్ డైరెక్ట్‌గా చెప్పిన రిషితో.. మహేంద్ర రిక్వస్ట్‌గా.. ‘రిషీ నాకు నా జీవితంలో ఇద్దరూ ముఖ్యమే.. నిన్ను నా చేతుల్లో పెట్టింది జగతినే కదా..’ అంటూ ఎమోషనల్‌ అవుతాడు. దాంతో రిషి కూల్‌గానే.. మరో సారీ ఈ డిస్కర్షన్ వద్దు అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఈ క్రమంలో వసు ధరణికి కాల్ చేసి మంచి టెంపుల్ ఎక్కడుంది? నేనో మొక్కు మొక్కుకోవాలి అంటుంది. సరిగ్గా అప్పుడే రిషి ధరణి దగ్గరకు వచ్చి.. ‘వదినా ఎవరు ఫోన్ అనడంతో.. ధరణి వసు కాల్ చేసిందని.. మొక్కు కోవడానికి మంచి గుడి ఎక్కడుంది అని అడుగుతోంది అనడంతో.. రిషి ఫోన్ తీసుకుని.. వసుకి తన గతంలో వసుకి జ్వరం వచ్చినప్పుడు మొక్కుకున్న అమ్మవారి గురించి చెబుతాడు.

అమ్మవారి పేరు నాకు ఐడియా లేదు కానీ.. దారి, ఆనవాళ్లు చెబుతాను.. ఆ అమ్మవారు వెరీ పవర్ ఫుల్ అంటాడు. దాంతో వసు అక్కడికే వెళ్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వసు జగతితో మాట్లాడుతుండగా.. శిరీష్ వస్తాడు. రిషి చెప్పిన ఆనవాళ్లతో గుడికి తీసుకుని వెళ్లమని శిరీష్‌ని అడగడంతో.. శిరీష్ వసుని అదే గుడికి తీసుకుని వెళ్తాడు. రిషి కూడా వసుని వెతుక్కుంటూ.. ‘ఈ వసుధర ఏం మొక్కకుంటుంది’ అనుకుంటూ అక్కడికే వెళ్తాడు.

అయితే అమ్మవారి ముందు దన్నం పెట్టుకుంటున్న శిరీష్‌ని వసుని చూసి కాస్త ఇబ్బందిగా అయిష్టంగా చూస్తాడు. కమింగ్ అప్‌లో రిషి, వసు మాత్రమే ఓ చోట కూర్చుని ఉంటే.. పూల అమ్మే ఆమె వస్తుంది. మీ జంట చాలా బాగుంది అనడంతో ఒకరిని ఒకరు చూసుకుంటారు వసు, రిషి. ఇక కారులో తిరిగి వెళ్తుంటే.. కారు ప్రాబ్లమ్ వచ్చి.. ఆగిపోతుంది. అయితే వసు ఓ పంతులు సైకిల్ మీద వెళ్తుంటే.. వసు అతడ్ని చూసి.. ‘సార్ మనం సైకిల్ మీద వెళ్దామా’ అంటుంది. ఎవరు తొక్కుతారు అంటాడు రిషి. కట్ చేస్తే.. వసునే రిషిని ముందు కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతుంది. ఈ సీన్ సూపర్ హిట్ కాబోతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.