గత ఎపిసోడ్లో మాధవ కావాలనే దేవి ముందు తన మొదటి భార్యతో మాట్లాడి.. దేవి తల్లి ఆమె అన్నట్లుగా క్రియేట్ చేస్తాడు. దాంతో దేవి తన తల్లి ఆమె అనుకుంటుంది. రాధ కాదు అనుకుంటుంది. ఈ క్రమంలోనే నేటి కథనం మరింత ఉత్కంఠగా మారింది.
551వ ఎపిసోడ్ హైలైట్స్..
రాధ దగ్గరకు బాధగా వచ్చిన దేవి.. ‘అమ్మా నాకు నిజం తెలిసింది.. నువ్వు మా అమ్మవి కాదు కదా..’ అంటుంది. దాంతో రాధ చాలా ఏడుస్తుంది. నేను మీ అమ్మనే తల్లి అని కుమిలిపోతుంది. ఇక అదే విషయం తలుచుకుంటూ రాధ.. ఆదిత్య దగ్గరకు వెళ్తుంది. ఆదిత్య మరో నిజం చెబుతాడు. ‘అమ్మకు ఎవరో సిద్ధాంతి నువ్వు బతికే ఉన్నావని చెప్పారట.. అందుకే అదే నమ్మకంతో ఉంటోది అమ్మ’ అంటూ నిజం చెప్పడంతో రాధ షాక్ అయిపోతుంది. ‘ఇదేంది పెన్విటీ.. ఆ పొద్దే చనిపోతే అయిపోయేదేమో’ అని ఆదిత్య ముందే అల్లాడిపోతుంది.
‘రుక్మిణీ నువ్వేదైనా విషయం గురించి ఇబ్బంది పడుతున్నావా? లేక బాధపడుతున్నావా? అని ఆరా తీస్తాడు ఆదిత్య. ‘బాధపడుతున్నా కానీ నేను ఇప్పుడు ఏం చెప్పలేను పెన్విటీ..’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ కారులో వెళ్తూ వెళ్తూ ఓ చోట బాధగా కూర్చున్న దేవి చూసి ఆగుతుంది. దగ్గరకు వెళ్లి పలకరిస్తుంది. ప్రేమగా ముద్దాడి.. తనతో పాటు ఇంటికి కూడా తీసుకుని వెళ్తుంది. అయితే దేవి మాత్రం అంతే బాధగా దుఃఖాన్ని ఆపుకుంటూ అల్లాడిపోతుంటుంది. గమనించిన వాళ్లంతా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు.
కమింగ్ అప్లో.. దేవుడమ్మ ఆదిత్యతో ‘పాపం దేవి బాధపడుతుందిరా.. రాధ వాళ్ల సొంత అమ్మ కాదట.. దేవినే చెప్పింది’ అనడంతో ఆదిత్య షాక్ అయిపోతాడు. మొత్తానికీ దేవి రాధ సొంత బిడ్డ కాదు అంటే.. తన బిడ్డ చిన్మయి అని నమ్మడం మొదలుపెడతాడు ఆదిత్య. మాధవ చేసిన కుట్ర ఈ రకంగా ఫలించింది. పాపం దేవి తన తల్లి రుక్మిణీనే తన తల్లి కాదు అనుకోవడం ఒక ఎత్తైతే.. ఇప్పుడు ఆదిత్య తన సొంత బిడ్డ దేవిని తన బిడ్డ కాదు అని నమ్ముతాడు. మొత్తానికి కథనం ఉత్కంఠగా మారింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! devatha కొనసాగుతోంది.
551వ ఎపిసోడ్ హైలైట్స్..
రాధ దగ్గరకు బాధగా వచ్చిన దేవి.. ‘అమ్మా నాకు నిజం తెలిసింది.. నువ్వు మా అమ్మవి కాదు కదా..’ అంటుంది. దాంతో రాధ చాలా ఏడుస్తుంది. నేను మీ అమ్మనే తల్లి అని కుమిలిపోతుంది. ఇక అదే విషయం తలుచుకుంటూ రాధ.. ఆదిత్య దగ్గరకు వెళ్తుంది. ఆదిత్య మరో నిజం చెబుతాడు. ‘అమ్మకు ఎవరో సిద్ధాంతి నువ్వు బతికే ఉన్నావని చెప్పారట.. అందుకే అదే నమ్మకంతో ఉంటోది అమ్మ’ అంటూ నిజం చెప్పడంతో రాధ షాక్ అయిపోతుంది. ‘ఇదేంది పెన్విటీ.. ఆ పొద్దే చనిపోతే అయిపోయేదేమో’ అని ఆదిత్య ముందే అల్లాడిపోతుంది.
‘రుక్మిణీ నువ్వేదైనా విషయం గురించి ఇబ్బంది పడుతున్నావా? లేక బాధపడుతున్నావా? అని ఆరా తీస్తాడు ఆదిత్య. ‘బాధపడుతున్నా కానీ నేను ఇప్పుడు ఏం చెప్పలేను పెన్విటీ..’ అంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. సీన్ కట్ చేస్తే.. దేవుడమ్మ కారులో వెళ్తూ వెళ్తూ ఓ చోట బాధగా కూర్చున్న దేవి చూసి ఆగుతుంది. దగ్గరకు వెళ్లి పలకరిస్తుంది. ప్రేమగా ముద్దాడి.. తనతో పాటు ఇంటికి కూడా తీసుకుని వెళ్తుంది. అయితే దేవి మాత్రం అంతే బాధగా దుఃఖాన్ని ఆపుకుంటూ అల్లాడిపోతుంటుంది. గమనించిన వాళ్లంతా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు.
కమింగ్ అప్లో.. దేవుడమ్మ ఆదిత్యతో ‘పాపం దేవి బాధపడుతుందిరా.. రాధ వాళ్ల సొంత అమ్మ కాదట.. దేవినే చెప్పింది’ అనడంతో ఆదిత్య షాక్ అయిపోతాడు. మొత్తానికీ దేవి రాధ సొంత బిడ్డ కాదు అంటే.. తన బిడ్డ చిన్మయి అని నమ్మడం మొదలుపెడతాడు ఆదిత్య. మాధవ చేసిన కుట్ర ఈ రకంగా ఫలించింది. పాపం దేవి తన తల్లి రుక్మిణీనే తన తల్లి కాదు అనుకోవడం ఒక ఎత్తైతే.. ఇప్పుడు ఆదిత్య తన సొంత బిడ్డ దేవిని తన బిడ్డ కాదు అని నమ్ముతాడు. మొత్తానికి కథనం ఉత్కంఠగా మారింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! devatha కొనసాగుతోంది.