గత ఎపిసోడ్లో దేవి రాధని నువ్వు మా అమ్మవి కాదు కదా అనడం.. రాధ కుమిలి కుమిలి ఏడవడం తెలిసిందే. అయితే దేవి అదే దిగులుతో బాధగా ఓ చోట కూర్చుంటే.. దేవుడమ్మ చూసి.. తనని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అక్కడ కూడా దేవి డల్గానే ఉంటుంది. 552వ ఎపిసోడ్ హైలైట్స్..
దేవి డల్గా ఉండటంతో అంతా.. ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ నవ్వించే ప్రయత్నం చేస్తారు. కానీ దేవి డల్గానే ఉంటుంది. ఇంతలో ఆదిత్య రావడంతో దేవి ముఖంలో నవ్వు వస్తుంది. ఆ తర్వాత దేవితో కలిసి ఇంట్లో వాళ్లంతా సరదగా కబడ్డీ ఆడతారు. తీరా ఆట మధ్యలో ఆదిత్య దేవుడమ్మని అమ్మా అని పిలవడంతో.. దేవికి తన తల్లి గురించి తెలిసిన నిజం గుర్తొచ్చి మళ్లీ డల్గా మారిపోతుంది. ఇక ఇంటికి పోతాను అంటుంది. దేవుడమ్మ దేవిని తీసుకుని బయలుదేరుతుంది.
ఇక రాధ ఆవేశంగా మాధవ గదిలోకి వెళ్తుంది. ‘నా బిడ్డ మనసు ఎందుకు పాడు చేస్తున్నారు’ అంటూ అరుస్తుంది. ఇది మంచి పద్దతి కాదు.. ఆడదాన్ని కోరుకుని పసిమనసుని నాశనం చేసుడేంది.. ఇట్లైతే బిడ్డని తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోతాను’ అంటూ తిడుతుంది. అప్పటి దాకా నాకేం తెలియదు.. నేనేం చెయ్యలేదు అన్న మాధవ రివర్స్ అయిపోతాడు. ‘వదిలి వెళ్లాల్సి వస్తే నువ్వు ఒక్కదానివి మాత్రమే వెళ్తావు.. నీ బిడ్డ నీతో రాదు.. దేవి మనసులో నువ్వు తల్లివి కాదు కదా’ అని నవ్వుతాడు. రాధ షాక్ అయిపోతుంది. నిప్పుతో పెట్టుకుంటున్నావ్.. రాధతోనే కదా మాట్లాడేది అని అనుకుంటున్నావేమో.. పాత రుక్కుగా మార్చొద్దు.. తట్టుకోలేవు సారు..’ అంటూ శివాలెత్తుతుంది. అచ్చం పాత రుక్కు ఆవేశం అంతా రాధలో కనిపిస్తుంది.
ఇక సీన్ కట్ చేస్తే.. పార్క్లో దేవుడమ్మ దేవికి ప్రేమగా తినిపిస్తూ నీ సమస్య ఏంటి ఎందుకు అలా ఉన్నావ్ అంటూ ఆరా తీస్తుంది. ‘నాకు చెప్పకున్నా మీ అమ్మకైనా చెప్పుకోవచ్చు కదా అంటూ సలహా ఇస్తుంది. అప్పుడే దేవి.. ‘మాయమ్మలేదుగా చనిపోయింది. రాధమ్మ మాయమ్మ కాదట’ అంటూ తను మాధవ మాటలు విన్న సీన్ మొత్తం చెప్పుకొస్తుంది. నిజం తెలిసిన దేవుడమ్మ నిర్ఘాంతపోతుంది.
వెంటనే దేవిని దగ్గరకు తీసుకుని.. ‘అలా అనుకోవద్దు.. రాధమ్మ నిన్ను తల్లిగా పెంచింది కాబట్టి తనే మీ అమ్మ.. తనని బాధపెట్టకూడదు’ అంటూ సర్దిచెబుతుంది. వెంటనే దేవిని తీసుకుని మాధవ ఇంటికి వస్తుంది. దూరం నుంచే రాధ.. దేవుడమ్మని చూసి గదిలోకి వెళ్లిపోతుంది. అయితే దేవుడమ్మ రాధతో మాట్లాడటానికే వచ్చింది. ‘వెళ్లమ్మా దేవి.. అమ్మని నేను పిలిచాను అని చెప్పి పిలువు’ అనడంతో దేవి లోపలికి వెళ్లి రాధతో చెబుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! devatha కొనసాగుతోంది.
దేవి డల్గా ఉండటంతో అంతా.. ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ నవ్వించే ప్రయత్నం చేస్తారు. కానీ దేవి డల్గానే ఉంటుంది. ఇంతలో ఆదిత్య రావడంతో దేవి ముఖంలో నవ్వు వస్తుంది. ఆ తర్వాత దేవితో కలిసి ఇంట్లో వాళ్లంతా సరదగా కబడ్డీ ఆడతారు. తీరా ఆట మధ్యలో ఆదిత్య దేవుడమ్మని అమ్మా అని పిలవడంతో.. దేవికి తన తల్లి గురించి తెలిసిన నిజం గుర్తొచ్చి మళ్లీ డల్గా మారిపోతుంది. ఇక ఇంటికి పోతాను అంటుంది. దేవుడమ్మ దేవిని తీసుకుని బయలుదేరుతుంది.
ఇక రాధ ఆవేశంగా మాధవ గదిలోకి వెళ్తుంది. ‘నా బిడ్డ మనసు ఎందుకు పాడు చేస్తున్నారు’ అంటూ అరుస్తుంది. ఇది మంచి పద్దతి కాదు.. ఆడదాన్ని కోరుకుని పసిమనసుని నాశనం చేసుడేంది.. ఇట్లైతే బిడ్డని తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోతాను’ అంటూ తిడుతుంది. అప్పటి దాకా నాకేం తెలియదు.. నేనేం చెయ్యలేదు అన్న మాధవ రివర్స్ అయిపోతాడు. ‘వదిలి వెళ్లాల్సి వస్తే నువ్వు ఒక్కదానివి మాత్రమే వెళ్తావు.. నీ బిడ్డ నీతో రాదు.. దేవి మనసులో నువ్వు తల్లివి కాదు కదా’ అని నవ్వుతాడు. రాధ షాక్ అయిపోతుంది. నిప్పుతో పెట్టుకుంటున్నావ్.. రాధతోనే కదా మాట్లాడేది అని అనుకుంటున్నావేమో.. పాత రుక్కుగా మార్చొద్దు.. తట్టుకోలేవు సారు..’ అంటూ శివాలెత్తుతుంది. అచ్చం పాత రుక్కు ఆవేశం అంతా రాధలో కనిపిస్తుంది.
ఇక సీన్ కట్ చేస్తే.. పార్క్లో దేవుడమ్మ దేవికి ప్రేమగా తినిపిస్తూ నీ సమస్య ఏంటి ఎందుకు అలా ఉన్నావ్ అంటూ ఆరా తీస్తుంది. ‘నాకు చెప్పకున్నా మీ అమ్మకైనా చెప్పుకోవచ్చు కదా అంటూ సలహా ఇస్తుంది. అప్పుడే దేవి.. ‘మాయమ్మలేదుగా చనిపోయింది. రాధమ్మ మాయమ్మ కాదట’ అంటూ తను మాధవ మాటలు విన్న సీన్ మొత్తం చెప్పుకొస్తుంది. నిజం తెలిసిన దేవుడమ్మ నిర్ఘాంతపోతుంది.
వెంటనే దేవిని దగ్గరకు తీసుకుని.. ‘అలా అనుకోవద్దు.. రాధమ్మ నిన్ను తల్లిగా పెంచింది కాబట్టి తనే మీ అమ్మ.. తనని బాధపెట్టకూడదు’ అంటూ సర్దిచెబుతుంది. వెంటనే దేవిని తీసుకుని మాధవ ఇంటికి వస్తుంది. దూరం నుంచే రాధ.. దేవుడమ్మని చూసి గదిలోకి వెళ్లిపోతుంది. అయితే దేవుడమ్మ రాధతో మాట్లాడటానికే వచ్చింది. ‘వెళ్లమ్మా దేవి.. అమ్మని నేను పిలిచాను అని చెప్పి పిలువు’ అనడంతో దేవి లోపలికి వెళ్లి రాధతో చెబుతుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! devatha కొనసాగుతోంది.