యాప్నగరం

Guppedantha Manasu: రిషిధారని కిడ్నాప్‌ చేయించింది దేవయాని కొడుకు శైలేంద్ర భూషణే.. ఇదిగో సాక్ష్యం

Guppedantha Manasu New Villain: గుప్పెడంత మనసు సీరియల్‌లోకి ఓ కొత్త గుండుబాస్ వచ్చాడు. అతను ఎవరో కాదు.. ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్ జెండే అలియాస్ రామ్ జగన్. ఇప్పుడు ఇతను సేమ్ గెటప్‌ అండ్ సెటప్‌తో ‘గుప్పెడంత మనసు’లోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ గుండు బాస్‌కి ఇంకో బాస్ ఉన్నారు.. అతనే రిషిధారల కిడ్నాప్ ప్లాన్ చేశాడు. సౌజన్య రావు పాత్రధారిగా ఉన్నా.. అసలు సూత్రధారి మాత్రం ఎస్.బి. ఈ ఎస్ బీ ఎవరంటే..

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 12 Apr 2023, 8:51 pm
నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్‌లో రిషిధారలు ఊహించని ప్రమాదంలో చిక్కారు. కొత్త విలన్‌ సౌజన్య రావు (ప్రేమ ఎంత మధురం జెండే- రామ్‌ జగన్‌) ఎంట్రీ ఇవ్వడం.. అతడే కిడ్నాప్‌కి మొత్తం ప్లాన్‌ చేయడం.. వెనుక ఉండి నడిపించడం చూశాం. కొత్త విలన్ ఎంట్రీ కథనం ఆసక్తిగా మారింది. అయితే ఈ గుండు బాస్‌కి మరో బాస్ ఉన్నాడనే మరో ట్విస్ట్. ఆ బాస్ ఎవరో కాదు.. దేవయాని కొడుకు, ధరణి భర్త అయిన శైలేంద్ర భూషణ్‌ అనేదే అసలు ట్విస్ట్.
Samayam Telugu guppedantha manasu new villain
గుప్పెడంత మనసు సీరియల్ విలన్


ఆ ట్విస్ట్ ఎలా బయటపడిందంటే.. రిషి, వసులను త్రివేణి అనే అమ్మాయి.. తెలివిగా ట్రాప్‌ చేసి.. ఓ ఇంటికి తీసుకొచ్చింది. అక్కడే మరో ఇద్దరు రౌడీలతో కలిసి వసు, రిషీలను ఆ ఇంట్లో ఓ గదిలో బందించగలిగింది. అయితే సౌజన్య రావుకి వచ్చిన ఓ మెసేజ్‌తో అసలు విలన్‌ సౌజన్యరావు కాదు.. వెనుక మరొకరు ఉన్నారు అని తెలుస్తుంది. ఆ వ్యక్తి సౌజన్యరావుకి నేటి కథనంలో కొన్ని మెసేజ్‌లు చేశాడు. అవేంటంటే.. ‘పని అయ్యిందా? వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోవడానికి వీల్లేదు.. జాగ్రత్త’ అంటూ ఆర్డర్‌ వేశాడు. సరే సార్‌ అంతా మీరు చెప్పినట్లే చేస్తాను’ అంటూ సౌజన్య రావు రిప్లై ఇచ్చాడు.

అయితే ఆ చాటింగ్‌ జరిగేటప్పుడు.. సౌజన్య రావు ఫోన్‌లో ఎస్‌బి (SB) అనే పేరు స్పష్టంగా కనిపించింది. శైలేంద్ర భూషణ్‌ అనే పేరునే ఎస్‌బి అని సేవ్‌ చేసుకుని ఉంటాడు. అంటే ఈ కిడ్నాప్‌ వెనుక దేవయాని కొడుకు ఉన్నాడని అర్థమవుతుంది. ధరణి భర్త వేరే దేశంలో ఉన్నాడన్నది తెలిసిన సంగతే. అయితే దేవయాని తన అధికారం, పెత్తనం సాధించడానికి.. తన కొడుకుతో కలిసే.. రిషి కుటుంబంపై పగా సాధిస్తోంది.. పైగా నేడు సౌజన్యరావు మాటల్లో.. రిషి అనుమానాలకు కొన్ని సమాధానాలు ఇచ్చేశాడు డైరెక్టర్‌.

అవేంటంటే.. అతనెవరో నాకు తెలుసు వసుధార అని అంటాడు రిషి. దాన్ని బట్టి. ఆ శత్రువు రిషికి సంబంధించిన వ్యక్తే అని తేలిపోయింది. ‘మనం ఏరోజు ఎవరికీ అన్యాయం చేసింది లేదు.. కానీ ఎందుకు శత్రువులు పెరుగుతున్నారు?’ అని రిషి ఆవేదన చెందుతుంటే.. ‘అది కేవలం అధికారం కోసమేనని.. రాజుకే కదా శత్రువుల ఉండేదని..’ సౌజన్య రావుతో అనిపిస్తారు డైరెక్టర్‌. మొత్తానికీ పరోక్షయుద్ధం నుంచి.. ప్రత్యక్షయుద్ధంలోకి దిగబోతున్నారేమో ఈ తల్లీకొడుకులు. చూద్దాం ఏం జరుగుతుందో? అతను ఊహించనట్టుగానే శైలేంద్ర భూషణా? లేదంటే మరో వ్యక్తా అన్నది త్వరలో రివీల్ కాబోతుంది.

Read Also: రేటింగ్‌లో బుసకొట్టిన ‘నాగపంచమి’.. పాత రికార్డుల్ని బ్రేక్ చేసిన కొత్త సీరియల్‌
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.