యాప్నగరం

Guppedantha Manasu ఆగష్టు 15: వసుని పీటల మీద కూర్చోమన్నా రిషి.. సాక్షీ ఉగ్రరూపం

Guppedantha Manasu August 15 Episode: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2022 ఆగష్టు 15)న 527 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Guppedantha Manasu August 15 Episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 15 Aug 2022, 10:10 pm
సాక్షీ, రిషీల నిశ్చితార్థం ఏర్పట్లు మొదలైన సంగతి తెలిసిందే. ఓవైపు వసు, జగతీల ఆందోళన.. మరోవైపు రిషీ ఆవేదన.. తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి కథనం చాలా ఉత్కంఠగా మారింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ 2022 ఆగష్టు 15 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu 2022 August 15 Episode


527 ఎపిసోడ్‌ హైలైట్స్..
ఓ వైపు వసు గుండె ముక్కలైపోతుంది. మరో పక్క సాక్షీ ఆనందంలో మునిగి తేలుతుంది. ఈ క్రమంలోనే రిషి కిందకి వస్తాడు. పంతులు వస్తాడు. పూజ మొదలవుతుంది. రిషి, వసుల కళ్లు కలుస్తాయి కానీ విషాదే పలకరిస్తుంది. ఈ క్రమంలోనే సాక్షీ చీర మార్చుకుని రావాల్సి ఉండటంతో.. దేవయాని కావాలనే.. ‘వసుధారా వెళ్లు సాక్షీకి సాయం చెయ్’ అంటూ పంపిస్తుంది. ఇక సాక్షీ చీర కట్టుకుంటూ.. వసుని వెటకారంగా చాలా మాటలు అంటుంది. కానీ వసు మౌనంగానే భరిస్తుంది. ఇంతలో జగతి వచ్చి.. ‘సాక్షీ పిలుస్తున్నారు’ అంటుంది. దాంతో సాక్షీ జగతీ వెనుకే బయలుదేరుతుంది.

అయితే ఆ గది బయటే రిషి దేవుడికి దన్నం పెట్టుకుంటూ ఉంటాడు. తిరిగి చూసేసరికి సాక్షీని జగతీ తీసుకొస్తుంటే.. రిషికి సాక్షీ స్థానంలో వసుధారే కనిపిస్తుంది. పెళ్లి కూతురు చీరలో మురిసిపోతూ.. సిగ్గు పడుతూ వసు తన దగ్గరకు నడిచి వస్తున్నట్లుగా కనిపించడంతో రిషి ఒక్క క్షణం మయమరిచిపోతాడు. తేరుకుని చూస్తే సాక్షీ ఉండటంతో అల్లాడిపోతాడు. వెంటనే తిరిగి దేవుడిని చూస్తూ దన్నం పెట్టుకుంటాడు రిషి. ఇక మహేంద్ర కూడా అక్కడికి వస్తాడు. ‘మహేంద్రా మీరు వెళ్లండి సాక్షీని తీసుకుని నేను వస్తాను’ అంటుంది జగతి. దాంతో రిషిని తీసుకుని మహేంద్ర కిందకి వెళ్లిపోతాడు. సాక్షీ దన్నం పెట్టుకోగానే.. ‘ఏంటి ఆంటీ.. ఓడిపోతున్ననందుకు దిగులుగా ఉందా’?’ అంటూ వెటకారంగా చేస్తుంది.

జగతి అప్పుడు కూడా నిర్ణయం మార్చుకోమని ఇన్ డైరెక్ట్‌గా సాక్షీకి చెబుతుంది. అయితే సాక్షీ వినిపించుకోదు. పైగా.. ‘ఆంటీ మీరు ఎంతైనా రిషి తల్లి.. ఆ గౌరవంతోనే మీరు ఎన్ని అన్నా నేను పట్టించుకోను. అన్నీ మరిచిపోయాను.. మీరంటే నాకు ఎప్పుడు గౌరవమే’ అంటుంది. ఇంతలో పంతులు పిలవడంతో.. ‘పదండి ఆంటీ పిలుస్తున్నారు’ అంటుంది సాక్షీ. ఇక ఇద్దరూ కిందకి వెళ్తారు. అప్పటికే వసు కింద ఉంటుంది. అంతా సాక్షీ కోసం ఎదురు చూస్తూ ఉండగా.. సాక్షీ పెళ్లి కూతురు చీరలో వస్తుంది. పంతులు కూర్చోమంటాడు. అప్పుడే రిషి.. ‘వసుధారా కూర్చో’ అనేస్తాడు పక్కకు చేయి చూపిస్తూ సాక్షీతో. అంతా షాక్. సాక్షీ రగిలిపోతుంది. అప్పుడే దేవయాని.. ‘సాక్షీ కూర్చో ప్లీజ్’ అంటూ సైగ చేస్తుంది. దాంతో కూర్చుంటుంది సాక్షి.

ఇక ఉంగరాలు మార్చుకునే సమయం వస్తుంది. మొదట అమ్మాయి చేతికి ఉంగరం తొడగండి’ అంటాడు పంతులు. రిషి ఉంగరం తీసి తొడుగుతుంటే సాక్షీ షాక్ అయిపోతుంది. ‘ఏంటిది అంటూ రిషి చేతిలోని ఉంగరం తీసుకుని పైకి లేస్తుంది. దాని మీద వి అని ఉండటం అందరికీ చూపిస్తూ.. ‘ఈ అక్షరం ఏంటీ.. వి అని ఉంది’ అంటూ అరుస్తుంది. వసు షాక్ అయిపోతుంది. ఎస్ అని ఉండాల్సిన రింగ్.. వి అని ఉండటంతో.. సాక్షీ ఆవేశానికి కట్టలు తెంచుకుంటాయి. మరి నిశ్చితార్థం ఆగుతుందో లేదో చూడాలి. రిషి మౌనంగా తలదించుకుంటాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.
Read also: కార్తీకదీపం రేపటి ట్విస్ట్: మార్చురీకి వెళ్లిన దీప.. ఆ శవం డాక్టర్ బాబుదే! గుండెలు పగిలేలా రోదన
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.