యాప్నగరం

మా ఆయనకి మ్యాటర్ లేదు.. నాకు ఉంది.. ఇక నాన్ స్టాప్‌‌గా..: రీతూ చౌదరి ఇదేం దరిద్రం బాబోయ్

పెళ్లి చూపులు షోతో పాపులర్ అయిన హైదరాబాద్ భామ రీతూ చౌదరి.. గోరింటాకు సీరియల్‌లో నెగిటివ్ రోల్ పోషించి గాయిత్రిగా పాపులర్ అయ్యింది. ఈ తరువాత వరుస సీరియల్స్, సినిమాలతో పాటు స్పెషల్ ఈవెంట్స్‌తో బిజీగా మారింది. తాజాగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కామెడీ షోలో కనిపించి రచ్చ చేసింది.

Samayam Telugu 16 Jun 2021, 7:55 pm
గతవారం ఈటీవీలో ప్రసారం అయిన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఎపిసోడ్‌పై వివాదం రేగుతున్న విషయం తెలిసింది. ‘జంబలకిడి పంబ’ స్పూఫ్‌లో భాగంగా జబర్దస్త్ కమెడియన్లు రెచ్చిపోయారు. అమ్మాయిలు, అబ్బాయిలుగా అబ్బాయిలు అమ్మాయిలుగా చేసి పచ్చి బూతులతో బరితెగించి తెగ నటించేశారు. చివరికి బతుకమ్మ పాటను సైత హేళన చేయడంతో దానిపై వివాదం నడుస్తోంది. హైపర్ ఆది క్షమాపనలు తెలియజేసినా తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ బహిరంగ హెచ్చరికలు జారీ చేసింది. హైపర్ ఆదిని హైదరాబాద్‌లో తిరగనియ్యం అంటూ హెచ్చరించారు.
Samayam Telugu రీతూ చౌదరి
Rithu Chowdary Sridevi Drama Company


అయితే ఇదే స్కిట్‌లో హైపర్ ఆదికి పెయిర్‌గా నటించిన సీరియల్ నటి రీతు చౌదరి డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రెచ్చిపోయింది. ఆమె ఒక మహిళ అనే విషయాన్ని మరిచిపోయి దారుణమైన భాషలో చెలరేగిపోయింది. ఫ్యామిలీతో కలిసి చూస్తే.. ఛీ ఛీ అనేట్టుగా ఉన్న ఈ ఎపిసోడ్‌లో చాందిని-హైపర్ ఆదిలు అసభ్యకరమైన రీతిలో స్కిట్ చేశారు.

View this post on Instagram A post shared by Rithu chowdhary_official (@rithu_chowdhary)

మగాళ్లు ఒట్టి మాయగాళ్లే.. అంటూ మందు బాటిల్ పట్టుకుని.. మొత్తం చిరిగిపోయిన ఉన్న ఫ్యాంట్‌తో దర్శనం ఇచ్చింది రీతూ చౌదరి. ఆదిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇంతమంది ఆడవాళ్లు ఉండగా.. పండటం అవసరమా?’ అని నోటికి పనిచెప్పడం మొదలుపెట్టింది. ఇక ఆది కూడా ఆమెను పట్టుకుని తెగ రెచ్చిపోయాడు. మెడలో తాళి వేసుకుని ‘మా ఆవిడకు అనుమానం ఎక్కవ’ అని అంటుండగా.. సీన్‌లోకి వచ్చిన రీతూ చౌదరి.. ‘ఏం చేస్తున్నావ్ ఇక్కడ అని అడగ్గా’.. ఏం లేదండీ.. మీరు ఓ అరగంట బయటకు వెళ్లి రావాలి అని ఆది అంటే.. ‘అరగంట బయటకా.. ఈ టైంలో ఎవడితో***’ అంటూ బూతు సైగలు చేసింది రీతూ చౌదరి. ఆమె బరితెగించిన మాటలకు ఆది తెగ పొంగిపోగా మిగిలిన జబర్దస్త్ కంటెస్టెంట్లు కిందపడి పోయి మరీ నవ్వుకుని ఎంజాయ్ చేశారు.

View this post on Instagram A post shared by Rithu chowdhary_official (@rithu_chowdhary)

‘కూరగాయలు అమ్మేదాన్ని కూడా వదలవా?? ముసలిదాన్ని కూడా వదలవా?? నీకు హగ్ ఇవ్వాలంటే ఇందాక నీకు మ్యాటర్‌లేదు.. ఇప్పుడు నాకు మ్యాటర్ ఉంది అని అంటుంది రీతు. ‘ఆయనగారండీ.. మీకు మ్యాటర్ లేదని బయట అందరూ అనుకుంటున్నారు.. పిల్లలు కావాలని అందరూ అడుగుతున్నారు.. ఏమైనా చూడండి’ అని ఆది అనడంతో.. ‘ఇలా కాదురా నీ పని.. నీకు నాన్ స్టాప్‌గా ఉంటాది’ అంటూ ఆదిని పట్టుకుని లోపలికి లాక్కుని పోతుంది రీతూ చౌదరి. అయితే ఈ స్కిట్‌లో రీతూ ఒక్కరే కాదు.. బిగ్ బాస్ రోహిణి, మరో ఇద్దరు యాంకర్లు.. ఆటో ప్రసాద్, ఇమ్మానుయేల్, నూకరాజులు కూడా దారుణమైన పదజాలంతో డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రెచ్చిపోయారు. వావి వరుసలు మరిచిపోయి మరీ.. నీ పెళ్లం బాగుంటుంది అంటే నీ పెళ్లం బాగుంటుందని స్కిట్‌లో గబ్బు లేపారు.

‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ స్కిట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.