యాప్నగరం

Karthika Deepam సెప్టెంబర్ 25 ఎపిసోడ్ : రంగంలోకి దిగిన సౌందర్య.. రసవత్తరంగా మారిన కథనం

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 సెప్టెంబర్ 25)న 1154 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. karthika deepam September 25 episodeహైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 25 Sep 2021, 9:48 am
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్.. నేడు(2021 సెప్టెంబర్ 25)న 1154 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది.
Samayam Telugu ‘కార్తీకదీపం’ సెప్టెంబర్ 25 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
karthika deepam September 25 episode


1154వ ఎపిసోడ్‌ హైలైట్స్..
హిమ, సౌర్యలతో షైనీ నిజం చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వాళ్లని పికప్ చేసుకోవడానికి వచ్చిన కార్తీక్‌తో ఏం మాట్లాడకుండా కారు ఎక్కేస్తారు పిల్లలు. ముందువైపు డోర్ తీస్తుంటే.. వెనుకనే కూర్చుంటారు ఇద్దరూ కోపంగా. ఇక కార్తీక్.. ‘నేను మూడ్ ఆఫ్‌లో ఉంటే వీళ్లు ఫీల్ అవుతున్నారేంటీ?’ అనుకుంటూ పిల్లల్ని మాట్లాడించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ పిల్లలు ఒక్క మాట కూడా మాట్లాడడు. ‘నేను ఏమైనా ప్రామిస్ చేసి బ్రేక్ చేశానా? పోనీ ఐస్ క్రీమ్ తిందామా? రెస్టారెంట్‌కి వెళ్దామా అంటూ ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు కార్తీక్. అదేం వద్దు డాడీ అంటుంది హిమ. సౌర్యది అదే సమాధానం. దాంతో కార్తీక్‌కి ఏం అర్థం కాదు.

ఇక సౌందర్య.. జరిగినవన్నీ తలుచుకుంటూ.. ‘నాకే ఇంత అలజడిగా ఉంటే.. కార్తీక్‌కి ఎలా ఉండి ఉంటుంది.. దీప కార్తీక్‌లు అన్నీ మరిచిపోయి మళ్లీ కొత్త జీవితం మొలుపెట్టాలి’ అనుకుంటూ ఉంటుంది. ఇంతలో దీప బాధగా ధీనంగా ఇంటికి వస్తుంది. ‘ఏం అయ్యింది’ అని అడగగా అడగగా ‘డాక్టర్ బాబు గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారట అత్తయ్యా.. వారణాసి చెప్పాడు ఏడుస్తూ అంటుంది. దాంతో సౌందర్య దీపకు ధైర్యం చెబుతుంది. ‘అన్నీ మాటలు పట్టించోవాల్సిన పనిలేదు’ అని నచ్చజెబుతుంది.

ఇక ఇంటికి చేరుకున్న తర్వాత హిమ స్కూల్లో షైనీ మాటల్నే తలుచుకుంటూ బాధపడుతుంది. మోనిత ఆంటీని డాడీ నిజంగానే మోసం చేశాడా అంటూ మథనపడుతుంది. ఇక సీన్ కట్ చేస్తే.. సౌందర్య పువ్వులు గుచ్చుతూ ఉంటుంది. కార్తీక్ వచ్చి అన్ని పువ్వులు ఎందుకు? అనడంతో.. ‘దీప వ్రతం చేసుకుంటుందట.. అంతా చక్కదిద్దుకుంది కదా’ అంటుంది. దాంతో కార్తీక్ నిరుత్సాహంగా ‘ఏం చక్కబడింది మమ్మీ.. అంతా బాగానే ఉంది కానీ పిల్లలే..’ అంటూ తన బాధని చెప్పుకోవడం మొదలుపెట్టాడు. ‘ఏమో మమ్మీ.. పిల్లలు వెళ్లేప్పుడు బాగానే ఉన్నారు కానీ ఏం అయ్యిందో వచ్చేప్పుడు ఒకరకంగా ప్రవర్తించారు.. అసలు మాట్లాడలేదు’ అంటాడు కార్తీక్.

‘మమ్మీ ప్రపంచం అంతా ఏమైనా అనుకోనివ్వు మమ్మీ.. నన్ను దోషిలా చూస్తున్నారు.. నా పక్క కూడా కూర్చోలేదు.. హిమ ఎందుకో ఏడ్చింది. ఏమైంది అని అడిగితే చెప్పలేదు.. పలకరిస్తే మాట్లాడటం లేదు.. ఎదురు పడితే చూపులు తప్పుకుంటున్నారు. దీనికన్నా నాకు ఆ కోర్టలో శిక్షపడితే బాగుండేది అంటూ బాధపడతాడు. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న సౌర్యని సౌందర్య ఏయ్ రౌడీ ఇటు రా అనడంతో ‘హా హిమా వస్తున్నా’ అంటూ వెళ్లిపోతుంది. దాంతో సౌందర్యకు అర్థమవుతుంది పిల్లలకు ఏదో అయ్యింది అని. దాంతో ‘ఏది ఏమైనా పిల్లలకు ఏం అయ్యిందో తెలుసుకుని తీరాలి అని నిర్ణయించుకుంటుంది అందాల అత్త. ఇక దీప మేడపైకి వెళ్లి మోనిత మాటల్నే తలుచుకుంటూ ఉండగా ఒక్కసారిగా అటు వైపు చూసి ఆగుతుంది. అక్కడ ఎవరో ఉన్నారని అర్థమవుతుంది. బహుశా పిల్లలు బాధపడుతూ కూర్చుని ఉంటారు. చూద్దాం ఏం జరగనుందో. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! ‘కార్తీకదీపం’ karthika deepam కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.