యాప్నగరం

Ennenno Janmala Bandham అక్టోబర్ 6 ఎపిసోడ్: ఐసీయూలో వేద తల్లి.. మనసుల్ని మెలిపెట్టిన మాలనీ ప్రయత్నం

Ennenno Janmala Bandham october 6 episode: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్.. నేడు(2022 అక్టోబర్ 6)న 254 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Ennenno Janmala Bandham october 6 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 6 Oct 2022, 12:14 pm
గత ఎపిసోడ్‌లో ఆదిత్య కోరిన కోరిక గురించి.. వేద తన తల్లికి చెప్పుకుని బాధపటడంతో వేద తల్లి సులోచన ఆవేశంతో ఊగిపోయింది. ఆవేశంగా నేటి కథనంలో మాలవిక ఇంటికి వెళ్లిన సులోచన.. మాలవికని చడామడా తిట్టిపాడేస్తుంది. ‘నీదీ ఓ బతికేానా? నువ్వు ఓ తల్లివేనా? అసలు ఆడదానివేనా?’ అంటూ కడిగిపారేస్తుంది.
Samayam Telugu Ennenno Janmala Bandham october 6 episode
‘ఎన్నెన్నో జన్మల బంధం’ అక్టోబర్ 6 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)


ఇంకోసారి నా కూతురు జీవితం జోలికొస్తే చూస్తూ ఊరుకోను అంటూ అభికి కూడా వార్నింగ్ ఇస్తుంది. అక్కడే ఉన్న కైలాష్‌ని తిట్టిపాడేస్తుంది. అయితే వాళ్లంతా సులోచన కోపాన్ని తట్టుకోలేక ఊరుకుంటారు కానీ.. ఆవేశంగా ఊగిపోతారు. అదే ఆవేశంలో ఇంటికి బయలుదేరిన సులోచనను ఓ కారు వేగంగా వచ్చి గుద్దేస్తుంది. అది ఎవరి కారో తెలియదు కానీ.. ఈ కుట్రలో ఈ యాక్సిెడంట్‌లో మాలవిక, అభి, కైలాష్‌ల పాత్ర ఉందేమో అనిపిస్తోంది. అది తెలియాల్సి ఉంది.

అయితే సులోచన వెనక్కి పడిపోవడంతో.. తలకు బలమైన గాయం అయ్యి రోడ్డుపైనే పడిపోతుంది. జనం మూగుతారు. ఇంతలో అటుగా వెళ్తున్న యష్ కారు దిగి ఎవరా అని చూస్తే సులోచన. వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లి.. వేదాకి కాల్ చేసి చెబుతాడు. పరుగున వస్తుంది వేద. తల్లి కోసం చాలా ఏడుస్తుంది. అమ్మకు ఏంకాదు అంటూ యష్ ధైర్యం చెప్పి.. ప్రేమగా చేతులు పట్టుకుని ఓదారుస్తాడు. కాసేపటికి అందరికీ ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రికి వస్తారు. 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని డాక్టర్లు అనడంతో అల్లాడిపోతారు అంతా. ఇటు మాలనీ కుటుంబం.. అటు సులోచన కుటుంబం.. ఏడుస్తూనే ఉంటారు.

కమింగ్ అప్‌లో..సులోచనకు తలకు కట్టుకట్టి ఐసీయూలో పెడతారు. మాలనీ ఏడుస్తూ సులోచన ఉన్న ఐసీయూ గదిలోకి వెళ్లిపోయి.. ‘ఇదిగో సులోచనా.. నేను వచ్చినా సరే నువ్వు లేవవా? నీకోసం నేను భరత నాట్యం చేస్తున్నాను చూడు’ అంటూ ఏడుస్తూనే నాట్యం చేస్తుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. సరిగ్గా అప్పుడే సులోచన వేలు కదిలించడంతో.. అంతా చాలా సంతోషిస్తారు. ఆ సీన్ మనసుల్ని మెలిపెట్టేలా ఉంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Ennenno Janmala Bandham కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.