యాప్నగరం

Tejaswini Gowda: కన్నీళ్లు పెట్టుకున్న 'కోయిలమ్మ'.. స్టేజ్‌పై ఎమోషనల్, ఓదార్చిన అమర్!

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ జోడిల్లో ఒకటైన తేజస్విని-అమర్ దీప్ చౌదరికి చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వాలంటైన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్‌లో ఈ జంట సందడి చేసింది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Authored byఆర్ కే మురళీ కృష్ణ | Samayam Telugu 9 Feb 2023, 3:40 pm
'వాలెంటైన్స్ డే' వస్తున్న సందర్భంగా టీవీ ఛానల్స్ అన్నీకూడా ప్రత్యేక షోలు చేస్తున్నాయి. రియల్ లైఫ్ కపుల్, అలానే రీల్ కపుల్‌ను ఇన్‌వైట్ చేసి రకరకాల గేమ్స్ ఆడిస్తున్నారు. తాజాగా తమిళ షో 'సూపర్ జోడి'లో ఇటీవల కొత్తగా పెళ్లయిన కోయిలమ్మ ఫేమ్ తేజస్విని గౌడ.. జానకి కలగనలేదు ఫేమ్ అమర్ దీప్ చౌదరి మెరిశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో అలరిస్తోంది.
Samayam Telugu Tejaswini Gowda
Tejaswini Gowda: తేజస్విని గౌడ ఎమోషనల్


ప్రోమోలో భర్త అమర్ దీప్‌కు తేజస్విని ప్రపోజ్ చేసింది. ఆ సమయంలో చాలా ఎమోషనల్ అయింది. ఓ తమిళ సాంగ్ పాడి మరి తేజూ.. తన ప్రేమను మరోసారి బయటపెట్టింది.

తేజస్విని ఎమోషనల్

"ఒన్ మంత్‌కే ఎంగేజ్‌మెంట్ అయింది.. తర్వాత 4 నెలలకే పెళ్లయిపోయింది. సో.. లవ్ చేయడానికి టైమ్ సరిపోలేదు" అని తేజస్విని చెప్పగా "అందుకే మిమ్మల్ని ఇక్కడకు పిలిచింది" అంటూ బాబా భాస్కర్ అన్నారు.

వెంటనే అమర్ "ఎప్పుడూ అబ్బాయే ఎందుకు ప్రపోజ్ చేయాలి.. పాట పాడి నన్ను ప్రపోజ్ చెయ్" అని తేజస్వినితో అన్నాడు. దీనికి తేజూ "ఉన్నాలే ఎన్నాలుం" అంటూ సమంత-విజయ్ పాట పాడింది. తర్వాత ఎమోషనల్‌గా "నేను నిన్ను లవ్ చేశానో లేదో.. అప్పుడు నాకు తెలియలేదు.. కానీ నేను నిన్న ఎంత పిచ్చిగా ప్రేమిస్తున్నానో ఈ మధ్యే తెలిసింది" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో వెంటనే "ఐ లవ్‌యూ" అంటూ తేజస్వినిని అమర్ దగ్గరికి తీసుకుని గట్టిగా హగ్ చేసుకున్నాడు.

View this post on Instagram A post shared by zeetamil (@zeetamizh)

ఈ ప్రోమో ఫొటో, వీడియోను తేజస్విని, అమర్ ఇద్దరూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేశారు. తేజస్విని అయితే ఈ ప్రోమో షేర్ చేస్తూ.. "నువ్వు త్వరగా తమిళ్ నేర్చుకుంటావని ఆశిస్తున్నాను" అంటూ అమర్‌ను ట్యాగ్ చేసింది తేజస్విని. అమర్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ప్రోమోను షేర్ చేశాడు.

లవ్ చేసి పెళ్లి

అమర్ దీప్ చౌదరి- తేజస్విని గౌడ పెళ్లి గత ఏడాది డిసెంబర్‌లో ఘనంగా జరిగింది. బుల్లితెరపై ఎంతోమందికి నచ్చిన జోడిగా పేరు తెచ్చుకున్న వీళ్లు రియల్ లైఫ్‌లో కూడా ఒక్కటయ్యారు. 'జానకి కలగనలేదు' సీరియల్‌తో అమర్ దీప్ బాగా పాపులర్ అయ్యాడు. అంతకు ముందు 'ఉయ్యాల జంపాల', ‘సిరిసిరిమువ్వ’ సీరియల్స్ చేశాడు.

మరోవైపు తేజస్విని గౌడ.. 'కోయిలమ్మ' సీరియల్‌తో బాగా పాపులారిటీ సాధించింది. అమర్‌ సొంతూరు అనంతపురం కాగా తేజస్విని గౌడది బెంగళూరు. కోయిలమ్మ సీరియల్ కంటే ముందే తేజస్విని తమిళ్, కన్నడలలో చాలా సీరియల్స్ చేసింది.

రచయిత గురించి
ఆర్ కే మురళీ కృష్ణ
ఆర్‌కే మురళీ కృష్ణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.