యాప్నగరం

YS Sharmila Padayatra: షర్మిల పాదయాత్రలో యాంకర్ శ్యామల.. అన్న పార్టీలో ఉంటూ.. చెల్లికి పాదయాత్ర

దివంగత నేత వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణాలో గ్రామా స్థాయి ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు 'ప్రజా ప్రస్థానం' పాద యాత్ర మొదలెట్టిన సంగతి తెలిసిందే.

Samayam Telugu 27 Oct 2021, 6:41 pm
YSRTP అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం మహాపాదయాత్ర 8వ రోజుకు చేరుకుంది. తెలంగాణలో గ్రామస్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కరణ.. సమగ్ర అవగాహనలో భాగంగా ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 20వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో తన పాదయాత్రను మొదలు పెట్టారు షర్మిల. మొత్తం 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4,000 కిలోమీటర్ల పాటు ఈ మహా పాదయాత్ర కొనసాగనుంది.
Samayam Telugu శ్యామల, షర్మిల
anchor shyamala


బుధవారం నాటికి 8 వ రోజుకు చేరిన షర్మిల పాదయాత్ర ఇపుడు మహేశ్వరం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ ప్రజాప్రస్థానం పాదయాత్రకి యాంకర్ శ్యామల తన మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. షర్మిలతో కలిసి కొంతదూరం పాదయాత్ర చేశారు. ఆమెతో పాటు శ్యామల భర్త నరసింహ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు.

కాగా షర్మిల కొత్త పార్టీ స్థాపించడానికి ముందే ఆమెతో భేటీ అయ్యింది యాంకర్ శ్యామల. అయితే అది కేవలం ఫ్రెండ్లీ మీట్ అని చెప్పిన శ్యామల ఇప్పుడు పాదయాత్రలో షర్మిలకు తోడుగా అడుగుకలిపారు. కాగా షర్మిల ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు శ్యామల, ఆమె భర్త నరసింహా ఇద్దరూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. అనంతరం కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. అక్కడ అన్న పార్టీలో ఉంటూనే.. ఇక్కడ చెల్లి పాదయాత్రలో పాల్గొన్నారు శ్యామల. అన్న పార్టీలో ఆమెకు సరైన గుర్తింపు లభించలేదు.. మరి షర్మిల అయినా శ్యామలను గుర్తిస్తుందేమో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.