యాప్నగరం

Guppedantha Manasu: ఈరోజు సీరియల్స్ ప్రివ్యూ.. టీవీలో కంటే ముందుగానే టాప్ 5 ఎపిసోడ్స్ ఒక్క క్లిక్‌తో

బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి సీరియల్స్ వదినమ్మ, గృహలక్ష్మి, కార్తీకదీపం సీరియల్స్‌ హైలైట్స్ టీవికంటే ముందుగా ‘సమయం తెలుగు’లో అందిస్తున్నాం. మరి జూన్ 15 సీరియల్స్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం.

Samayam Telugu 15 Jun 2021, 5:04 pm
1. జానకి కలగనలేదు
Samayam Telugu 16.05.2021 సీరియల్స్ photo courtesy star maa and hotstar
Telugu Serials

మల్లిక చేసిన తప్పుకు జానకి బలికావాల్సి వస్తోంది. మొన్న ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి రాగా.. నేటి ఎపిసోడ్‌లో మరోసారి ఇరకాటంలో పడింది. మరి ఆ ఇబ్బందుల్లో నుంచి రామచంద్ర ఎలా గట్టెక్కించాడు.. ఆ సందర్భంలో ఇద్దరి మధ్య జరిగిన రొమాన్స్ ఏంటి? నేటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలియాలంటే.. ఈ కింద లింక్‌ క్లిక్‌ చేయండి..
‘జానకి కలగనలేదు’ జూన్ 15 ఎపిసోడ్: భార్యకి బట్టలు ఉతకడం నేర్పించిన రామ.. రొమాన్స్ అదిరింది
2.కార్తీకదీపం
మోనిత ప్రెగ్నెంట్‌ అనే విషయం బయటపడినప్పటి నుంచి కథనం చాలా ఉత్కంఠగా మారింది. కార్తీక్ దీప వెంటపడటం, దీపని బతిమలాడటం, మోనితని పట్టించుకోకపోవడం అంతా అభిమానులు మెచ్చేలా ఉన్న క్రమంలో మరో ట్విస్ట్ వంటలక్క ఫ్యాన్స్‌కి షాక్ ఇవ్వబోతుంది. దాంతో నేటి కథనం రసవత్తరంగా మారింది. నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ కోసం ఈ కింద లింక్‌ క్లిక్‌ చేయండి..
Karthika Deepam జూన్ 15 ఎపిసోడ్: మోనితకు ఎదురు తిరగనున్న కార్తీక్! వంటలక్క ఇంట్లోనే హాస్పటల్ పెట్టి..
3.వదినమ్మ
సీత కిడ్నీ దానం కోసం వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరగడం, ఆ విషయంలో రఘురాం కుటుంబానికి సీత వివరాలు ఏమీ తెలియకపోవడంతో కథనం ఉత్కంఠగా మారింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది సీత కుటుంబం. సీత ఇక రాదు అనే భయంతో ఏడుస్తున్న కుటుంబానికి నేడు షాకింగ్ న్యూస్ తెలిసింది. ఈ క్రమంలో నేటి ఎపిసోడ్ చాలా రసవత్తరంగా మారిపోయింది. ఆ హైలైట్ కోసం.. ఈ కింద లింక్‌ క్లిక్‌ చేయండి..
Vadinamma జూన్ 15 ఎపిసోడ్: షాకింగ్! సీత ఇక లేదని తెలుసుకున్న రఘురాం? కుటుంబంలో విషాదచాయలు
4.ఇంటింటి గృహలక్ష్మి

అభి తండ్రికాబోతున్నాడనే విషయం తులసికి తెలియడంతో తెగ ఆనందపడిపోతుంది. అయితే తండ్రితో కలిసి రావాలని అభి కోరడంతో తులసి అనూహ్య నిర్ణయం తీసుకుంది. నందుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మరోవైపు అభికి తెలియకుండా అబార్షన్ చేయించుకున్న అంకిత.. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ.. దీనికి కారణమైన తల్లిని నిలిదీసింది. అయితే నందు-తులసి కలిసి అభి దగ్గరకు వెళ్లగా.. అక్కడ వీళ్లందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది అంకిత తల్లి గాయిత్రి.. అదేంటి?? అక్కడ ఏం జరిగింది?? లాస్య స్కెచ్ వర్కౌట్ అయ్యిందా లేదా? అన్నది తెలియాలంటే.. ఈ కింద లింక్‌ క్లిక్‌ చేయండి..
Gruhalakshmi Serial జూన్ 15 (ఈరోజు) ఎపిసోడ్: నా ఫ్యామిలీ నాకు ముఖ్యం.. లాస్యపై నందు ఫైర్.. కుప్పకూలిన అంకిత
5. గుప్పెడంత మనసు
ఛాలెంజ్ ప్రకారం వసు రాజీవ్ ముఖాన్న డబ్బు కొట్టాలని నిర్ణయించుకుంది. అందుకు డబ్బు కూడా పోగేసింది. కానీ రాజీవ్ మరో స్కెచ్ వేశాడు. ఈ క్రమంలో నేటి ఎపిసోడ్‌ చాలా ఉత్కంఠగా మారింది. రిషి ఇగో దెబ్బతియ్యడంతో వసుతో కష్టపడి సారీ చెప్పించుకుంటాడు. అయితే వసు సెటైర్స్ వెయ్యడం తలుచుకుని తనలో తనే రగిలిపోతూ ఉంటాడు. ఓ వైపు విలన్, మరో వైపు హీరో ఇద్దరూ వసుని ఇష్టపడుతున్న క్రమంలో కథనం చాలా ఆసక్తిగా మారింది. నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ కోసం ఈ కింద లింక్‌ క్లిక్‌ చేయండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.