యాప్నగరం

YS Jagan: సీఎం జగన్‌కి యాంకర్ శ్యామల సలహా.. ఇలా చేయండి సార్!

YS Jagan Mohan Reddy: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు-కచ్చలూరు మధ్య జరిగిన ఘోర బోటు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి.

Samayam Telugu 16 Sep 2019, 11:40 pm
పాపికొండ పర్యటనలో బోటు ప్రమాద ఘటన రెండు తెలుగు రాష్ట్రాలను విషాదాన్ని నింపాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు-కచ్చలూరు మధ్య జరిగిన ఘోర బోటు ప్రమాదంలో ఎంత మంది చనిపోయారన్నదానిపై ఇప్పటి వరకూ అధికారక ప్రకటన రాలేదు. అయితే సుమారు 70 మందికి పైగా ప్రయాణికులు ఈ బోటులో ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటన దీంతో మృతదేహాల సంఖ్య 12కి చేరింది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
Samayam Telugu Syamala And Jagan


Read Also: రాహుల్‌కి పునర్నవి ఘాటు ముద్దు.. కౌగిలింతతో ఉక్కిరిబిక్కిరి

ఈ విషాద ఘటనపై స్పందిస్తూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా వినతి అందించారు ప్రముఖ యాంకర్, వైసీపీ కార్యకర్త శ్యామల. వరుసగా జరుగుతున్న బోటు ప్రమాదాలను నివారించాలంటే బొట్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండకుండా చేయాలన్నారు శ్యామల. దీనికి సంబంధించి ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు.

Read Also: బాబా భాస్కర్ మీసాలు.. ఆమె జుట్టు గోవిందా.. గోవిందా!

‘గోదావరి బోటు ప్రమాదం ఆందోళన కలిగిస్తుంది. నాడు కృష్ణలో , నేడు గోదావరిలో జరుగుతున్న ప్రమాదాలకు మూలం బొట్ల నిర్వహణ ప్రయివేటు వ్యక్తుల చేతిలో ఉండడమే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు కీలకమైన ఈ నిర్వహణను ప్రభుత్వ సారథ్యంలోని ఏపీ టూరిజం శాఖ పరిధిలోకి తీసుకురావాలని మనవి’ అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు శ్యామల. కాగా శ్యామల 2019 ఎన్నికల సందర్భంగా తన భర్తతో జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.