యాప్నగరం

‘గుప్పెడంత మనసు’ డిసెంబర్ 4 ఎపిసోడ్: వసు-రిషిల బంధంపై దేవయాని కన్ను.. ఇక ముప్పు తప్పదన్నట్టే..

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2021 డిసెంబర్ 4)న 309 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Guppedantha Manasu December 4 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 4 Dec 2021, 11:12 am
గత ఎపిసోడ్‌లో వసు, రిషిలు కలిసి వనభోజనాలకి రావడం, దారిలో గోలీల ఆట ఆడటం తెలిసిందే. అయితే అప్పటికే జగతి, దేవయాని అంతా ఆ చోటికి వెళ్లిపోతారు. వసు, రిషిలు కలిసి వస్తూ.. ఉండగా.. వసు తనకు కిట్టు ఇచ్చిన గోలీలని, ఒక డబ్బాలో వేసి.. ’ఇది కూడా ఓ జ్ఞాపకం’ అంటూ రిషికి ఇస్తుంది. ఇక ఇప్పుడు నేటి కథనం చూద్దాం.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ డిసెంబర్ 4 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu December 4 episode


309వ ఎపిసోడ్‌ హైలైట్స్..
అయితే వసు రిషిలు కాస్త దూరంలో కారు ఆపి.. వనభోజనాలకు నడిచి బయలుదేరతారు. ఆ సమయంలో ‘సార్ మీ షూస్ తీసి చేత్తో పట్టుకుని.. ఫ్యాంట్ పైకి మడిచి నడవండి ఇదికూడా ఓ అనుభూతి’ అంటూ తనదైన శైలిలో క్లాస్ తీసుకుంటుంది వసు. వసు చెప్పినట్లే చేస్తాడు. వసు కూడా తను చెప్పులు చేత్తో పట్టుకుని రిషితో కలిసి నడుస్తుంది. ఇద్దరూ కలిసి ఒకేలా అడుగులు వేస్తున్న సమయంలో ఓ మంచి సాంగ్ వినిపిస్తూ.. ఆ సీన్‌ని హైలైట్ చేశారు డైరెక్టర్.

ఇక దగ్గరకు వస్తున్న సమయంలో.. ‘సార్ మనం ఇక్కడి నుంచి మామూలుగా నడిచేద్దాం.. మన ఆలోచనలు చూసేవాళ్లకి అర్థం కాకపోవచ్చు కదా..’ అంటూ తను చెప్పులు వేసుకుని రిషిని షూస్ వేసుకోమంటుంది. ఇక ఇద్దరూ కలిసి.. నడుస్తూ వెళ్లేసరికి మినిస్టర్ గారి బావమరిది రిషిని ‘సార్ మీ నాన్నగారు పెదనాన్నగారు అక్కడున్నారు రండీ’ అని తీసుకుని వెళ్లగా.. వసు జగతి దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. అదే సమయంలో మహేంద్ర జగతి పక్కకే కుర్చీ వేసుకుని జగతితో మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా దేవయాని వస్తుంది. దాంతో బిత్తరపోయిన మహేంద్ర.. వసు వైపు చైర్ లాక్కుని.. ‘వసుధరా ఏంటి మెషిన్ ఎడ్యుకేషన్ పరిస్థితి’అంటూ ఏదేదో మాట్లాడతాడు. ‘ఏంటి సార్ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు?’ అంటే.. ‘వెనుకే మా వదినగారు ఉన్నారు.. నన్నే గమనిస్తున్నారు.. కాస్త కవర్ చెయ్యవా ప్లీజ్’ అంటూ ఇబ్బంది పడే సీన్ భలే కామెడీగా ఉంటుంది. అలా చూస్తూనే ఉంటుంది దేవయాని మాత్రం గుర్రుగా.. చేసేది లేక మహేంద్ర లేచి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.

ఇక వసు పుష్పకి కాల్ చేసి.. ఇక్కడే దగ్గర్లో ఉన్నా అంటే ఎదురు వెళ్లి తీసుకొస్తుంది. అప్పుడే దేవయాని, రిషి మాట్లాడుకుంటూ ఉంటారు. ధరణి అక్కడే ఉంటుంది. పుష్పని చూసిన రిషి.. ‘ఏంటి పుష్పా నువ్వు ఇక్కడా?’ అని పలకరిస్తాడు. ‘నేనే రమ్మన్నాను సార్.. నాకు తోడుగా ఉంటుందని’ అని బదులిస్తుంది వసుధర. ఇంతలో మినిస్టర్‌గారి బావమరిది.. వచ్చి.. ‘సార్ తోట చూపిస్తాను రండీ సరదాగా’ అనడంతో.. ‘వసుధరా రా నువ్వు కూడా’ అంటూ వెనుకే తీసుకుని వెళ్తాడు. అది చూసిన దేవయాని.. ధరణితో.. ‘నువ్వు వెళ్లు..వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో విను’ అంటూ పంపిస్తుంది.

మొత్తానికీ ధరణి, వసు, రిషి, పుష్పా అంతా కలిసి.. తోటకు వెళ్లి అంతా చూసి ఎంజాయ్ చేస్తారు .అదే సమయంలో వసు ఉయ్యాల నేను కడతాను అంటూ చెట్టు ఎక్కబోయి రిషిపై పడటం, ఓ రొమాంటిక్ సీన్ నడవడంతో కథ ఆసక్తిగా మారింది. ఇక ధరణి, పుష్పలే వాళ్లని పైకి లేపుతారు. ఇక కథ అలా కూల్‌గా నడుస్తున్న సమయంలో రేపు కమింగ్ అప్‌లో.. వసు, రిషిలు ఆటోలో వెళ్లడం, తిరిగి మళ్లీ వనభోజనాలకు అరటి ఆకులు తీసుకుని రావడం, వాళ్లు ఇద్దరూ కలిసి రావడం చూసిన దేవయాని రగిలిపోవడంతో కథ ఉత్కంఠగా మారిపోయింది. ‘అసలు ఈ వసుధర, ఆ జగతి రిషిని వదిలిపెట్టేలా లేరు.. అసలు వీళ్ల ఏదో ముప్పు తెచ్చేలానే ఉన్నారు’ అనుకుంటుంది రిషి, వసులు కలిసి నడిచి వస్తుంటే.. దేవయానికి అనుమానం బలపడిందంటే.. విడదియ్యడానికి నానా ప్రయత్నాలు మొదలుపెట్టేస్తుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.