బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘వదినమ్మ’ సీరియల్ 395 ఎపిసోడ్లను పూర్తి చేసుకుని.. 396 ఎపిసోడ్కి నేడు(నవంబర్ 23)న ఎంటర్ అయ్యింది. నేటి ఎపిసోడ్లో శైలు.. తండ్రి జనార్థన్కి కాల్ చేసి.. తన భర్త లక్షణ్కి బావగారు రఘురాం షూరిటీ ఇవ్వనన్నారని చెప్పడంతో.. జనార్థన్.. మరో ప్లాన్ చెబుతాడు. అదేంటంటే.. రఘురాం షూరిటీ సంతకం చెయ్యడానికి ఒప్పుకోవాలంటే.. ఆస్తి అతడి ఒక్కడిదే కాదు కాబట్టి.. మిగిలిన ఇద్దరు తమ్ముళ్లు ఒప్పుకుంటే.. సంతకం పెట్టడానికి మీ అన్నయ్య నో అనడని.. లక్షణ్కి ధైర్యం చెప్పినట్లే చెప్పి.. ఎలాగైనా కుటుంబాన్ని దెబ్బకొట్టాలనేది తండ్రీ కూతుర్ల ప్లాన్. అలానే శైలు.. సెంట్మెంట్తో కొట్టి.. భరత్ని సంతకం పెట్టడానికి ఒప్పిస్తుంది కూడా.
అదలా ఉండగా.. గత ఎపిసోడ్లో భరత్ ముందే రఘురాం.. పిల్లల టీకాల గురించి తెలుసుకుని ఉరుకుల పరుగుల మీద అబద్దం చెప్పి వెళ్లడం.. తర్వాత అనుమానంతో నిలదీస్తే.. నా ఇష్టం అంటూ రఘురాం ఎదురుతిరగడం తెలిసిందే. అయితే నేటి ఎపిసోడ్లో కూడా ఓ ఫోన్ రావడంతో రఘురాం భరత్కి దూరంగా వెళ్లి దొంగచాటుగా ఫోన్ మాట్లాడటం, వెంటనే బయటికి వెళ్లి పిల్లల పెన్సీల్స్, స్కెచ్లు తీసుకొచ్చి.. పక్కన పెట్టుకుని.. భరత్ ఆరా తీస్తున్నా కసురుకుంటూ వాటిని తీసుకుని పరుగున బయటికి వెళ్లిపోవడం.. భరత్ అనుమానాన్ని కలిగిస్తాయి. అయితే రేపటి ప్రోమోలో మరో ట్విస్ట్ ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చెయ్యనుంది.
అదేంటంటే.. రఘురాం ఫోన్లో ఓ పాప ఫోటోకి ముద్దాడి.. దొంగచాటుగా బయటికి వెళ్లిపోవడం.. సీన్ కట్ చేస్తే.. ఓ స్కూల్లో చిన్న పిల్ల.. అందరూ క్లాప్స్ కొడుతుంటే.. ‘నా పేరు వర్షిత.. టీచర్ చెప్పినట్లు మా ఫాదరే నా హీరో..’ అంటూనే మా ఫాదర్ అదిగో అంటూ రఘురాంని చూపిస్తుంది. ఇంట్లో సీత మాత్రం.. తన భర్త రఘురాం ఎక్కడికి వెళ్లిపోయాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. నిజానికి సీతకు అన్యాయం చేసేటి మనస్తత్వం కాదు రఘురాంది. ఎందుకంటే సీత చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కాదు. రఘురాం అన్నదమ్ముల కోసం తన మాతృత్వాన్నే దూరం చేసుకుంది. ఎన్నో కష్టసుఖాల్లో రఘురాం వెన్నంటే ఉంది. రఘురాం ఓ అనాథ అని తెలిసినా.. రఘురాం తమ్ముళ్ల భార్యలు ఎన్ని అవమానాలు చేసినా అన్ని భరించే వదినమ్మ.. తనకు తెలియని గతం రఘురాం జీవితంలో ఉందని తెలిస్తే తట్టుకోగలదా? అనేది కథను ఆసక్తిగా మార్చింది.
Read also: ‘కార్తీకదీపం’ నవంబర్ 24 ఎపిసోడ్! కార్తీక్ దగ్గర మాట తీసుకున్న మౌనిత.. ‘ఇక హిమ కూడా ఏం చెయ్యలేదు!’Read also: ‘వదినమ్మ’ నవంబర్ 24 ఎపిసోడ్! ‘సీత, తను.. ఇద్దరూ కావాలి’ రఘురాం కోరిక! ‘నిన్ను వదులుకోను బావా!’
అదలా ఉండగా.. గత ఎపిసోడ్లో భరత్ ముందే రఘురాం.. పిల్లల టీకాల గురించి తెలుసుకుని ఉరుకుల పరుగుల మీద అబద్దం చెప్పి వెళ్లడం.. తర్వాత అనుమానంతో నిలదీస్తే.. నా ఇష్టం అంటూ రఘురాం ఎదురుతిరగడం తెలిసిందే. అయితే నేటి ఎపిసోడ్లో కూడా ఓ ఫోన్ రావడంతో రఘురాం భరత్కి దూరంగా వెళ్లి దొంగచాటుగా ఫోన్ మాట్లాడటం, వెంటనే బయటికి వెళ్లి పిల్లల పెన్సీల్స్, స్కెచ్లు తీసుకొచ్చి.. పక్కన పెట్టుకుని.. భరత్ ఆరా తీస్తున్నా కసురుకుంటూ వాటిని తీసుకుని పరుగున బయటికి వెళ్లిపోవడం.. భరత్ అనుమానాన్ని కలిగిస్తాయి. అయితే రేపటి ప్రోమోలో మరో ట్విస్ట్ ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చెయ్యనుంది.
అదేంటంటే.. రఘురాం ఫోన్లో ఓ పాప ఫోటోకి ముద్దాడి.. దొంగచాటుగా బయటికి వెళ్లిపోవడం.. సీన్ కట్ చేస్తే.. ఓ స్కూల్లో చిన్న పిల్ల.. అందరూ క్లాప్స్ కొడుతుంటే.. ‘నా పేరు వర్షిత.. టీచర్ చెప్పినట్లు మా ఫాదరే నా హీరో..’ అంటూనే మా ఫాదర్ అదిగో అంటూ రఘురాంని చూపిస్తుంది. ఇంట్లో సీత మాత్రం.. తన భర్త రఘురాం ఎక్కడికి వెళ్లిపోయాడా అని ఆలోచిస్తూ ఉంటుంది. నిజానికి సీతకు అన్యాయం చేసేటి మనస్తత్వం కాదు రఘురాంది. ఎందుకంటే సీత చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కాదు. రఘురాం అన్నదమ్ముల కోసం తన మాతృత్వాన్నే దూరం చేసుకుంది. ఎన్నో కష్టసుఖాల్లో రఘురాం వెన్నంటే ఉంది. రఘురాం ఓ అనాథ అని తెలిసినా.. రఘురాం తమ్ముళ్ల భార్యలు ఎన్ని అవమానాలు చేసినా అన్ని భరించే వదినమ్మ.. తనకు తెలియని గతం రఘురాం జీవితంలో ఉందని తెలిస్తే తట్టుకోగలదా? అనేది కథను ఆసక్తిగా మార్చింది.
Read also: ‘కార్తీకదీపం’ నవంబర్ 24 ఎపిసోడ్! కార్తీక్ దగ్గర మాట తీసుకున్న మౌనిత.. ‘ఇక హిమ కూడా ఏం చెయ్యలేదు!’Read also: ‘వదినమ్మ’ నవంబర్ 24 ఎపిసోడ్! ‘సీత, తను.. ఇద్దరూ కావాలి’ రఘురాం కోరిక! ‘నిన్ను వదులుకోను బావా!’