యాప్నగరం

‘వదినమ్మ’ జూన్ 12 (ఈరోజు) ఎపిసోడ్: తీవ్ర వేదనలో రఘురాం కుటుంబం.. మనసుల్ని మెలిపెట్టే ఎమోషనల్‌ సీన్స్‌

కుటుంబ కలహాలు, కలతలు, అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈసీరియలస్ 566 ఎపిసోడ్‌కి నేడు(2021 జూన్ 11)న ఎంటర్ అయ్యింది. అయితే నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది.

Samayam Telugu 12 Jun 2021, 2:37 pm
కోయంబత్తురు నుంచి ప్రశాంత్‌ రఘురాంకి ఫోన్‌ చేసి..సీత వివరాలు ఏం తెలియలేదు.. చీకటి పడటంతో రిస్కూ ఆఫరెషన్‌ ఆపేశారు.. రేపు ఉదయం మళ్లీ వివరాలు తెలుసుకుని చెబుతాను’ అనడంతో కుటుంబం మొత్తం విషాదచాయల్లో కొట్టిమిట్టాడుతుంది.
Samayam Telugu వదినమ్మ photo courtesy star maa and hotstar
Vadinamma


నాకు చాలా సిగ్గుగా ఉంది లక్కీ.. నన్ను మీరంతా ఇంతకాలం ఎలా భరించారు.. నాకు చాలా సిగ్గుగా అనిపిస్తోంది లక్కీ... ఎక్కడికైనా పారిపోవాలని ఉంది’ అని సీత గురించి,. కుటుంబం గురించి తను చేసిన తప్పు గురించి కుమిలికుమిలి ఏడుస్తుంది శైలు తన భర్త లక్ష్మణ్‌ దగ్గర. దాంతో లక్ష్మణ్‌ శైలుని ఓదారుస్తాడు. నీ మీద ఏ రోజు కోపం లేదు శైలు.. నీ ప్రవర్తనపై కోపం వచ్చేది ఇప్పుడు ఆ అవసరం లేదు నా శైలు పూర్తిగా మారిపోయింది కదా.. అంటూ బుజ్జగించి ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.

అయినా శైలు సీత జ్ఞాపకాలతో గడుపుతుంది. ఇందలో బాబు పెద్దపెద్దగా ఏడుస్తాడు. అయినా పట్టించుకోకుండా సీతని తలుచుకుని ఏడుస్తుంది. బాబు ఏడుపు వినిపించి వచ్చిన సిరి శైలు పక్కనే కూర్చుని.. ‘బాబు ఏడుస్తుంటే పట్టించుకోవేంటీ శైలు’ అంటుంది. వాడి ఏడుపు సీతక్కకు వినిపించి ఎక్కడున్న పరుగెత్తుకుని వస్తుందేమోనని ఆశ సిరి అని శైలు అనే మాటలు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది.

ఇక నానీ ఒంటరిగా కూర్చుని సీతను తలుచుకుని ఏడుస్తుంటాడు. అమ్మా అంటూ కుమిలికుమిలి ఏడుస్తుంటే.. పక్కకి వచ్చి కూర్చున్న భరత్‌.. ఇదిగో ఇది వదినమ్మ చేసిన రవ్వలడ్డూరా నానీ.. నువ్వు ఆకలితో ఉంటే వదనమ్మ సంతోషంగా ఉండదురా.. తిను.. అంటూ బలవంతంగా తినిపించి ఓదారుస్తాడు. దాంతో ఒక్కసారిగా నానీ భరత్‌ని పట్టుకుని అన్నయ్యా అని ఏడ్చేస్తాడు. ఆ సీన్‌ కంటతడిపెట్టిస్తుంది.

ఇక రఘురాం కూడా రాత్రి నిద్రపోడు.సీత జ్ఞాపకాలనే తలుచుకుంటూ ఎందుకు నాకు చెప్పకుండా వెళ్లావ్‌ సీతా అని కుమిలపోతాడు. ఇక తెల్లారే అంతా ఒక చోట వచ్చి.. సీత వివరాల కోసం ఫోన్‌ వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ సమయంలో కూడా రాజేశ్వరి ఏడుస్తూనే ఉంటుంది. కమింగ్‌ అప్‌లో పార్వతమ్మ సీతని పోయింది అనడంతో.. రఘురాం ఉగ్రరూపం చూపించే సీన్‌ నేడు కూడా కమింగ్‌ అప్‌లో రిపీట్‌ అయ్యింది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.