యాప్నగరం

Ennenno Janmala Bandham నవంబర్ 25: ‘మాళవికకు చిప్పకూడు’ తెగించేసిన అభి!

Ennenno Janmala Bandham november 24 episode: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్.. నేడు(2022 నవంబర్ 24)న 289 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Ennenno Janmala Bandham november 24 episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 25 Nov 2022, 11:20 am
‘ఎన్నెన్నో జన్మల బంధం’ రోజుకో ట్విస్ట్‌తో ముందుకు సాగుతోంది. యష్.. మాళవిక తరపున పోరాటం మొదలుపెట్టడం.. అభి.. వేదాకు నిజం చెప్పడం.. ఆ తర్వాత ఆదిత్యే యాక్సిడెంట్ చేశాడనే నిజాలు వెలుగులోకి రావడం.. ఝాన్సీ అనే లాయర్‌ని వేదా నియమించుకోవడం.. ఇలా కథనం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే నేటి కథనం ఆసక్తిగా మారింది.
Samayam Telugu Ennenno Janmala Bandham november 24 episode
‘ఎన్నెన్నో జన్మల బంధం’ నవంబర్ 24 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)


289 ఎపిసోడ్‌ హైలైట్స్..
వేదా బయలుదేరేసరికి.. యష్ కూడా బయలుదేరతాడు. కోర్టులో నేను గెలవాలంటే.. నేను గెలవాలని.. ఆశీర్వాదం కోరతారు మాలనీ దగ్గర ఇద్దరూ. అయితే మాలనీ ధర్మసంకటంలో పడుతుంది. ‘కన్నకొడుకుని మనస్పూర్తిగా ఆశీర్వదించలేని స్థితి నాకొచ్చిందా?’ అని మనసులోనే మథనపడుతుంది. అప్పుడే రత్నం(ఆమె భర్త) వచ్చి.. ‘సందేహించకు మాలనీ.. న్యాయం ఎటు ఉంటే వాళ్లే గెలవాలని ఆశీర్వదించు’ అని సలహా ఇస్తాడు. దాంతో ఇద్దరూ ఒకేసారి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరతారు.

అయితే యష్.. వెళ్తుంటే.. సులోచన, చిత్ర, సులోచన భర్త ఎదురుపడతారు. ‘అత్తయ్యగారు ఆశీర్వదించండి’ అంటూ కాళ్లకు మొక్కి బయలుదేరతాడు యష్. మనసులో మాత్రం.. ‘అత్తయ్యగారు.. మీకు న్యాయం జరిగేలా పోరాడతాను అని మాటిచ్చి.. ఇప్పుడు మీకు వ్యతిరేకంగా నిలబడ్డాను.. కారణం తెలిసిన రోజున మీరు నన్ను అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను’ అనుకుంటూ అక్కడిని నుంచి వెళ్తాడు.

తీరా మాలనీ, చిత్ర, సులోచన, వేదాలు కింద కారు పార్కింగ్ దగ్గర ఆటో కోసం.. క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటే.. యష్ కారులో స్టార్ట్ చేస్తూ.. వాళ్లని చూసి.. వాళ్లు కూడా కోర్టుకి వెళ్తున్నారని తెలుసుకుని.. ‘అంతా వెళ్లేదు ఓ చోటికే కదా.. నా కారులో రండి’ అంటాడు. మాలనీ ఒప్పుకోదు. అయితే క్యాబ్స్ అందుబాటులోకి రాకపోవడం.. సులోచన.. ‘అల్లుడు గారితో వెళ్తే తప్పేంటి..ఆయన్ని మరీ పారాయివాడ్ని చేయొద్దు’ అంటూ సర్ధిచెప్పడంతో అంతా యష్ కారు ఎక్కుతారు. వేదా యష్ పక్క సీట్‌లో కూర్చుంటే.. మిగిలిన వాళ్లు వెనుకే కూర్చుంటారు.

మరోవైపు అభిమన్యు రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో కైలాష్ వచ్చి.. మాలవిక మీద.. యష్‌కి దగ్గరవుతున్న విషయం మీద అభికి మరింతగా ఎక్కిస్తాడు. దాంతో అభి.. ‘బంగారం చాలా పెద్ద తప్పు చేశావ్.. నన్ను నమ్మకుండా ఆ యశోధర్ గాడ్ని నమ్ముతావా? వాడు నిన్ను కేసు నుంచి కాపాడతాడా? వాడి అబ్బతరం కూడా కాదు.. ఈ రోజు కోర్టులో కేసు ఓడిపోతాడు. నీకు శిక్ష తప్పదు.. జైల్లో చిప్పకూడు తప్పదు....’ అంటూ రగిలిపోతాడు అభి. ‘అయితే నేను కోర్టుకి వెళ్లాల్సిందే.. నీకు లైవ్ కామెంట్రీ ఇవ్వాల్సిందే..’ అంటూ కైలాష్ అక్కడినుంచి వెళ్తాడు.

మరోవైపు వేదా, యష్, చిత్ర, మాలనీ, సులోచన కోర్టుకు వెళ్తారు. అంతా దిగి లోపలికి వెళ్తారు కానీ.. వేదా చీర కొంగు కారు సీట్‌లో ఇరుక్కోవడంతో అక్కడే ఉండి లాగే ప్రయత్నం చేస్తుంది. తిరిగి చూసిన యష్.. వేదాకి సాయం చేస్తాడు. అప్పుడే ఒకరికి ఒకరు తగులుకుని.. అప్పటి దాకా వారి మధ్య ఉన్న దూరాన్ని తలుచుకుంటూ ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. అప్పుడే చీర కొంగు బయటికి తీసి.. వేదాకి ఇస్తాడు యష్. ఇక ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. ‘ఏమండి.. ఈ కేసులో ఎలాంటి ఫలితం వచ్చినా.. మన బంధంలో ఏ మార్పు ఉండదని మాటివ్వండి’ అంటుంది. ‘మన మధ్యలోకి ఎవ్వరూ రాలేదు వేదా’ అంటూ మాటివ్వబోతుంటే.. మాళవిక ఎంట్రీ ఇస్తుంది యష్.. అంటూ. మరి యష్ మాటిస్తాడా లేదా అనేది చూడాలి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Ennenno Janmala Bandham కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.