యాప్నగరం

Guppedantha Manasu ఆగష్టు 10: ‘రేపే లగ్నపత్రిక’.. వసుకి తెగేసి చెప్పిన రిషి! మహేంద్ర ఆవేదన

Guppedantha Manasu today August 10 Episode: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్.. నేడు(2022 ఆగష్టు 10)న 523 ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. Guppedantha Manasu August 10 Episode హైలైట్స్ చూద్దాం.

Authored byశేఖర్ కుసుమ | Samayam Telugu 10 Aug 2022, 4:29 pm
గత ఎపిసోడ్‌లో రిషి, సాక్షీలకు పెద్ద గొడవే జరగుతుంది. మధ్యలో వెళ్లిన దేవయానీ సాక్షీని బయటికి లాక్కొచ్చి.. తలుపు వేస్తుంది. ఇంతలో వసు, జగతి అటుగా రావడంతో సాక్షీ రెచ్చిపోతుంది. అదే సీన్ నేటి కథనంలో కంటిన్యూ అయ్యింది.
Samayam Telugu ‘గుప్పెడంత మనసు’ 2022 ఆగష్టు 10 ఎపిసోడ్(photo courtesy by star మా and disney+ hotstar)
Guppedantha Manasu 2022 August 10 Episode


523 ఎపిసోడ్‌ హైలైట్స్..
వసుని చూడగానే సాక్షీ రగిలిపోతుంది. ‘అసలు నిన్ను అనాలి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్? ఇదంతా నీ వల్లే జరుగుతోంది..’ అంటూ వసు మీద అరుస్తుంది సాక్షీ. జగతి, వసులకు ఏం అర్థం కాదు. ‘ఏం మాట్లాడుతున్నావ్ సాక్షీ..?’ అంటుంది వసు. ‘అంతా నీ వల్లే.. నా జీవితం అంతా సమస్యలో పడింది నీ వల్లే.. వెళ్లిపో వసుధారా.. నీ వల్లే నా పెళ్లి కూడా ఆగేలా ఉంది.. వెళ్లిపో’ అంటూ అరుస్తుంది సాక్షీ. సరిగ్గా అప్పుడే రిషి తలుపు తీస్తాడు.. దాంతో సాక్షీ.. కోపంగా.. ‘ఛా..’ అని వెళ్లిపోతుంది. వెనుకే దేవయాని పరుగులు తీస్తుంది సాక్షీ సాక్షీ అంటూ.

ఇక వసుని చూస్తాడు రిషి. ‘నాతో చిన్న పని ఉండి వచ్చింది సార్’అంటుంది జగతి. ‘నేను అడగలేదు కదా మేడమ్’ అనేసి రిషి లోపలికి వెళ్లిపోతాడు. పాపం వసు రిషినే అలా చూస్తూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే.. జగతితో వసు.. ‘నేను రిషి సార్‌ని నిలదీస్తాను.. ఈ నిర్ణయం తీసుకోవడం సరికాదు కదా మేడమ్..’ అంటుంది. రిషి ఇప్పటికే ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నాడు.. నువ్వు ఇంకా ఇబ్బంది పెట్టకు అని నచ్చజెబుతుంది జగతి. దాంతో పరధ్యానంలో మెట్లు దిగుతూ కిందకు వస్తూ ఉంటుంది వసు. కాలు జారి పడబోతుంటే.. మెట్లు పైకి వెళ్తున్న రిషి పట్టుకుంటాడు. అప్పుడు ఇద్దరి కళ్లు కలుస్తాయి. ‘ఏంటా పరధ్యానం’ అంటాడు రిషి కోపంగా.

‘పరధ్యానం ఏం లేదు సారు.. మీ ధ్యానమే ఉంది..’ అంటుంది వసు. ‘ఏంటీ..’ అంటాడు రిషి. ‘మీకు వినబడింది కదా? నేను మీతో మాట్లాడాలి’ అంటుంది వసు. ఇంతలో దేవయాని వచ్చి.. ‘నాన్నా రిషీ.. సాక్షీ వాళ్లు లగ్నపత్రిక రాయించుకోవడానికి రేపు వస్తున్నారట..’ అంటుంది. వసుకి గుండెల్లో రాయి పడిపోతుంది. ‘సరే పెద్దమ్మా.. నాకు కొంచెం పని ఉంది’ అనేసి రిషి వెళ్లిపోతాడు.

మొత్తానికీ దేవయాని.. కావాలనే హాల్లో కూర్చున్న జగతి, మహేంద్రల దగ్గరకు వెళ్లి.. ‘రేపు సాక్షీపేరెంట్స్ లగ్నపత్రిక రాయించడానికి వస్తున్నారు తెలుసా?’ అంటుంది. దాంతో మహేంద్ర రెచ్చిపోతాడు. ‘ఇది న్యాయం కాదు.. మీరే ఇంటి పెత్తనం చేయండి.. జగతి నేను అంతా మీ మాటే వింటా.. కానీ రిషి జీవితంతో ఆడుకోవద్దు’ అని మొదట ప్రాధేయపడతాడు. అయినా దేవయాని కరగదు. పైగా ‘నాదేముంది? అసలు సాక్షీతో గొడవపడ్డాను కూడా’ అని నవ్వుతుంది. దాంతో మహేంద్ర కోపంతో అరుస్తాడు దేవయానిపైన. అయినా సరే దేవయాని తగ్గదు. నాకు.. ఈ పెళ్లికీ ఏ సంబంధంలేదు అంటుంది. ఇంకా మహేంద్ర ప్రాధేయపడుతూ.. కోపంతో రగిలిపోతూ ఉంటే.. జగతి ‘మహేంద్రా ఆగు.. న్యాయం గెలుస్తుంది. పండుగులన్నింటికీ కారణం రాక్షససంహారమే కదా.. కంగారుదేనికీ’ అంటూ సద్దిచెబుతుంది. అయినా సరే దేవయాని నవ్వుతూ.. ‘పిల్లి శాపాలు నాముందు పనికిరావులే’ అనేసి వెళ్లిపోతుంది. అంతా గౌతమ్, ధరణీల ముందే జరగుతుంది.

మరోవైపు.. రిషి కారుకి అడ్డంగా వసు ఆటో ఆగుతుంది. ఆటో వాడికి డబ్బులు ఇచ్చి పంపేస్తుంది వసు. ‘మీతో మాట్లాడాలి సార్..’ అంటుంది వసు. రిషి దిగి వస్తాడు. ‘ఇందాకే కదా ఇంట్లో కలిశాం..’ అంటాడు రిషి. ‘మీరు వింటాను అంటే.. చాలా ఉంది. చెప్పే బాధ్యత నాకు ఉంది అనుకుంటున్నాను.. మీ మనసుకి మీరు సమాధానం ఇవ్వాలి.. మనస్పూర్తిగానే ఈ నిర్ణయం తీసుకున్నారా?’ అంటూ నిలదీస్తుంది. ‘వసుధారా నేనొక నిర్ణయం తీసుకున్నాను.. ఆశలు వేరు.. జీవితం వేరు.. అందుకే నిర్ణయం తీసుకున్నాను.. నీ మీద అభిమానం నాకు తగ్గదు.. నా మీద గౌరవం నీకు తగ్గదు అని అనుకుంటున్నాను.. జరిగి దాని గురించి విశ్లేషణ అవసరం లేదు..’ అంటాడు రిషి. ‘మీరేనా ఇలా మాట్లాడేది? సాక్షీ గురించి అంతా తెలుసు కదా? కానీ ఎందుకు ఇలా?’ అంటుంది వసు.

‘ఒక్కోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎవరి బలవంతంతోనైనా ఈ నిర్ణయం తీసుకున్నాను అనుకుంటున్నావా? నా విషయంలో నేను క్లారిటీగానే ఉన్నాను.. కొన్నాళ్ల క్రితం జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటే బాగుంటుంది’ అనేసి వసుకి ప్రపోజింగ్ సీన్ గుర్తు చేసి వెళ్లిపోతాడు రిషి. పాపం వసు అల్లాడిపోతుంది. ఇక రిషి, వసుల గురించి.. జగతి, మహేంద్రలు చాలా బాధపడతారు. పెళ్లి ఎలా ఆపాలో అర్థం కాక అల్లాడిపోతారు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది.
రచయిత గురించి
శేఖర్ కుసుమ
శేఖర్ కుసుమ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా, టీవీ రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఎంటర్‌టైన్మెంట్ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.