యాప్నగరం

CCL సందడంతా వాళ్లిద్దరిదే.. గ్రౌండ్‌లో విష్ణుప్రియ, రీతూ చౌదరి హంగామా!

CCL: సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌‌లో తెలుగు వారియర్స్ దుమ్మురేపుతోంది. ఇప్పటికే కేరళతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌ జరుగుతుండగా రీతూ చౌదరి, యాంకర్ విష్ణుప్రియ.. మన టీమ్‌ను ఎంకరేజ్ చేస్తూ, గట్టిగా అరుస్తూ హంగామా చేశారు.

Authored byఆర్ కే మురళీ కృష్ణ | Samayam Telugu 22 Feb 2023, 11:09 am
Vishnu Priya at CCL:ఈ మధ్యే తల్లిని కోల్పోయిన యాంకర్ విష్ణుప్రియ, తండ్రికి దూరమైన జబర్దస్త్ రీతూ చౌదరి.. ఆ దుఃఖం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా జరిగిన తెలుగు వారియర్స్ మ్యాచ్‌కు వీళ్లిద్దరూ హాజరయ్యారు. మన జట్టు కొట్టిన ప్రతి షాట్‌కు క్లాప్స్ కొడుతూ, ఎగురుతూ, గెంతుతూ ఎంకరేజ్ చేశారు. ఫ్యాన్స్‌కు హాయ్ చెబుతూ.. వీళ్లు చేసిన హంగామా మొత్తం తాజాగా తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "తెలుగు వారియర్స్ టీమ్‌ను ఎంకరేజ్ చేస్తూ గ్రౌండ్‌లో మ్యాచ్‌ను ఆస్వాదించాం" అంటూ పోస్ట్ చేశారు. ఈ వీడియోలపై మీరూ ఓ లుక్కేయండి.
Samayam Telugu CCL
CCL: రీతూ, విష్ణు హంగామా

View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)
View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni)

రీతూ చౌదరి(Rithu Chowdary), విష్ణుప్రియ కలిసి గత ఏడాది చివర్లో థాయ్‌లాండ్ ట్రిప్ వెళ్లారు. అక్కడ సూపర్‌గా ఎంజాయ్ చేసి ఇండియాకు తిరిగొచ్చిన కొద్ది రోజులకే విష్ణుప్రియ తల్లి, రీతూ చౌదరి తండ్రి మృతి చెందారు. దీంతో ఇద్దరూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటకు వస్తున్నారు.

ఫస్ట్ మ్యాచ్‌లో గెలుపు

ఇక కేరళ స్ట్రయికర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ ఘన విజయం సాధించింది. 64 పరుగుల తేడాతో గెలుపొందింది. తెలగు వారియర్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్ 30 బంతుల్లోనే 91 పరుగులతో మాస్టర్ ఇన్నింగ్స్ ఆడాడు. అఖిల్ దెబ్బకు బంతి బౌండరీ దాటుతూనే ఉంది. రాయ్‌పూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తెలుగు వారియర్స్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం కేరళ స్ట్రయికర్స్ 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులే చేయగలిగింది.
Varun Tej: వరుణ్ తేజ్ చాలా అందగాడు.. 'సుమ అడ్డా'లో ఓపెన్ అయిన లావణ్య!
ఇక రెండో ఇన్నింగ్స్‌లో అఖిల్ 19 బాల్స్‌లో 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో మన టీమ్ 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని కేరళ స్టయికర్స్‌ ముందు 170 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది. కానీ కేరళ తమ సెకండ్ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు నష్టపోయి 105 పరుగులు మాత్రమే చేసింది. జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన అఖిల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది. ఈ విజయాన్ని ఇంతకు ముందు జట్టులో సభ్యుడిగా ఉన్న తారకరత్నకు అంకితం ఇచ్చాడు అఖిల్. తారకరత్న తమ మధ్య ఈ క్షణం ఉండి ఉంటే బాగుండేదంటూ అఖిల్ ట్వీట్ చేశాడు. గత సీసీఎల్‌లో అఖిలే కెప్టెన్సీలోని తెలుగు వారియర్స్ ‌ట్రోఫీ సాధించింది. ఈసారి కూడా గెలిచి రికార్డు క్రియేట్ చేయాలని టీమ్ పట్టుదలగా ఉంది.
రచయిత గురించి
ఆర్ కే మురళీ కృష్ణ
ఆర్‌కే మురళీ కృష్ణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాలకు సంబంధించిన కొత్త అప్‌డేట్‌లు, స్పెషల్ స్టోరీలు అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, సినిమాకు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.