పాన్ ఇండియా యూట్యూబర్ హర్ష సాయి మరో సాహసానికి నడుం బిగించాడు. స్టార్ హీరోలు.. బడా నేతలు.. రాజకీయ ప్రముఖులు చేయలేని పనుల్ని యూట్యూబర్ చేసి చూపిస్తున్నాడు. రియల్ శ్రీమంతుడిగా మారి కోట్లాది రూపాయిలు పేద ప్రజలకు దానం చేస్తూ యూట్యూబ్లో పాపులర్ అవుతున్న హర్ష సాయి దేశంలోనూ నెంబర్ 1 యూట్యూబర్గా మారారు. 6.25 మిలియన్ల ఫాలోవర్స్తో పాన్ ఇండియా యూట్యూబర్గా చరిత్ర సృష్టించిన హర్ష సాయి.. గత కొన్నాళ్లుగా ఎలాంటి వీడియోలు చేయకుండా సైలెంట్గా ఉన్నాడు.
తాను ఏది చేసినా.. ఎలాంటి వీడియో వదిలినా.. తనకి పేరు రావడంతో పాటు.. పేద ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పనిచేసే హర్ష సాయి మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల ముగ్గురు వీధి బాలలు తాము దాచుకున్న డబ్బులు తీసుకుని ఓ పిజ్జా షాప్కి వెళ్తారు. అయితే వాళ్ల డ్రెస్ని చూసి.. సెక్యురిటీ లోపలికి రానివ్వరు. డబ్బులు ఉన్నాయి అని చెప్పినా.. వాళ్లని బలవంతంగా బయటకు గెంటేస్తారు సెక్యురిటీ వాళ్లు. ఈ వీడియో చూసిన హర్ష సాయి చలించిపోయాడు. ఫైవ్ స్టార్ రెస్టారెంట్లు కేవలం డబ్బున్న వాళ్లకి మాత్రమే కాదు.. నిరు పేదలకు కూడా చేరువ చేయాలనే వైపుగా ఆలోచన మొదలుపెట్టాడు.
దానిలో భాగంగా దేశానికి అన్నం పెట్టే ఓ రైతుని ఎంచుకుని.. అతన్ని సిటీలో ఉన్న ఓ పది ఫైవ్ స్టార్ రెస్టారెంట్ల దగ్గరకు పంపించి తాగడానికి మంచినీళ్లు ఇవ్వమని కోరాడు. అయితే వాళ్లు మంచి నీళ్లు ఇవ్వడం కాదు కదా.. గేట్ బయటనుంచే తిప్పి పంపించి వేశారు. ఇది బలిసినోళ్ల హోటల్రా.. పేదోళ్లకి ప్రవేశం లేదని దేశానికి తిండిపెట్టే రైతుకి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా బయటకు గెంటేశారు.
అది చూసిన హర్ష సాయి.. ఆ పేద రైతుని మాత్రమే కాకుండా.. బాత్ రూంలు కడిగే ఓ మహిళ.. చెప్పులుకుట్టుకునే వ్యక్తి.. ఓ బార్బర్.. ఓ బైక్ మెకానిక్.. ఎంతో మంది కష్టపడి నిరుపేదలైన వాళ్లని.. ఎంచుకున్నాడు. ముంబైలో ఏ వీధి బాలల్ని అయితే పిజ్జా షాప్ నుంచి బయటకు గెంటేశారో వాళ్ల ఇంటికి వెళ్లి.. వాళ్ల పేరెంట్స్తో మాట్లాడి.. వాళ్లని కూడా తీసుకుని వచ్చాడు.
ఇందుకోసం.. హైదరాబాద్ నగరంలోనే అత్యంత ఖరీదైన.. ఫలక్నుమా ప్యాలస్ను ఎంచుకున్నాడు. సాధారణంగా ఉండే ఫైవ్ స్టార్ రెస్టారెంట్ల కంటే ఇందులో పది రెట్లు ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఒకేసారి 101 మందికి ఆతిథ్యం ఇవ్వగలిగిన ప్రపంచంలో అతి పెద్ద డైనింగ్ టేబుల్ ఫలక్నుమా ప్యాలస్కి ప్రత్యేకం. కేవలం బంగారం వెండి పాత్రల్లో మాత్రమే భోజనాన్ని వడిస్తారు. ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఎంతో మంది ప్రముఖులు భోజనం చేశారు. ఈ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేయాలంటే.. ఒక్కో ప్లేట్కి అక్షరాల రూ.30 వేలు చెల్లించాల్సి ఉంటుంది. నిజాం ప్రత్యేకమైన వంటకాలను శాకాహార, మాంసాహార వంటకాలను వడ్డిస్తారు. రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు మాత్రమే ఈ టేబుల్పై భోజనం చేశారు. ఎందుకంటే ఒక సామాన్యుడు ప్లేట్ రూ.30 పెట్టి భోజనం చేయడం అంటే అసాధ్యం.. కానీ ఈ అసాధ్యాన్నిసుసాధ్యం చేసి చూపించాడు యూట్యూబర్ హర్షసాయి.
ఖర్చుకి వెనకాడకుండా.. ఆ ఖరీదైన టేబుల్పై ఒక్కొక్కరికీ రూ.30 వేలు చెల్లించి.. 101 మందికి లగ్జరీ మీల్స్ పెట్టించాడు. రాజులకు, ప్రభువులకు, దేశాధినేతలు, ఉన్నత వర్గాల వారికి మాత్రమే అన్నట్టుగా ఉన్న లగ్జరీ హోటల్ ఫలక్నుమా ప్యాలస్లో వందలమంది పేదల్ని తీసుకుని వెళ్లాడు హర్షసాయి. అయితే ఈ జర్నీని ఇక్కడితో ఆపేయలేదు.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇతర రాష్ట్రాల్లో కూడా పేదోడికి ఫైవ్ స్టార్ హోటల్ వసతి కల్పిస్తానంటూ కంకణం కట్టుకున్నాడు. అంతేకాదు పేదల కోసం ఐదు 5 స్టార్ హోటల్స్ ఓపెన్ చేస్తానని అంటున్నాడు హర్షసాయి. తాజాగా హర్ష సాయి వదిలిన వీడియో ఒకే ఒక్కరోజులో 4 మిలియన్లకు చేరువ కావడం విశేషం.
తాను ఏది చేసినా.. ఎలాంటి వీడియో వదిలినా.. తనకి పేరు రావడంతో పాటు.. పేద ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పనిచేసే హర్ష సాయి మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల ముగ్గురు వీధి బాలలు తాము దాచుకున్న డబ్బులు తీసుకుని ఓ పిజ్జా షాప్కి వెళ్తారు. అయితే వాళ్ల డ్రెస్ని చూసి.. సెక్యురిటీ లోపలికి రానివ్వరు. డబ్బులు ఉన్నాయి అని చెప్పినా.. వాళ్లని బలవంతంగా బయటకు గెంటేస్తారు సెక్యురిటీ వాళ్లు. ఈ వీడియో చూసిన హర్ష సాయి చలించిపోయాడు. ఫైవ్ స్టార్ రెస్టారెంట్లు కేవలం డబ్బున్న వాళ్లకి మాత్రమే కాదు.. నిరు పేదలకు కూడా చేరువ చేయాలనే వైపుగా ఆలోచన మొదలుపెట్టాడు.
దానిలో భాగంగా దేశానికి అన్నం పెట్టే ఓ రైతుని ఎంచుకుని.. అతన్ని సిటీలో ఉన్న ఓ పది ఫైవ్ స్టార్ రెస్టారెంట్ల దగ్గరకు పంపించి తాగడానికి మంచినీళ్లు ఇవ్వమని కోరాడు. అయితే వాళ్లు మంచి నీళ్లు ఇవ్వడం కాదు కదా.. గేట్ బయటనుంచే తిప్పి పంపించి వేశారు. ఇది బలిసినోళ్ల హోటల్రా.. పేదోళ్లకి ప్రవేశం లేదని దేశానికి తిండిపెట్టే రైతుకి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా బయటకు గెంటేశారు.
అది చూసిన హర్ష సాయి.. ఆ పేద రైతుని మాత్రమే కాకుండా.. బాత్ రూంలు కడిగే ఓ మహిళ.. చెప్పులుకుట్టుకునే వ్యక్తి.. ఓ బార్బర్.. ఓ బైక్ మెకానిక్.. ఎంతో మంది కష్టపడి నిరుపేదలైన వాళ్లని.. ఎంచుకున్నాడు. ముంబైలో ఏ వీధి బాలల్ని అయితే పిజ్జా షాప్ నుంచి బయటకు గెంటేశారో వాళ్ల ఇంటికి వెళ్లి.. వాళ్ల పేరెంట్స్తో మాట్లాడి.. వాళ్లని కూడా తీసుకుని వచ్చాడు.
ఇందుకోసం.. హైదరాబాద్ నగరంలోనే అత్యంత ఖరీదైన.. ఫలక్నుమా ప్యాలస్ను ఎంచుకున్నాడు. సాధారణంగా ఉండే ఫైవ్ స్టార్ రెస్టారెంట్ల కంటే ఇందులో పది రెట్లు ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఒకేసారి 101 మందికి ఆతిథ్యం ఇవ్వగలిగిన ప్రపంచంలో అతి పెద్ద డైనింగ్ టేబుల్ ఫలక్నుమా ప్యాలస్కి ప్రత్యేకం. కేవలం బంగారం వెండి పాత్రల్లో మాత్రమే భోజనాన్ని వడిస్తారు. ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఎంతో మంది ప్రముఖులు భోజనం చేశారు. ఈ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేయాలంటే.. ఒక్కో ప్లేట్కి అక్షరాల రూ.30 వేలు చెల్లించాల్సి ఉంటుంది. నిజాం ప్రత్యేకమైన వంటకాలను శాకాహార, మాంసాహార వంటకాలను వడ్డిస్తారు. రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు మాత్రమే ఈ టేబుల్పై భోజనం చేశారు. ఎందుకంటే ఒక సామాన్యుడు ప్లేట్ రూ.30 పెట్టి భోజనం చేయడం అంటే అసాధ్యం.. కానీ ఈ అసాధ్యాన్నిసుసాధ్యం చేసి చూపించాడు యూట్యూబర్ హర్షసాయి.
ఖర్చుకి వెనకాడకుండా.. ఆ ఖరీదైన టేబుల్పై ఒక్కొక్కరికీ రూ.30 వేలు చెల్లించి.. 101 మందికి లగ్జరీ మీల్స్ పెట్టించాడు. రాజులకు, ప్రభువులకు, దేశాధినేతలు, ఉన్నత వర్గాల వారికి మాత్రమే అన్నట్టుగా ఉన్న లగ్జరీ హోటల్ ఫలక్నుమా ప్యాలస్లో వందలమంది పేదల్ని తీసుకుని వెళ్లాడు హర్షసాయి. అయితే ఈ జర్నీని ఇక్కడితో ఆపేయలేదు.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇతర రాష్ట్రాల్లో కూడా పేదోడికి ఫైవ్ స్టార్ హోటల్ వసతి కల్పిస్తానంటూ కంకణం కట్టుకున్నాడు. అంతేకాదు పేదల కోసం ఐదు 5 స్టార్ హోటల్స్ ఓపెన్ చేస్తానని అంటున్నాడు హర్షసాయి. తాజాగా హర్ష సాయి వదిలిన వీడియో ఒకే ఒక్కరోజులో 4 మిలియన్లకు చేరువ కావడం విశేషం.