యాప్నగరం

అతను అసామాన్యుడు... సునామీతో పోరాడి 27 గంటలు ఈదాడు...

సునామీ డేంజరస్. క్షణాల్లో ప్రాణాలు తియ్యగలదు. మరి అతను అదే సునామీతో ఎలా పోరాడాడు? అసలు 27 గంటలు ఎలా ఈదాడు?.. ఆసక్తికర కథ తెలుసుకుందాం.

Samayam Telugu 21 Jan 2022, 2:22 pm
57 వయసులో ఎవరికైనా ఒంట్లో ఎనర్జీ తక్కువే ఉంటుంది. ఓ గంట పని చెయ్యగానే అలసట వచ్చేస్తుంది. అలాంటి వయసులో లిసాలా ఫొలావ్ (Lisala Folau) మృత్యుంజయుడిగా నిలిచాడు. రియల్ లైఫ్‌లో సునామీతో పోరాడాడు. బలమైన అలలకు ఎదురొడ్డి నిలిచాడు. వణికించే చలిలోనూ... సముద్ర నీటిలో కంటిన్యూగా 27 గంటలు ఈది.. ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచాడు.
Samayam Telugu రియల్ ఆక్వామాన్ లిసాలా (image credit - twitter - JohnPompliano)


గత శనివారం పసిఫిక్ మహా సముద్రం... టోంగాలోని ఫొనాఫూ దీవుల్లో.. హూంగా టోంగా హూంగా హాపై అగ్నిపర్వతం బద్దలైన విషయం అందరికీ తెలుసు. సముద్రంలోపల భారీ విస్ఫోటనం జరగడంతో... టోంగాటపులో సునామీ వచ్చింది (tonga Tsunami).

సునామీ వచ్చినప్పుడు అటాటా అనే చిన్న దివిలో... రోజూలాగే జీవిస్తున్నాడు లిసాలా. శనివారం తన ఇంటికి పెయింటింగ్ వేయిస్తున్నాడు. ఆ సమయంలో అతని సోదరుడు వచ్చి... సునామీ రాబోతోంది జాగ్రత్త అని చెప్పాడు. సరేనన్న లిసాలా... భారీ అలలు వస్తున్న సమయంలో... ఓ చెట్టు ఎక్కాడు. అలలు వచ్చి వెళ్లిపోయాయి. చెట్టికి ఏమీ కాలేదు. హమ్మయ్య అనుకున్నాడు. చెట్టు దిగాడు. ఆ తర్వాత అనూహ్యంగా రాత్రి 7 గంటలకు భారీ సునామీ విరుచుకుపడింది. అప్పుడు లిసాలా అలల్లో కొట్టుకుపోయాడు. (pacific tsunami)

బాధాకరమైన విషయమేంటంటే... 57 ఏళ్ల లిసాలా దివ్యాంగుడు. సరిగా నడవలేడు. అందువల్లే సునామీ వచ్చినప్పుడు తప్పించుకోలేకపోయాడు. సముద్రంలో అతను కంటిన్యూగా 7.5 కిలోమీటర్లు ఈదాడు. ప్రధానమైన టోంగాతాపు (Tongatapu) దీవికి చేరాడు.


అదేమంత తేలికగా జరగలేదు. అతను శనివారం రాత్రి నుంచి ఆది వారం రాత్రి 10 గంటల వరకూ... మొత్తం 27 గంటలపాటూ ఈదాడు. ఒక్కక్షణం ఈత మానేసినా సముద్రం మింగేస్తుంది. అలాంటిది అతను అలా ఈదగలిగాడంటే... ఎంత గొప్ప విషయం ఇది. అసలే పసిఫిక్ మహాసముద్రం గంభీరంగా ఉంటుంది. అందులో షార్కులు, తిమింగలాలు సహా ఎన్నో భయంకరమైన చేపలుంటాయి. వాటికి చిక్కకుండా తప్పించుకొని ఈదడం మామూలు విషయమా?


లిసాలా కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. "అతను నిజ జీవిత ఆక్వామాన్ (real life Aquaman)" అని ఓ యూజర్ మెచ్చుకోగా... "అతను లెజెండ్" అని మరో యూజర్ మెచ్చుకున్నారు.

videos: సునామీ వస్తుంటే ఎదురెళ్లారు.. సడెన్‌గా ఏమైందో తెలుసా...
టోంగా రాజధాని నుకువాలోఫాకి వాయవ్య దిశలో 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అటాటా. బోటులో అరగంట ప్రయాణం. అటాటాలో 60 మంది నివసిస్తున్నారు. సునామీ వల్ల ఈ దీవి పూర్తిగా దెబ్బతింది. అక్కడ అలాంటి మరికొన్ని దీవులున్నాయి. వాటిలో ప్రజలను టోంగా నౌకాదళ బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శనివారం వచ్చిన సునామీలో ముగ్గురు చనిపోయినట్లు తెలిసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.