భార్య భర్తలు నేరుగా హాజరైతే గానీ విడాకులు దక్కవు. అలాంటిది వాట్సాప్ కాల్ నుంచి విడాకులా? అని ఆశ్చర్యపోతున్నారా! అయితే, మహారాష్ట్రలోని నాగపూర్ ఫ్యామిలీ కోర్ట్లో ఏం జరిగిందో తెలుసుకోవల్సిందే. నాగపూర్కు చెందిన ఓ జంట 2013 నుంచి 2017 వరకు అమెరికాలోని మిచిగన్లో నివసించారు. వారిద్దరి మనస్పర్థలు ఏర్పడటంతో అమెరికాలోనే విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. కొన్నాళ్ల తర్వాత భర్త అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశాడు. తనకు భార్యతో విడాకులు కావాలంటూ నాగపూర్ ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. ఆమె కూడా విడాకాలు తీసుకోడానికి అంగీకరించింది. అయితే, అమెరికా నుంచి రావడం కష్టమని తెలిపింది. దీంతో ఆమెను మిచిగన్ నుంచి విడాకులకు దరఖాస్తు చేసుకోవాలని కోర్టు కోరింది.
ఎట్టకేలకు ఆమె పంపిన దరఖాస్తు ఫ్యామిలీ కోర్టుకు అందాయి. అయితే, ఇద్దరికి విడాకులు మంజూరు చేయాలంటే నిబంధన ప్రకారం.. భార్య, భర్త తప్పకుండా కోర్టుకు హాజరుకావాలి. వారిద్దరితో మాట్లాడి, విచారించిన తర్వాతే విడాకులు మంజూరు చేయాలి. అయితే, ఆమె వీసా సమస్యతో ఇండియాకు రావడం కష్టమని తెలియడంతో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా విడాకులను విచారణ కొనసాగించాలని న్యాయవాది నిర్ణయించారు. ఈ సందర్భంగా మిచిగన్లో ఉన్న ఆమెతో మాట్లాడి ఇరువురికి విడాకులు మంజూరు చేశారు.
ఎట్టకేలకు ఆమె పంపిన దరఖాస్తు ఫ్యామిలీ కోర్టుకు అందాయి. అయితే, ఇద్దరికి విడాకులు మంజూరు చేయాలంటే నిబంధన ప్రకారం.. భార్య, భర్త తప్పకుండా కోర్టుకు హాజరుకావాలి. వారిద్దరితో మాట్లాడి, విచారించిన తర్వాతే విడాకులు మంజూరు చేయాలి. అయితే, ఆమె వీసా సమస్యతో ఇండియాకు రావడం కష్టమని తెలియడంతో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా విడాకులను విచారణ కొనసాగించాలని న్యాయవాది నిర్ణయించారు. ఈ సందర్భంగా మిచిగన్లో ఉన్న ఆమెతో మాట్లాడి ఇరువురికి విడాకులు మంజూరు చేశారు.