యాప్నగరం

Video: ఇసుకలో ఆలూ చిప్స్‌తో పూడ్చుకున్నాడు.. ఆ తర్వాత ఇలా అయ్యింది!

సీగల్ పక్షులకు చిప్స్ పెట్టాలనుకుంటే... డైరెక్టుగా పెట్టొచ్చు. కానీ తనకు తాను ఇసుకలో పూడ్చుకోవడం ఎందుకు? చిప్స్‌తో అతను ఎందుకిలా చేశాడు?

Samayam Telugu 28 Oct 2021, 12:32 pm
కొంతమంది తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు ఇతరులకు ఓ పట్టాన అర్థం కావు. ఇది అలాంటిదే. ఆస్ట్రేలియాలో... కామెడీ వీడియోలు చేసే మార్టీ, మైకెల్ మరో కొత్త వీడియోతో తెరపైకి వచ్చారు. ఆ ఇద్దరిలో ఓ వ్యక్తి... బీచ్‌ ఇసుకలో గొయ్యి తీసుకొని... తనను తానుగా పూడ్చుకున్నాడు. తల మాత్రమే పైకి ఉండేలా చేసుకున్నాడు. ఆ తర్వాత తన చుట్టూ ఆలూ చిప్స్‌ని గుట్టలా వేయించుకున్నాడు. కాసేపటికి ఆ చిప్స్‌ని సీగల్ (Seagull) పక్షులు చూశారు. సముద్రాలు, నదులపై చేపల కోసం వేటాడే ఈ పక్షులు ఈ రోజుల్లో మనుషులపై దండయాత్ర చేస్తూ... వారు తినే వాటిని ఎత్తుకుపోతున్నారు. ఇప్పుడు వాటికి ఏకంగా చిప్స్ గుట్ట కనిపించింది... ఇక ఊరుకుంటాయా... (seagull video)
Samayam Telugu ఎందుకిలా (image credit - instagram - martyandmichael)


చిప్స్ గుట్ట దగ్గరకు వచ్చిన సీగల్ పక్షులు ఓవైపు అతని తలను చూసి భయపడుతూనే... మరోవైపు ఎలాగొలా చిప్స్ లాగించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలా అతని చుట్టూ చేరిన ఆ పక్షులు అరుస్తూ నానా హగామా చేస్తున్నాయి. వాటిలో కొన్ని పెద్ద కొంగలు కూడా ఉన్నాయి. వాటికి ఆహారం ఫ్రీగా దొరికినట్లు కనిపిస్తున్నా... అతను పట్టుకుంటాడేమో అనే భయం కూడా ఉంది. అందుకే... అతని దృష్టిని మరల్చుతూ చిప్స్ ఎత్తుకెళ్తున్నాయి.

ఆ వీడియో (viral video)ని ఇక్కడ చూడండి
View this post on Instagram A post shared by Marty and Michael (@martyandmichael)
ఎందుకిలా?
వీడియో చూసిన చాలా మందికి అతను ఎందుకిలా చేశాడనే డౌట్ రావడం సహజం. ఈ స్టంట్ కోసం అతను దాదాపు రూ.75,000 చిప్స్ కొన్నాడు. వాటన్నింటినీ తన చుట్టూ పోగేసుకున్నాడు. సర్ఫర్స్ ప్యారడైజ్ బీచ్ (Surfers Paradise beach)లో ఇది చేశారు. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లోని martyandmichael అకౌంట్‌లో అప్‌లోడ్ చేసి "ఇదో సైన్స్ ఎక్స్‌పెరిమెంట్, త్వరలోనే దీని ఫలితాలు తెలుస్తాయి" అని క్యాప్షన్‌లో తెలిపారు. దీని ద్వారా వారు ఏం తెలుసుకోబోతున్నారో ఇంకా చెప్పలేదు.

Video: స్నానం చేద్దామని చెరువులో దిగాడు... మొసలి వచ్చి..!
మార్టీ అండ్ మైకెల్ అకౌంట్‌కి 11 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఈ వీడియోని ఇప్పటికే 9 వేల మందికి పైగా చూశారు. చాలా మంది రూ.75వేలు చిప్స్ కోసం ఖర్చు పెట్టారంటే నమ్మట్లేదు. "సరిగ్గా చెప్పాలంటే... ఇది పక్షులకు సరైన ఆహారం కాదు. ఆహారం వృథా చేశారు. ఇందులో ఫన్నీ లేదు" అని ఓ యూజర్ అభిప్రాయపడ్డారు.

Video: దేవుడా.. ఆక్టోపస్‌తో పనిచేయడం ఇంత కష్టమా!
"ఇదో బుద్ధిలేని పని. ఫన్నీ ఏం లేదు. ఆ డబ్బును ఎందుకు చారిటీ కోసం డొనేట్ చెయ్యలేదు? ఆకలితో ఉన్న మనుషులకు ఆహారం పెట్టండి, సీగల్స్‌కి కాదు" అని మరో యూజర్ మండిపడ్డారు. "వెళ్లి... తీరంలో ఇల్లు లేని వారి కోసం రూ.75వేలు ఖర్చు పెట్టండి. అది మంచి స్టోరీ అవుతుంది" అని మరో యూజర్ సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.