యాప్నగరం

వామ్మో.. 50 పాము పిల్లలను కొట్టి చంపేసిన మహిళ, తల్లి పాము మిస్సింగ్!

ఒక్క పామును చూస్తే మనం భయంతో పరుగులు పెడతాం. కానీ, ఆమె ఒకేసారి 50 పాములను చంపేసింది.

Samayam Telugu 15 Apr 2020, 9:33 am
లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లల్లో ఉండటం వల్ల జంతువులకు పూర్తి స్వేచ్ఛ లభిస్తోంది. చివరికి పులులు కూడా జనావాసాల్లోకి ప్రవేసిస్తూ హాయిగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక పాములైతే ఏకంగా ఇళ్లల్లోకే చొరబడుతున్నాయి. దీంతో కొందరు పాము కాటుకు గురై ఆస్పత్రిపాలవుతున్నారు.
Samayam Telugu snake-516507_1280


ఒక్క పామును చూస్తేనే మనం భయం వణికిపోతాం. అలాంటి ఒకేసారి పదుల సంఖ్యలో పాములు ఒకే చోట కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. చిన్నశంకరంపేట మండలం గవలపల్లికి చెందిన కొంక లచ్చల్‌, భార్య స్వరూపతో కలిసి ఇంటి వద్ద ఉన్న బండ రాళ్లను తొలగిస్తుండగా.. పదుల సంఖ్యలో పాము పిల్లలు భయటపడ్డాయి.

Also Read: ఈ బాతు మహానటి.. కుక్కను ఎలా బురిడీ కొట్టించిందో చూడండి

ఆ పాములను చూడగానే ఆ దంపతులు షాకయ్యారు. స్వరూపా వెంటనే కర్ర తీసుకొచ్చి వాటిని వెంటాడి మరీ చంపేసింది. సుమారు 50 పాములను చంపేశామని, అవన్నీ తాచు పాము పిల్లలని ఆ దంపతులు తెలిపారు. అవి కరిస్తే ప్రాణాలు పోతాయనే భయంతోనే చంపేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, తల్లి పాము కనిపించకపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.