జంతువుల ప్రదర్శనశాలకు వెళ్ళినప్పుడు ఇనుప గొలుసులతో బందీగా వున్న ఏనుగును చూసి ఆనందిస్తాం. కానీ అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే ఏనుగు ఆ బందీలో అనుభవించే బాధ వర్ణనాతీతం. అంతేకాక వాటిని అలానే ఒకే ప్రదేశంలో ఉంచటం వల్ల వన్యప్రాణులు అనారోగ్యం భారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది . ఉత్తర ప్రదేశ్ రాష్టంలో యాభై సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం బందీగా వున్న.. గజరాజు అని పిలవబడే 70 ఏళ్ళ వయస్సు గల ఏనుగుకు గత సంవత్సరం విముక్తి కలిగింది. ఆ 70 ఏళ్ళ వయస్సు గల ఏనుగుకు విముక్తి కలిగి ఏడాది ముగిసింది.
గజరాజుని శ్రీ భవాని మ్యూజియం, ఔంధ్, ఇంకా సతారాలోని యమయి దేవి ఆలయం వంటి పర్యాటక ప్రదేశాలలో యాభై సంవత్సరాలపైన పర్యాటకులు చూడటానికి బందీగా ఉంచారు.ఆ సమయంలో ఎవరో గజరాజు దంతాలు దొంగలించారు.. అప్పుడు . ఆహారం సరిగ్గా తీసుకోలేక ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని పరిశోధకులు వెల్లడించారు. గజరాజు దీనమైన పరిస్థితి తెలుసుకున్న కొంతమంది #FreeGajraj అనే యస్ ట్యాగ్ తో విస్తృత ప్రచారం చేయటం వల్ల అప్పుడు అధికారులు అప్పుడు బందీ నుంచి విముక్తి కలిగించారు.
యాభై సంవత్సరాలపైన పర్యాటకులు చూడటానికి బందీగా అలా ఉంచటం వల్ల గజరాజుకి అనారోగ్య సమస్యలు వచ్చాయని సీనియర్ వన్యప్రాణి పశువైద్య అధికారి యడరాజ్ ఖాద్పేకర్ చెప్పారు. ప్రస్తుతం గజరాజుకి రోజూ చికిత్స చేస్తూ.. మంచి పోషక ఆహారం అందిస్తున్నట్లు ఖాద్పేకర్ తెలిపారు.
సంఘటన తర్వాత ఉత్తరప్రదేశ్ లో నవంబర్ 2018 లో ఏనుగుల కోసం ఆస్పత్రిని నిర్మించారు. ఇది 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసారు, అనారోగ్యం మరియు గాయపడిన ఏనుగుల చికిత్సకు ఉపయోగపడుతోంది. ఈ వైద్య కేంద్రంలో వైర్లెస్ X- రే, థర్మల్ ఇమేజింగ్, అల్ట్రాసోనోగ్రఫీ, వాటితో పాటు అంబులెన్స్ వంటి సదుపాయాలున్నాయి.
గజరాజుని శ్రీ భవాని మ్యూజియం, ఔంధ్, ఇంకా సతారాలోని యమయి దేవి ఆలయం వంటి పర్యాటక ప్రదేశాలలో యాభై సంవత్సరాలపైన పర్యాటకులు చూడటానికి బందీగా ఉంచారు.ఆ సమయంలో ఎవరో గజరాజు దంతాలు దొంగలించారు.. అప్పుడు . ఆహారం సరిగ్గా తీసుకోలేక ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని పరిశోధకులు వెల్లడించారు. గజరాజు దీనమైన పరిస్థితి తెలుసుకున్న కొంతమంది #FreeGajraj అనే యస్ ట్యాగ్ తో విస్తృత ప్రచారం చేయటం వల్ల అప్పుడు అధికారులు అప్పుడు బందీ నుంచి విముక్తి కలిగించారు.