యాప్నగరం

75 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన మరో బామ్మ.. ఏపీ రికార్డు బద్దలు!

కోడలిపై కోపంతో.. 75 ఏళ్ల వృద్ధురాలు గర్భం దాల్చింది. ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

Samayam Telugu 15 Oct 2019, 9:45 pm
డి వయస్సు రాగానే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. ఇక వృద్ధుల్లో ఆ ఛాన్సే ఉండదు. అయితే, ఇటీవల లేటు వయస్సులో కూడా గర్భం దాల్చుతున్న వృద్ధులు.. ఆ లెక్కలన్నీ తప్పులేనని తేల్చేస్తున్నారు. పిల్లలు కనడానికి వయస్సుతో పని ఏముందని అంటున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరుకు చెందిన ఎర్రమట్టి మంగమ్మ 74 ఏళ్ల వయస్సులో పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.
Samayam Telugu baby_GettyImages


Read also: 74 ఏళ్లకు మాతృత్వ మాధుర్యం.. పసికందులకు పాలిచ్చేందుకు అడ్డొస్తున్న వయసు, కానీ..!

తాజాగా మరో బామ్మ.. 75 ఏళ్ల వయస్సులో ఆడ బిడ్డకు జన్మనిచ్చి ఆమె రికార్డును బద్దలకొట్టింది. వృద్ధాప్యంలోనూ వీరు అంత సులభంగా గర్భం దాల్చడానికి కారణం.. ఐవీఎఫ్ విధానం.

రాజస్థాన్‌లోని కోటాకు చెందిన వృద్ధురాలికి పిల్లలు లేరు. దీంతో ఆమె తమ బంధువుల బిడ్డను దత్తత తీసుకుంది. అయితే, అతడి భార్య ఆమెను కొట్టడంతో.. తానే సొంతంగా ఓ బిడ్డను కనాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా కింకార్ ఆసుపత్రిలో ఐవీఎఫ్ విధానం ద్వారా గర్భం దాల్చింది.

Read also: కను గుడ్లు లేకుండా పుట్టిన బిడ్డ, తల్లి వదిలేయడంతో..

డాక్టర్ అభిలాషా కింకార్ మాట్లాడుతూ.. ‘‘వృద్ధాప్యం వల్ల ఆమె తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది.45 ఏళ్ల కిందట ఆమెకు క్షయ వ్యాధికి గురైంది. దీనివల్ల ఒక ఊపిరితీత్తి మాత్రమే పనిచేస్తోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో ఆమెను సీ-సెక్షన్‌కు తరలించాం. విజయవంతంగా ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశాం. ఆ బిడ్డకు ఇంకా నెలలు పూర్తిగా నిండలేదు. ఆమె అనారోగ్య పరిస్థితుల వల్ల ఆరున్నర మాసాలకే బిడ్డను ప్రసవించింది’’ అని తెలిపారు. ప్రస్తుతం ఆ బిడ్డ వైద్యుల పర్యవేక్షణలో ఉంది.

Read also: కడుపు నొప్పని వెళ్లిన యువకుడికి ప్రెగ్నెన్సీ పరీక్షలు.. డాక్టర్ ఘనకార్యం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.