యాప్నగరం

ట్రాఫిక్ చలానా చెల్లించమంటే.. బైకును తగలెట్టేసిన యువకుడు

New traffic challan: ట్రాఫిక్ పోలీసులు చలానా చెల్లించమన్నారనే కోపంతో ఓ వ్యక్తి వారి కళ్ల ముందే తన బైకుకు నిప్పు పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Samayam Telugu 5 Sep 2019, 11:17 pm
దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ జరిమానాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాహనాలతో బయటకు వెళ్తే.. ఏ రూల్ కింద ఎంత చెల్లించాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. అయితే, గురువారం ఓ వ్యక్తి పోలీసులకే షాకిచ్చాడు. ట్రాఫిక్ చలానా చెల్లించమన్నారనే ఆగ్రహంతో తన బైకును తగలబెట్టేసి నిరసన వ్యక్తం చేశాడు.
Samayam Telugu ddd


Read also:ట్రాక్టర్ డ్రైవర్‌కు రూ.59,000 జరిమానా.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన ఫలితం!

ఢిల్లీలోని షేక్ సరాయి ఫేస్‌-1లో చోటుచేసుకున్న ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం ఉదయం ట్రాఫిక్ పోలీసులు రాకేష్ అనే బైకర్‌ను అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న అతడిని పరీక్షించగా ఆల్కహాల్ శాతం ప్రభావం 200 దాటినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అతడిని బైకు పత్రాలను, లైసెన్స్ అడిగారు. అతని వద్ద అవేమీ లేకపోవడంతో జరిమానా విధించారు.

Read also: విచిత్రం: రోడ్ క్రాస్ చేసిన ‘ట్రాఫిక్ సిగ్నల్’.. దీనికెంత ఫైన్ వేస్తారో?

డబ్బులు చెల్లించలేనని చెప్పడంతో పోలీసులు అతడి బైకును స్వాధీనం చేసుకుని పక్కన పెట్టారు. దీంతో రాకేష్.. బైకులో ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని, వాటిని తీసుకుంటానని చెప్పాడు. అయితే, అతడు బైకు పెట్రోల్ పైపును లీక్ చేసి నిప్పు పెట్టాడు. దీంతో పోలీసులు మంటలు అదుపులోకి తెచ్చి రాకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం అతడిని ఆసుపత్రికి తరలించారు.

వీడియో:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.