యాప్నగరం

అద్భుతం.. బిడ్డను ప్రసవించిన 26 రోజుల్లో కవలలకు జన్మనిచ్చిన మహిళ

అద్భుతం.. నెల రోజుల వ్యవధిలో ఆమె రెండుసార్లు ప్రసవించింది. ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది.

Samayam Telugu 18 Oct 2019, 3:00 pm
మె మొదటి బిడ్డకు జన్మనిచ్చిన 26 రోజుల తర్వాత మళ్లీ బిడ్డలను ప్రసవించింది. రెండోసారి ఆమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన గురించి తెలుసుకోవల్సిందే. జెస్సోర్‌ ప్రాంతానికి చెందిన అరిఫా సుల్తానా ఐతీ ఫిబ్రవరి 25న నెలలు నిండని ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది.
Samayam Telugu gettyimages-1018811246-170667a


సాధారణ ప్రసవమే కావడంతో వైద్యులు ఆమెకు తగిన వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఇంటికి పంపేశారు. అయితే, మార్చి 25న ఆమె తీవ్రకు జ్వరం, కడుపులో నొప్పులు రావడంతో ఆమెను ఖుల్నా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటికే ఆమె ఒక బిడ్డను ప్రసవించడంతో వైద్యులు కూడా గందరగోళానికి గురయ్యారు. గైనకాలజీ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాక్టర్ షీలా పొద్దరు ఆమెకు అల్ట్రాసోనోగ్రఫీ నిర్వహించి ఆమె కడుపులో రెండు గర్భాశయాలు ఉన్నట్లు గుర్తించారు. రెండో గర్భాశయంలో కవలలు ఉండటంతో వెంటనే సిజేరియన్ నిర్వహించారు. రెండో ప్రసవంలో ఆమె ఆడ, మగ కవలలకు జన్మనిచ్చింది.

ఈ ఘటనపై జెస్సోర్‌ చీఫ్‌ గవర్నమెంట్‌ డాక్టర్‌ దిలీప్‌ రాయ్‌ స్పందిస్తూ.. తన 30 ఏళ్ల కెరీర్‌లో ఇలాంటి కేసును తాను చూడలేదన్నారు. తొలి ప్రసవం సమయంలోనే వైద్యులు మరో గర్భాశయాన్ని గుర్తించకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. మహిళలకు రెండు గర్భాశయాలు ఉండటం చాలా అరుదని తెలిపారు. ఇలాంటి ప్రసవం ఇదే మొదటిసారి కావవచ్చని తెలిపారు.

Read also:

ఆ కవలలకు తల్లి ఒకరే.. తండ్రులు మాత్రం వేర్వేరు!
సెక్స్ తర్వాతే పెళ్లి.. అమ్మాయిలకు ప్రత్యేక గుడిసెలు.. అక్కడ అదే ఆచారం!
5 గంటలు నిర్విరామంగా సెక్స్.. ఆ కోరికే ఆమెను కాటేసింది!
ఆ గ్రామంలో పిల్లలను ప్రసవించకూడదు, శవాలను పూడ్చకూడదు!
దంతాలను మింగేసిన మహిళ, ఊపిరాడక అస్వస్థత!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.