యాప్నగరం

అమ్మమ్మ కోసం.. 2,800 కిమీలు నడిచిన పదేళ్ల బాలుడు

ఓ బాలుడు తన అమ్మమ్మను హత్తుకోవడం కోసం చేసిన సాహసం ఇది. ఒంటరిగా నివసిస్తున్న తన అమ్మమ్మను కలుసుకోడానికి లాక్‌డౌన్‌లో మొదలుపెట్టిన నడక.. ఇప్పటికి పూర్తయ్యింది.

Samayam Telugu 3 Oct 2020, 1:50 pm
బాలుడికి తన అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టం.. ఆమెను కలుసుకుని సుమారు ఏడాది పైనే అవుతోంది. దీంతో ఆ బాలుడు తల్లిదండ్రులతో కలిసి హాలిడేస్‌లో అమ్మమ్మ ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాడు. అయితే, కరోనా వైరస్ వల్ల అది సాధ్యం కాలేదు. పైగా వారి దేశంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సరిహద్దులు మూసుకుపోయాయి. లాక్‌డౌన్ విధించారు. ఫలితంగా అంతా ఇంట్లోనే బంధీ అయ్యారు. దీంతో ఆ బాలుడు తన అమ్మమ్మ కోసం బెంగ పెట్టుకున్నాడు. ఆమెను ఎలాగైనా సరే కలవాలని అనుకున్నాడు. ఎక్కడో లండన్‌లో ఉంటున్న ఆమెను నడుచుకుంటూ వెళ్లి కలుస్తానని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. చివరికి అంగీకరించారు. ఫలితంగా గత రెండు నెలలుగా నడుస్తూనే ఉన్నాడు. చివరికి లండన్ చేరాడు.
Samayam Telugu Image Credit: Instagram


Read Also: అమెరికా ఏడారిలో 22 కిమీల శ్రీ చక్రం.. గీసింది మనుషులు కాదు, నేటికీ వీడని మిస్టరీ

ఇటలీలోని సిసిలీలో నివసిస్తున్న రోమియో కాక్స్ అనే పదేళ్ల బాలుడు.. యూకేలోని లండన్‌లో నివసిస్తున్న అమ్మమ్మను కలిసేందుకు జూన్ 20న తండ్రితో కలిసి నడక ప్రారంభించాడు. ఈ సందర్భంగా ఇద్దరూ కాలినడకన ఇటలీ, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల మీదుగా యూకే చేరుకున్నారు. సుమారు రెండు నెలల తర్వాత సెప్టెంబరు 21న లండన్ చేరుకున్నారు. అధికారులు ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. అది పూర్తికాగానే రోమియో తన అమ్మమ్మను కలుసుకోవచ్చు.

Read Also: మిస్సింగ్ ట్రైన్ మిస్టరీ.. ప్రయాణికులతో సహా మాయమైన రైలు, ఆ గుహలోకి వెళ్లగానే..

వారు తమ జర్నీని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అది చాలా క్లిష్టమైన ప్రయాణమని, మార్గ మధ్యలో తాము ఎన్నో సమస్యలను.. సవాళ్లను ఎదుర్కొన్నామని తెలిపారు. కొన్నిసార్లు భయానకమైన ప్రాంతాల్లో నిద్రపోవల్సి వచ్చిందన్నారు. మొత్తం 2,800 కిలోమీటర్లు నడస్తూ.. లండన్‌కు చేరామన్నారు. తాను అమ్మమ్మను ప్రేమతో హగ్ చేసుకోడానికే ఇంత దూరం నడుచుకుని వచ్చానని, ఆమెను హత్తుకుంటే ఆ బాధలన్నీ మాయమవుతాయని అన్నాడు. ప్రస్తుతం రోమియో ఐసోలేషన్ పూర్తి చేసుకుని తన అమ్మమ్మను ఎప్పుడు కలుస్తానా అని ఎదురుచూస్తున్నాడు. ఈ నడక ద్వారా రోమియో మరో మంచి పనికి కూడా శ్రీకారం చుట్టాడు. ఫండ్ రైజ్ ద్వారా రూ.11.4 లక్షలు సంపాదించాడు. ఆ మొత్తాన్ని శరణార్థుల పిల్లల చదువుల కోసం దానం చేయనున్నానని ప్రకటించాడు.
View this post on Instagram 🌈🙂 Romeo a piedi a Londra e la sua nonna 👨‍👦🌈Romeo walking to London and his Granny.#romeosbigjourney #viafrancigena #fatherandson A post shared by Romeo Cox (@romeos_big_journey_home) on Sep 9, 2020 at 8:42am PDT

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.