యాప్నగరం

యాక్..! చచ్చిన ఎలుకలతో వైన్, గబ్బిలాల సూప్.. అక్కడ ఇదే ఆహారం!

గుండె ధైర్యం చేసుకోండి. మీరు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత భయానక ఆహారాన్ని చూడబోతున్నారు. ఔను.. ఈ ఆహారాన్ని చూస్తేనే కడుపులో తిప్పేస్తుంది. ఇక తింటే??

Samayam Telugu 18 Oct 2019, 2:01 pm
దో ఫుడ్ మ్యూజియం.. అందులో అడుగుపెడితే చాలు వాంతులు రావడం గ్యారంటీ. ఎందుకంటే.. అక్కడ సాధారణ మనుషులు తినే ఆహారం భూతద్దంతో వెతికినా కనిపించదు. కనీసం ఫ్రెష్ ఫుడ్ కావాలన్నా దొరకదు. మరి, అలాంటి ఆహారాన్ని అక్కడ ఎందుకు ఉంచారనే కదా మీ డౌట్? అయితే, స్వీడన్‌లోని ‘డిస్గస్టింగ్ ఫుడ్ మ్యూజియం’ను తప్పకుండా సందర్శించాల్సిందే.
Samayam Telugu GettyImages-538205927


మల్ 400 చదరపు మీటర్లు విస్తరించిన ఈ మ్యూజియంలో పెట్టిన ఈ భయానక ఆహారాన్ని సందర్శకులు ముట్టుకోవచ్చు, వాసన చూడొచ్చు, రుచి కూడా చూడొచ్చు. ప్రపంచంలో ప్రజల ఆహారపు అలవాట్లను మార్చడం కోసమే ఈ మ్యూజియంను ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.

టూత్ పేస్ట్‌ను తలపించే రూట్ బీర్, కుందేలు తల మాంసం, పాచిపోయిన సోయాబీన్లు, చనిపోయిన ఎలుక పిండాలతో తయారు చేసిన వైన్, ఏళ్ల తరబడి నిలువ ఉంచిన బాతు గుడ్లు, గొర్రె కన్ను జ్యూస్, గబ్బిలం సూప్, పురుగులు పట్టిన చీజ్, ఉడకబెట్టి వేయించిన ముంగీస ఇంకా ఇలాంటివి 80 పైగా భయానక ఆహార పానీయలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో అడుగు పెట్టిన సందర్శకులు వాంతులు చేసుకోకుండా బయటకు వెళ్లరట. అందుకని.. రోజూ ఎంతమంది సందర్శకులు వాంతులు చేసుకున్నారనే వివరాలను కూడా వారు నోటీసు బోర్డులో పెడతారు. ఈ మ్యూజియం రోజూ తెరిచి ఉండదు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దీన్ని తెరుస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.