యాప్నగరం

పామును పక్కలో పెట్టుకుని నిద్ర.. అసలు విషయం తెలిసి హాస్పిటల్‌కు పరుగు

జంతువులను పెంచుకోవాలనే ఆశ కలిగితే.. కుక్క లేదా పిల్లిని పెంచుకోవాలి. అంతేగానీ.. అతడు ఏకంగా నాగుపామునే పెంచుకోడానికి ప్రయత్నించాడు. లక్కీగా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

Samayam Telugu 7 Jun 2021, 9:29 pm
పామును పాలు పోసి పెంచడం ఎంత ప్రమాదకరమో మీకు తెలిసిందే. దాన్ని మనం ఎంత మచ్చిక చేసుకున్నా.. ఏదో ఒక రోజు తన స్వభావాన్ని మాత్రం మానుకోదు. మరి ఈ విషయం అతడి తెలుసో తెలియదో గానీ.. ఓ వ్యక్తి పామును పెట్‌లా పెంచుకోవాలని అనుకున్నాడు. మొత్తాన్ని అతడికి కావలసిన పామును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. దాన్ని పక్కలో పెట్టుకుని నిద్రపోయాడు. సీన్ కట్ చేస్తే.. అతడు హాస్పిటల్‌లో ఉన్నాడు.
Samayam Telugu Representational Image/Pixabay


ఏం జరిగిందంటే..: ఈశాన్య చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావీన్స్‌లో నివసిస్తున్న లియు అనే వ్యక్తి ఇటీవల ఒక మీటరు పొడవుండే విషం తీసేసిన నాగుపామును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. దానికి రోజూ పాలు పోస్తూ.. ముద్దు చేశాడు. అంతటితో ఆగకుండా దాన్ని ఓ రోజు రాత్రి పక్కలో పెట్టుకుని నిద్రపోయాడు. మత్తులో దాని మీద కాలు వేశాడో ఏమో.. దానికి కోపం వచ్చి తొడ మీద కాటు వేసింది. ఎలాగో కోరలు తీసేసిన పామే కదా అనుకున్నాడు. ఎందుకైనా మంచిదని ఆన్‌లైన్‌లో ఆ పామును విక్రయించిన వ్యక్తికి ఫోన్ చేశాడు.

అయితే, అతడు చావు కబురు చల్లగా చెప్పాడు. పొరపాటున నీకు ఇంకా కోరలు తీయని నాగుపామును ఇచ్చానని తెలిపాడు. అంతే.. లియు గుండె జారినంత పనైంది. వెంటనే హస్పిటల్‌కు పరుగులు పెట్టాడు. సమయానికి వైద్యం పొందటంతో ప్రాణాలైతే దక్కాయి. అయితే, అత్యంత విషపూరితమైన నాగుపాము కావడంతో కొంచెం ఆలస్యమైనా అతడి కాలును తొలగించాల్సి వచ్చేదని, లేదా అతడి ప్రాణాలు గాల్లో కలిసేవని లియుకు వైద్యం అందించిన డాక్టర్ తెలిపారు. ఈ ఘటనతో లియు కళ్లు తెరుచుకున్నాయి. ఇకపై పాములు పెంపుడు జంతువుగా పెంచుకోనని తెలిపాడు.

గతవారం తమిళనాడులోని మదురైకు చెందిన వడివేలు అనే 50 ఏళ్ల వ్యవసాయ కూలి.. చనిపోయిన కట్లపామును నమిలి తినేశాడు. ఈ వీడియో వైరల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అటవీ అధికారులు అతడికి రూ.7 వేలు జరిమానా విధించారు. పాములను తినడం వల్ల కరోనా వైరస్ సోకదని వడివేలు తెలిపాడు. లక్కీగా అతడు ఆ పాము విష గ్రంధిని తినకపోవడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడని అటవీ అధికారి ఆనంద్ పేర్కొన్నారు.

Read Also: హైసెక్యూరిటీ జైలుకు చెంచాలతో కన్నం వేసి ఖైదీలు పరార్, ఇదో థ్రిల్లింగ్ మిస్టరీ!

Read Also: ‘అన్నాబెల్లె’.. భయపెట్టే ఈ బొమ్మ రియల్ స్టోరీ తెలిస్తే గుండె ఆగుతుంది!

Also Read: దేవుడి ముంగిట ‘దెయ్యాలు’.. ఈ గుడికి వెళ్లాలంటే గుండె ధైర్యం ఉండాలి!

Also Read: ఆ గుడిలో అమ్మవారి విగ్రహాలు మాట్లాడతాయి, పరిశోధనల్లో తేలింది ఏమిటంటే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.