యాప్నగరం

లైవ్‌లో మాట్లాడుతూ.. పర్వతం పైనుంచి పడ్డ వ్యక్తి, కెమేరాలో రికార్డైన ఘటన!

అతడి ఆఖరి మాటలే నిజమయ్యాయి. యూట్యూబ్ లైవ్‌లో మాట్లాడుతూ పర్వతం శిఖరం మీదకు ఎక్కిన ఆ వ్యక్తి.. కాలు జారి లోయలో పడిపోయాడు. ఆ దృశ్యం కెమేరాలో రికార్డైంది.

Samayam Telugu 31 Oct 2019, 7:58 pm
పాన్‌లోని ఎత్తైన పర్వత శిఖరం ‘మౌంట్ ఫుజీ’ని అధిరోహించేందుకు వెళ్లిన ఓ గుర్తుతెలియని వ్యక్తి.. యూట్యూబ్‌లో లైవ్ ఇస్తూ చనిపోయాడు. ఏటవాలుగా ఉన్న పర్వతంపై కాలు జారడంతో క్షణాల వ్యవధిలో అతడిని మృత్యువు కబళించింది. ఇదంతా అతడు తన తలకు ధరించిన కెమేరాలో రికార్డైంది.
Samayam Telugu GettyImages-463003247

Mount Fuji

ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లోని పలు చానెళ్లలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. మరణానికి కొన్ని నిమిషాల ముందు అతడు పర్వత శిఖరం మీదకు ఎక్కుతూ.. అక్కడి ప్రతికూల పరిస్థితుల గురించి చెప్పడం ఈ వీడియోలో కనిపించింది. ‘‘ఈ పర్వతం మీద కాలు జారుతోంది. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది (నవ్వుతూ). అవిగో అక్కడ రాళ్లు ఉన్నాయి. వాటి ఆధారంగా ముందుకు వెళ్దాం. ఇది చాలా ప్రమాదకరంగా ఉంది. కిందికి జారిపోతానేమో అనిపిస్తోంది’’ అని అన్నాడు. ‘నేను సరైన దారిలోనే ఉన్నానా? నేను జారిపోతున్నా’’ అంటూ కిందపడిపోయాడు. అతడితోపాటే ఆ కెమేరా కూడ గిరగిరా తిరుగుతూ ఆగిపోయింది.

వీడియో: యూట్యూబ్ లైవ్‌లో ఈ ప్రమాదాన్ని చూసిన వ్యూవర్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితుడి కోసం అన్వేషించారు. చివరికి పర్వతం లోయలో అతడి మృతదేహం కనిపించింది. అయితే, ఆ వ్యక్తి ఎవరినేది ఇంకా తెలియరాలేదు. ఏటా వందలాది మంది ఫుజీ పర్వతాన్ని అధిరోహిస్తారు. జపాన్‌లోని దీన్ని పవిత్ర పర్వతంగా భావిస్తారు. ఏటా జులై, ఆగస్టు నెలల్లో మాత్రమే ఈ పర్వతం మీదకు అనుమతి ఇస్తారు. మిగతా రోజుల్లో పర్వతం పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, టాయిలెట్లను మూసివేస్తారు.

Also Read: 15 ఏళ్ల బాలుడిని 20 సార్లు రేప్ చేసి.. కవల పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.