యాప్నగరం

చికెన్ బిర్యానీ రూ.15 మాత్రమే.. ఆ రెస్టారెంట్ ముందు భారీ క్యూ!

ఈ రెస్టారెంట్‌లో రూ.10కే ఎగ్ బిర్యానీ, రూ.15కే చికెన్ బిర్యానీ లభిస్తోంది. రుచి, సుచితోపాటు డబ్బులు కూడా సేవ్ అవుతాయ్. అంతేకాదు.. ఉల్లిపాయల ముక్కలూ ఉచితమే!

Samayam Telugu 27 Dec 2019, 4:02 pm
క చికెన్ బిర్యానీ తినాలంటే కనీసం రూ.100 వరకు ఖర్చవుతుంది. మరి, అంత ఖరీదైన బిర్యానీ రూ.15కే లభిస్తే? వామ్మో, ఇంకేమైనా ఉందా? జనం ఎగబడిపోరూ. కానీ, రూ.15కే చికెన్ బిర్యానీ అందించే రెస్టారెంట్ ఎక్కడుందా అనే కదా మీ సందేహం? అయితే, తప్పకుండా మీరు ఈ రెస్టారెంట్ గురించి తెలుసుకోవాల్సిందే.
Samayam Telugu Photo Credit:  KURAL 360*/YouTube and Pixabay
Photo Credit: KURAL 360*/YouTube and Pixabay


సాధారణంగా ఏదైనా వ్యాపారం లేదా షాప్ ఓపెనింగ్ చేసేప్పుడు పబ్లిసిటీ కోసం లక్షలు వెచ్చించి సెలబ్రిటీలను తీసుకువస్తుంటారు. అయితే, ఈ రెస్టారెంట్ యజమాని మాత్రం అలా ఆలోచించలేదు. ఆ డబ్బును కస్టమర్ల కోసం కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో విలువైన బిర్యానీని అతి తక్కువ ధరకే విక్రయించాడు. ఎగ్ బిర్యానీ రూ.10, చికెన్ బిర్యానీ రూ.15, రూ.5కే పరోటా అంటూ ప్రచారం చేశాడు.

Also Read: ఫ్రీగా పెళ్లి భోజనం ఆరగించడానికి వెళ్లి.. వరుడిని చంపేసిన అపరిచితులు

అంతే.. ఈ వార్త చుట్టుపక్కల ప్రాంతానికి దావనంలా వ్యాపించింది. దీంతో ఆ రెస్టారెంట్ కస్టమర్లతో కిక్కిరిసిపోయింది. చివరికి బిర్యానీ టోకెన్లు అందుకోడానికి జనాలు క్యూ కట్టాల్సి వచ్చింది. రూ.10, రూ.15కే బిర్యానీ కదా.. తక్కువగా పెడతాడేమో అనుకోవద్దు. ఒక మనిషి తినగలిగేంత బిర్యానీ పెడుతున్నారు. ఈ బిర్యానీ తిన్నవారు రుచి కూడా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. అయితే, మనం కూడా కుమ్మేద్దాం అనుకుంటున్నారా? అయితే, కాసేపు ఆగండి. ఈ హోటల్ ఉన్న మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. పొరుగు రాష్ట్రం తమిళనాడులోని కొయంబత్తూర్‌లో. ‘కోవై ఫుడ్ ప్యాక్టరీ’ అనే రెస్టారెంట్ ప్రారంభం సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించారు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని రెస్టారెంట్ యాజమాన్యం వెల్లడించింది.

వీడియో:
Also Read: వింత ఆచారం.. అక్కడ వధువుకు శవంతో పెళ్లి చేస్తారు, పిల్లలను ఎలా కంటారో తెలుసా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.