యాప్నగరం

ముంబయి: లిఫ్ట్ బటన్స్ నొక్కేందుకు టూత్ పిక్‌లు.. ఏం తెలివి గురూ!

కరోనా వల్ల ఏం ముట్టుకోవాలన్నా భయం వేస్తోంది కదా. ముంబయిలోని ఓ అపార్టుమెంటులో లిఫ్టు బటన్లు నొక్కడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో చూడండి.

Samayam Telugu 20 Mar 2020, 6:56 pm
మహారాష్ట్రను కూడా కరోనా వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు అక్కడ 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి నుంచి లాక్‌డౌన్ అమలు కానుందని ప్రకటించింది. మార్చి 31 వరకు ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని సూచించింది. ఈ లాక్ డౌన్ ముంబయితోపాటు ఎంఎంఆర్ రీజియన్, పుణె, పింప్రీ చించ్వాడ్, నాగపూర్‌లకు కూడా వర్తించనుంది. దీంతో ఆయా నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మినహా మిగతా కార్యాలయాలన్నీ మూసివేయనున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే పనిచేయనున్నారు. అయితే, నిత్యవసర వస్తువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని సీఎం ఉద్దవ్ థాక్రే వెల్లడించారు.
Samayam Telugu coronavirus housing society in mumbai is using toothpicks to avoid using push buttons in elevator
ముంబయి: లిఫ్ట్ బటన్స్ నొక్కేందుకు టూత్ పిక్‌లు.. ఏం తెలివి గురూ!


కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇప్పుడు దేన్ని ముట్టుకోవాలన్నా భయపడిపోతున్నారు. చివరికి తలుపుల గొళ్లాల నుంచి లిఫ్ట్ బటన్ వరకు ఏది పట్టుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. దీంతో ముంబయిలోని ఓ అపార్టుమెంటు ప్రజలకు సరికొత్త ఆలోచన వచ్చింది. కరోనా బాధితులు లిఫ్ట్ బటన్లను నొక్కే అవకాశాలు కూడా ఉన్నాయనే భయంతో టూత్ పిక్స్‌ను ఏర్పాటు చేశారు.

వైరస్ సోకకుండా.. ముందు జాగ్రత్త

ముంబయిలోని నపీయన్ సీ రోడ్‌లో గల కోపరేటివ్ సొసైటీ హౌసింగ్ సొసైటీ ‘టైటాన్’లోని ఓ అపార్టుమెంటులో ఈ దృశ్యం కనిపించింది. ప్రజలకు అర్థమయ్యేలా ఆ లిఫ్ట్‌లో ఒక నోట్ కూడా పెట్టారు. అందులో టూత్ పిక్‌తో లిఫ్ట్ బటన్ ఎలా నొక్కాలో సూచించారు. ముందుగా థర్మాకోల్‌కు గుచ్చి ఉన్న టూత్ పిక్‌ను తీసుకోవాలని, దానితో లిఫ్ట్ బటన్ నొక్కాలని అందులో పేర్కొన్నారు. దాన్ని వాడేసిన తర్వాత.. దాని పక్కనే ఉన్న సీసాలో పాడేయాలని సూచించారు. దీంతో అపార్టుమెంటు ప్రజలు ఆ రూల్‌ను పక్కగా ఫాలో అవుతున్నారు.

ఏం ముట్టుకున్నా డేంజరే..

షేక్ హ్యాండ్లు ద్వారా గానీ, కరోనా బాధితులు ముట్టుకున్న వస్తువుల ద్వారా గానీ వైరస్ ఇతరులకు సోకే ప్రమాదం ఉన్న సంగతి తెలిసిందే. అది ఎక్కువ మందికి వ్యాపించకుండా ఉండాలంటే ప్రజలు గుంపులు తిరగొద్దని అధికారులు తెలుపుతున్నారు. కనీసం ఒకటి నుంచి రెండు మీటర్ల దూరంలో ఉండాలని, ఏవైనా వస్తువులను ముట్టుకుంటే శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ప్రజలు ఏమైనా ముట్టుకోవాలంటేనే భయపడుతున్నారు.

Also Read: భళా కేరళ.. బస్సు ఎక్కినా, దిగినా శానిటైజర్లతో చేతులు కడగాల్సిందే!

Photos Credit: Times Now

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.