మహారాష్ట్రను కూడా కరోనా వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు అక్కడ 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ను నియంత్రించేందుకు ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి నుంచి లాక్డౌన్ అమలు కానుందని ప్రకటించింది. మార్చి 31 వరకు ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరగొద్దని సూచించింది. ఈ లాక్ డౌన్ ముంబయితోపాటు ఎంఎంఆర్ రీజియన్, పుణె, పింప్రీ చించ్వాడ్, నాగపూర్లకు కూడా వర్తించనుంది. దీంతో ఆయా నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు మినహా మిగతా కార్యాలయాలన్నీ మూసివేయనున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో కేవలం 25 శాతం మంది మాత్రమే పనిచేయనున్నారు. అయితే, నిత్యవసర వస్తువులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని సీఎం ఉద్దవ్ థాక్రే వెల్లడించారు.
కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇప్పుడు దేన్ని ముట్టుకోవాలన్నా భయపడిపోతున్నారు. చివరికి తలుపుల గొళ్లాల నుంచి లిఫ్ట్ బటన్ వరకు ఏది పట్టుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. దీంతో ముంబయిలోని ఓ అపార్టుమెంటు ప్రజలకు సరికొత్త ఆలోచన వచ్చింది. కరోనా బాధితులు లిఫ్ట్ బటన్లను నొక్కే అవకాశాలు కూడా ఉన్నాయనే భయంతో టూత్ పిక్స్ను ఏర్పాటు చేశారు.
కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇప్పుడు దేన్ని ముట్టుకోవాలన్నా భయపడిపోతున్నారు. చివరికి తలుపుల గొళ్లాల నుంచి లిఫ్ట్ బటన్ వరకు ఏది పట్టుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. దీంతో ముంబయిలోని ఓ అపార్టుమెంటు ప్రజలకు సరికొత్త ఆలోచన వచ్చింది. కరోనా బాధితులు లిఫ్ట్ బటన్లను నొక్కే అవకాశాలు కూడా ఉన్నాయనే భయంతో టూత్ పిక్స్ను ఏర్పాటు చేశారు.
వైరస్ సోకకుండా.. ముందు జాగ్రత్త
ఏం ముట్టుకున్నా డేంజరే..
Also Read: భళా కేరళ.. బస్సు ఎక్కినా, దిగినా శానిటైజర్లతో చేతులు కడగాల్సిందే!
Photos Credit: Times Now