యాప్నగరం

షాకింగ్.. జనాలపై ఉమ్ములేస్తున్న కరోనా రోగులు, చైనాలో అలజడి!

కరోనా వైరస్‌తో బాధపడుతున్న రోగులు జనాల్లో కలిసిపోతున్నారు. పక్కవాళ్లపై ఉమ్ములేస్తూ అలజడి సృష్టిస్తున్నారు. చివరికి డాక్టర్లపై కూడా ఉమ్ములేస్తున్నారు. ఆ వీడియోలను ఈ కథనంలో చూడండి.

Samayam Telugu 29 Jan 2020, 7:21 pm
రోనా వైరస్.. ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ అత్యంత వేగంగా ప్రభలుతోంది. గబ్బిలాలు, ఎలుకలు తదితర జంతువుల వల్ల ఈ వ్యాధి ప్రభలే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు వాటికి దూరంగా ఉంటున్నారు. అయితే, ఆ వ్యాధి సోకిన బాధితులకూ ఇతరులకూ అంటిస్తున్నారు. ఫలితంగా ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
Samayam Telugu Photo Credit: Pixabay and Twitter
Photo Credit: Pixabay and Twitter


ఈ వైరస్ వల్ల చైనాలో ఇప్పటికే 100 మందికి పైగా చనిపోయినట్లు తెలిసింది. అయితే, ఈ వ్యాధిబారిన పడిన కొంతమంది బాధితులు ప్రజల్లో కలిసిపోతున్నారు. వారిపై ఉమ్ములు వేస్తూ వ్యాధిని వ్యాప్తి చేస్తు్న్నారు. చైనాలోని ఓ హాస్పిటల్‌లో కరోనా వ్యాధి చికిత్సకు వచ్చిన ఓ బాధితుడు.. రిసెప్షన్‌లో బిల్లు చెల్లిస్తూ అక్కడ ఉన్న సిబ్బందిపై ఉమ్ములు వేశాడు. ఈ ఘటన హాస్పిటల్‌లోని సీసీటీవీ కెమేరాలో రికార్డైంది.

వీడియో:
ఉహాన్‌లో టీచర్‌గా పనిచేస్తున్న జెస్సికా బాయిలింగ్ అనే 23 ఏళ్ల యువతి ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘మా ప్రాంతంలో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇంట్లో సరుకులన్నీ అడుగంటాయి. తల నుంచి కాళ్ల వరకు కప్పుకుంటేగానీ ఎక్కడికీ వెళ్లడం లేదు. కళ్లద్దాలు, మాస్కులు ధరించే బయటకు వెళ్తున్నాం. పైగా, కరోనా బాధితులు మనుషులపై ఉమ్ములు వేస్తూ వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారని తెలిసింది. ఓ వ్యక్తి మాస్కు తెరిచి ఏకంగా డాక్టర్ ముఖం మీదే ఉమ్మినట్లు ప్రచారం జరుగుతోంది’’ అని తెలిపింది.

Also Read: కరోనా వైరస్.. ఎలుకలు, గబ్బిలాలను తింటున్న చైనా ప్రజలు

‘‘ఆ వైరస్ ఏదైనా వస్తువులను తాకితే కాసేపు వాటిని అంటుకుని ఉంటుందని తెలిసింది. దీంతో బయట నుంచి ఏమైనా కొనుగోలు చేసి తెస్తే వెంటనే నీటిలో కడిగేస్తున్నాం’’ అని జెస్సికా పేర్కొంది. ఇదిలా ఉండగా చైనాలోని ఓ హాస్పిటల్‌లో కరోనా వైరస్‌తో చనిపోయిన బాధితుల మృతదేహాలను ఆరుబయటే వదిలేసినట్లు ట్విట్టర్‌లో ఓ వీడియో ట్రెండవ్వుతోంది. ఇవన్నీ చూస్తుంటే.. వైరస్ చైనాను ఎంతగా ఆందోళనకు గురి చేస్తుందో అర్థమవుతోంది. ప్రస్తుతం ఇది ఇండియాలో నిర్ధరణ కాలేదు. కాబట్టి.. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను అస్సలు నమ్మకండి.

హాస్పిటల్‌లో రోగుల మధ్యే.. కరోనా బాధితుల మృతదేహాలు:

Also Read: కరోనా వైరస్: చైనాలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు.. తల్లిదండ్రుల్లో ఆందోళన

Also Read: వీడియో: కరోనా వైరస్ కలకలం.. తెలుసుకోవాల్సిన విషయాలివే

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.