యాప్నగరం

మల ద్వారంలో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్.. చెన్నైలో చిక్కిన జంట!

అక్కడ పెట్టుకుంటే భద్రతా సిబ్బంది కనిపెట్టలేరని భావించారు. కానీ, ఇండియాలో వారి ఆటలు సాగలేదు. చివరికిలా దొరికిపోయారు.

Samayam Telugu 12 Oct 2019, 4:47 pm
జంట ఎక్కడా చోటులేనట్లు మల ద్వారంలో బంగారాన్ని పెట్టుకుని అక్రమంగా తరలించాలని ప్రయత్నించారు. అయితే, భద్రతా అధికారుల ముందు వారి ఆటలు సాగలేదు. అక్కడ దాచిన బంగారాన్ని బయటకు తీయించి మరీ వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.
Samayam Telugu GettyImages-1069881880


Read also: ఏం ‘బుర్ర’ గురూ.. తలలో బంగారం దాచి స్మగ్లింగ్, చివరికి దొరికాడిలా!

శ్రీలంకకు చెందిన శివకుమార్ పలనియాందీ (42), శాగీ మేరీ (35) అనే దంపతులు చెన్నై విమానాశ్రయ అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని అక్రమంగా తరలించాలని ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా రూ.37 లక్షలు విలువ చేసే బంగారాన్ని పొడిని సంచిలో చుట్టి మల ద్వారంలో పెట్టుకున్నారు.

Read also: బెంగాలీ ఫస్ట్‌నైట్.. ‘కాళరాత్రి’ పేరుతో తొలిరాత్రి, కొత్త జంటను వేరుచేసే వింత ఆచారం

శివకుమార్‌ నుంచి 19.5 లక్షల విలువ చేసే 525 గ్రాములు, మేరీ నుంచి 4.7 లక్షలు విలువ చేసే 22 కేరట్ల జ్యువెలరీని స్వాధీనం చేసుకున్నారు. ఆమె మల ద్వారం నుంచి 12.6 లక్షలు విలువ చేసే మరో 320 గ్రాముల బంగారాన్ని వెలికి తీశారు. ఇద్దరి నుంచి మొత్తం రూ.37 లక్షలు విలువ చేసే 97 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన ఓ యువకుడు విగ్గులో బంగారం పెట్టుకుని ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు దొరికిపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.