Covid 19: Husband Locks Wife In Bathroom Fearing She Has The Coronavirus
కరోనా భయం.. భార్యను బాత్రూమ్లో బంధించిన భర్త.. చివరికి ఏమైందంటే..
కరోనా వైరస్ భయం ప్రజలను ఎంతగా భయపెడుతుందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించుకుండా ఓ భర్త.. తన భార్యతో ఎలా ప్రవర్తించాడో చూడండి.
Samayam Telugu7 Mar 2020, 6:28 pm
కరోనా వైరస్ ప్రజలను ఎంతగా భయపెడుతుందో తెలిసిందే. అయితే, కరోనా కంటే.. కరోనా గురించి వస్తున్న వార్తలే మరింత భయానికి గురిచేస్తున్నట్లు పబ్లిక్ టాక్. అలాగని సైలెంట్గా ఊరుకుంటే.. మీరు తప్పకుండా కొన్ని చిత్రవిచిత్రమైన ఘటనలను మిస్సవుతారు. కరోనా వైరస్ వల్ల జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ప్రజలు తప్పకుండా శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవాలి. అలాగే మాస్కులు ధరిస్తూ.. ఇతరుల నుంచి మనకు వైరస్ రాకుండా జాగ్రత్తపడాలి. మొదట్లో ప్రజలు దీన్ని సాధారణంగానే తీసుకున్నా.. చాపకింద నీరులా పెరుగుతున్న కేసులను చూసి ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు సూచించిన ఆరోగ్య సూత్రాలను పాటిస్తున్నారు. అయితే, ఓ వ్యక్తి తన భార్యకు కరోనా వైరస్ వచ్చిందేమో అనే భయంతో వణికిపోయాడు. ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించడానికి బదులు.. బాత్రూమ్లో బంధించాడు. ఆమె ఎంత ప్రాదేయపడినా తలుపులు తీయలేదు. ఇక అతడిని అడిగి లాభం లేదని భావించిన ఆమె చివరికి ఏం చేసిందంటే..
చైనా మహిళను కలిసిందని..
లిథువేనియాలో విల్నీయస్ నగరానికి చెందిన ఓ వ్యక్తి భార్య ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన చైనా మహిళను కలిసింది. ఇంటికి తిరిగి వచ్చిన ఆమె.. భర్తతో ఏవేవో కబుర్లు చెబుతూ.. ఈ విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె భర్త.. ‘‘చైనా మహిళను ఎందుకు కలిశావ్? ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చావా? నీకు ఎంత దూరంలో ఆమె కుర్చుంది? మాట్లాడుకొనేప్పుడు మాస్క్ పెట్టుకున్నావా?’’ అంటూ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలో ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆమె సమాధానం చెప్పేలోపే.. బలవంతంగా బాత్రూమ్లోకి తోసేసి బయట నుంచి గడియ పెట్టాడు.‘‘తలుపులు తీయాలని, ఏమైనా ఉంటే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్ష చేయించుంటానని చెప్పినా సరే వినలేదు. నాకు భయం వేస్తోంది. నువ్వు అందులోనే ఉండు’’ అంటూ గడియ తీయడానికి నిరాకరించాడు.
చివరికి ఏమైందంటే..
భర్త ఆమెను బాత్రూమ్లో తోసినప్పుడు మొబైల్ ఫోన్ కూడా ఆమె చేతిలోనే ఉంది. అది లేకపోతే ఆమె పరిస్థితి దయనీయంగా ఉండేది. భర్తను ఎంత ప్రాదేయపడిన లాభం లేదని భావించిన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె నివసిస్తున్న అపార్టుమెంట్కు వచ్చారు. భర్తను అదుపులోకి తీసుకున్నారు. తన భార్య చైనా మహిళను కలిసిందని తెలియగానే తాను డాక్టర్లకు ఫోన్ చేశానని, ఆ వైరస్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో అడిగానని తెలిపాడు. వైరస్ సోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పడంతో ఆమెను బాత్రూమ్లో బంధించాల్సి వచ్చిందన్నాడు.
భర్తపై ఫిర్యాదు చేయడానికి ఆమె మనసు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు అతడిని వదిలిపెట్టేశారు. భర్త మెదడులో తొలుస్తున్న ఆ భయాన్ని పొగొట్టేందుకు ఆమె కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుంది. ఫలితాలు ‘నెగటివ్’ రావడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. అతడికి ఆ రిపోర్టులు చూపించి.. మళ్లీ బాత్రూమ్లో బంధించే పనులు చేయకు. అలా చేస్తే.. నిన్ను కటకటాల్లో బంధిస్తారంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. లిథువేనియాలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదైంది. బాధకరమైన విషయం ఏమిటంటే.. చైనా ప్రజలు కనిపిస్తుంటే చాలు జనాలు వారిపై దాడికి దిగుతున్నారు. చైనీయులకు ప్రవేశం లేదని బోర్డులు పెడుతున్నారు. అయితే, చైనీయుల్లా కనిపించే ఇతర దేశీయులపై కూడా దాడులకు దిగుతున్నారు. ఎవరో చేసిన తప్పుకు అమాయక ప్రజలు బలవుతున్నారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.