అదేంటీ.. శవాన్ని స్మశానానికి తీసుకెళ్లాలి గానీ, బ్యాంక్కు తీసుకురావడం ఏమిటనేగా మీ సందేహం. ఔను, మీ డౌటానుమానంలో ఎలాంటి తప్పు లేదు. అయితే, శవాన్ని అక్కడ అంత్యక్రియలు జరిపేందుకు తీసుకెళ్లలేదు. దాచిపెట్టిన డబ్బులను తీసుకొనేందుకు తీసుకెళ్లారు. ఇంకా అర్థం కాలేదా? అయితే, మీరు బీహార్లో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకోవల్సిందే.
పట్నాకు సమీపంలోని సిగరియావా గ్రామంలో మహేశ్ యాదవ్ అనే 55 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు. అతడికి సొంతవారు ఎవరూ లేరు. కూలి పనులు చేసుకుంటూ స్థానిక కెనరా బ్యాంకులో డబ్బులు దాచుకొనేవాడు. మహేష్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఈ సందర్భంగా తన సన్నిహితులకు బ్యాంకులో దాచిపెట్టిన డబ్బులు గురించి చెప్పాడు. ఆ సొమ్ములతో వైద్యం చేయించుకుంటానని చెప్పేవాడు. అయితే, అవి తీసుకొనేలోపే మహేష్ చనిపోయాడు.
మహేష్కు బంధువులు లేకపోవడంతో గ్రామస్తులే అంత్యక్రియలు జరిపేందుకు ముందుకొచ్చారు. మహేష్ దాచుకున్న డబ్బులతో ఘనంగా అంతిమ వీడ్కోలు తెలుపుదామని అనుకున్నారు. ఈ సందర్భంగా పాస్బుక్తో బ్యాంక్కు వెళ్లారు. మహేష్ చనిపోయాడని, అతడు దాచుకున్న డబ్బులతో అంత్యక్రియలు నిర్వహిస్తామని గ్రామస్తులు బ్యాంక్ సిబ్బందిని అడిగారు.
ఇందుకు బ్యాంక్ సిబ్బంది అంగీకరించలేదు. అలా డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంక్ మేనేజర్ వారికి రూల్స్ గురించి చెప్పేందుకు ప్రయత్నించాడు. మహేష్కు నామినీ ఎవరూ లేరని, అతడు మాత్రమే స్వయంగా డబ్బులు తీసుకోడానికి అర్హుడని తెలిపాడు. దీంతో చనిపోయిన వ్యక్తి ఎలా వస్తాడని గ్రామస్తులు ప్రశ్నించారు. రూల్స్ ప్రకారం తాము అతడి డబ్బును ఇతరులకు ఇవ్వలేమని మేనేజర్ తెలిపాడు. కొద్ది నిమిషాల తర్వాత గ్రామస్తులు మహేష్ శవాన్ని స్మశానానికి కాకుండా.. నేరుగా బ్యాంక్కు తీసుకొచ్చారు.
‘‘మహేష్ వచ్చాడు. ఇప్పుడైనా అతడి డబ్బులు ఇస్తారా?’’ అని గ్రామస్తులు అడిగారు. దీంతో మేనేజర్కు మైండ్ బ్లాక్ అయ్యింది. వెంటనే తన జేబు నుంచి రూ.10 వేలు తీసి గ్రామస్తులకు ఇచ్చాడు. అంతేగాక గ్రామస్తులతో కలిసి అంత్యక్రియల్లో సైతం పాల్గొన్నట్లు తెలిసింది. మహేష్ పేరు మీద బ్యాంకులో రూ.లక్ష వరకు నగదు ఉన్నట్లు సమాచారం. అతడికి నామినీ ఎవరూ లేకపోవడం వల్ల ఆ నగదు ఏం చేస్తారనే విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు.
పట్నాకు సమీపంలోని సిగరియావా గ్రామంలో మహేశ్ యాదవ్ అనే 55 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు. అతడికి సొంతవారు ఎవరూ లేరు. కూలి పనులు చేసుకుంటూ స్థానిక కెనరా బ్యాంకులో డబ్బులు దాచుకొనేవాడు. మహేష్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. ఈ సందర్భంగా తన సన్నిహితులకు బ్యాంకులో దాచిపెట్టిన డబ్బులు గురించి చెప్పాడు. ఆ సొమ్ములతో వైద్యం చేయించుకుంటానని చెప్పేవాడు. అయితే, అవి తీసుకొనేలోపే మహేష్ చనిపోయాడు.
మహేష్కు బంధువులు లేకపోవడంతో గ్రామస్తులే అంత్యక్రియలు జరిపేందుకు ముందుకొచ్చారు. మహేష్ దాచుకున్న డబ్బులతో ఘనంగా అంతిమ వీడ్కోలు తెలుపుదామని అనుకున్నారు. ఈ సందర్భంగా పాస్బుక్తో బ్యాంక్కు వెళ్లారు. మహేష్ చనిపోయాడని, అతడు దాచుకున్న డబ్బులతో అంత్యక్రియలు నిర్వహిస్తామని గ్రామస్తులు బ్యాంక్ సిబ్బందిని అడిగారు.
ఇందుకు బ్యాంక్ సిబ్బంది అంగీకరించలేదు. అలా డబ్బులు ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంక్ మేనేజర్ వారికి రూల్స్ గురించి చెప్పేందుకు ప్రయత్నించాడు. మహేష్కు నామినీ ఎవరూ లేరని, అతడు మాత్రమే స్వయంగా డబ్బులు తీసుకోడానికి అర్హుడని తెలిపాడు. దీంతో చనిపోయిన వ్యక్తి ఎలా వస్తాడని గ్రామస్తులు ప్రశ్నించారు. రూల్స్ ప్రకారం తాము అతడి డబ్బును ఇతరులకు ఇవ్వలేమని మేనేజర్ తెలిపాడు. కొద్ది నిమిషాల తర్వాత గ్రామస్తులు మహేష్ శవాన్ని స్మశానానికి కాకుండా.. నేరుగా బ్యాంక్కు తీసుకొచ్చారు.
‘‘మహేష్ వచ్చాడు. ఇప్పుడైనా అతడి డబ్బులు ఇస్తారా?’’ అని గ్రామస్తులు అడిగారు. దీంతో మేనేజర్కు మైండ్ బ్లాక్ అయ్యింది. వెంటనే తన జేబు నుంచి రూ.10 వేలు తీసి గ్రామస్తులకు ఇచ్చాడు. అంతేగాక గ్రామస్తులతో కలిసి అంత్యక్రియల్లో సైతం పాల్గొన్నట్లు తెలిసింది. మహేష్ పేరు మీద బ్యాంకులో రూ.లక్ష వరకు నగదు ఉన్నట్లు సమాచారం. అతడికి నామినీ ఎవరూ లేకపోవడం వల్ల ఆ నగదు ఏం చేస్తారనే విషయం మీద ఇంకా స్పష్టత రాలేదు.