యాప్నగరం

ఆ కూర వద్దన్నాడని షుగర్ మొగుణ్ని చావగొట్టిన పెళ్లాం

తనకు మధుమేహం ఉందని, డాక్టర్ ఆ కూర తినొద్దని చెప్పినా ఎందుకు వండావని ప్రశ్నించిన భర్తను బట్టలు ఉతికే కర్రతో చితకబాదిన భార్య.

Samayam Telugu 12 Aug 2020, 11:01 am
భార్య భర్తల మధ్య గొడవలు సహజమే. ఈ సందర్భంగా మాటా మాటా పెరిగి కొట్టుకొనే వరకు వెళ్తుంది. ఎక్కువ గొడవల్లో భర్తలే భార్యలను కొడుతుంటారు. కానీ, ఇక్కడ సీన్ రివర్స్. భార్యే.. భర్తను చితక బాదింది. అది కూడా తాను వండిన కూర తినను అన్నాడని. అహ్మదాబాద్‌లోని వాస్నాలో చోటుచేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Samayam Telugu Image Credit: Getty Images


హర్షద్ గోయాల్ (40) అనే వ్యక్తి తన భార్య తారా గోయల్‌తో కలిసి సొరాయ్ నగర్‌లో నివసిస్తున్నాడు. వీరికి నాలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే, వీరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇటీవల తారా చపాతీల్లోకి బంగాళ దుంప కూర వండింది. హర్షద్‌కు మధుమేహం (డయబెటీస్) ఉండటం వల్ల ఆ కూర తిననని అన్నాడు. ఆ కూర తింటే మధుమేహం పెరుగుతుందని డాక్టర్ చెప్పాడని, ఆ విషయం తెలిసి కూడా నువ్వు ఆ కూర ఎందుకు వండావని దబాయించాడు.

దీంతో తారాకు చిర్రెత్తుకొచ్చింది. భర్త మాటకు ఎదురు తిరిగింది. ‘‘కష్టపడి వంట చేస్తే తినకుండా.. నన్నే తిడతావా’’ అంటూ.. బాత్రూమ్‌లో బట్టలు ఉతకడానికి ఉపయోగించే కర్రను తీసుకొచ్చి హర్షద్‌ను చితకబాదింది. దీంతో లబోదిబో అని కేకలు పెట్టాడు. ఆ అరుపులకు కుటుంబ సభ్యులు వచ్చి అతడిని రక్షించారు. హర్షద్‌ను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు.

Read Also: శవంతో యువతికి పెళ్లి.. శోభనం ఎవరితోనో తెలిస్తే షాకవుతారు!

ఈ ఘటనపై హర్షద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య అకారణంగా కొట్టిందని, తనకు మధుమేహం ఉందని తెలిసినా బంగాళా దుంప కూర వండి తనకు హాని తలపెట్టేందుకు ప్రయత్నించిందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నాడు. ఆ కూర తినను అని చెప్పినందుకు తనని బూతులు తిడుతూ.. బట్టలు ఉతికే కర్రతో కొట్టిందని తెలిపాడు. భార్య దెబ్బలకు హర్షద్ కుడి భుజం ఎముక విరిగినట్లు వైద్యులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.