యాప్నగరం

కడుపునొప్పితో ఆస్పత్రికి పేషెంట్.. ఎక్స్‌రే తీసి షాకైన డాక్టర్లు

ఇలాంటి కేసొకటి తమకు వస్తుందని ఆ డాక్టర్లు అస్సలు ఊహించలేదు. వాళ్లు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఇదెలా జరిగిందో తెలియక షాకవుతున్నారు.

Samayam Telugu 21 Oct 2021, 11:25 am
డాక్టర్ల దగ్గరకు వచ్చే పేషెంట్లు రకరకాలుగా ఉంటారు. అనారోగ్యాలతో వచ్చేవారు కొందరైతే... విపరీతమైన పనులు చేసి వచ్చేవారు మరికొందరు. ఈ కేసులో వ్యక్తి రెండో రకం. ఈజిఫ్టులో డాక్టర్లను కలిసిన అతను... తనకు విపరీతంగా కడుపు నొప్పి వస్తోందనీ, ఏమీ తినలేకపోతున్నాననీ, తినబుద్ధి కావట్లేదనీ చెప్పాడు. బాగా చిక్కిపోయినట్లు ఉన్న అతన్ని చూడగానే డాక్టర్లకు విషయం అర్థమైంది. అతను సరిగా ఆహారం తినట్లేదని గ్రహించారు. మరి కడుపునొప్పికి కారణం తెలియాలి కదా. అందుకోసం ఎక్స్‌రే తీశారు. రిపోర్ట్ వచ్చింది (X-ray report). అందులో చూస్తే... పొట్టలో ఏదో వస్తువు కనిపిస్తోంది. అది శరీర భాగం కాదు. కానీ దాని వల్లే ఈ సమస్య వచ్చిందని అర్థమైంది (shocking news).
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం (image credit - pixabay - HansMartinPaul)


దక్షిణ ఈజిఫ్టులోని అస్వాన్ యూనివర్శిటీ హాస్పిటల్ డాక్టర్లు... అతన్ని నిజం చెప్పమన్నారు. దాంతో... తాను ఆరు నెలల కిందట అనుకోకుండా మొబైల్ మింగేశాననీ... కానీ ఆస్పత్రికి వెళ్లడం ఇష్టం లేక అలాగే ఊరుకున్నానని చెప్పాడు. "ఎంత పని చేశావ్... అదే నీ ప్రాణం మీదకు తెచ్చింది" అంటూ హడావుడిగా ఆపరేషన్ చేశారు. మొబైల్‌ని బయటకు తీశారు. (mobile in stomach)

ఇప్పుడున్న టెక్నాలజీతో ఆ మొబైల్‌ని ఆపరేషన్ చెయ్యకుండా... నోటి ద్వారా బయటకు తీయవచ్చు. కానీ... 6 నెలలు గడిచిపోవడంతో... అది పొట్టలో ఇరుక్కుపోయింది. దాని వల్ల పేగులకు ఇన్ఫెక్షన్ సోకింది. గాయాలయ్యాయి. అందువల్ల సర్జరీ చేసి మొబైల్‌ని బయటకు తియ్యాల్సి వచ్చింది. ఆస్పత్రికి వెళ్లేందుకే భయపడిన ఆ వ్యక్తి... డాక్టర్ల మాటలు విని ఈ ఆపరేషన్ చేయించుకున్నాడు (viral news).


"ఆ మొబైల్‌ని అతను మింగడం వల్ల... పొట్ట ఇక దేనినీ లోపలికి రానివ్వట్లేదు. అందువల్లే అతను ఏం తిన్నా విపరీతమైన నొప్పి వస్తోంది. ప్రస్తుతం అతను రికవరీ అవుతున్నాడు. అతని కండీషన్ బాగానే ఉంది" అని డాక్టర్ అష్రఫ్ మాబాద్ తెలిపారు.

"ఇలాంటి ఘటన మాకు తగలడం ఇదే తొలిసారి. ఆరు నెలలు ఫోన్‌ని ఎలా ఉంచుకున్నాడో. దాని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాలేదు. పైగా తీవ్రమైన ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది" అని అస్వాన్ యూనివర్శిటీ హాస్పిటల్స్ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ మహ్మద్ ఎల్-దషోరీ తెలిపారు.

పైన ఎగురుతూ రెట్ట వేసిన విమానం... గార్డెన్‌లో వ్యక్తి లబో దిబో!
జనరల్‌గా మన శరీరం తనది కాదు అనుకునే దేన్నీ బాడీలో ఉండనివ్వదు. చిన్న ముల్లు గుచ్చుకొని కాలిలో ఉండిపోతే... అది పోయే వరకూ శరీరం నొప్పి కలిగిస్తూనే ఉంటుంది. మరి అతను 6 నెలలపాటూ శరీరానికి సంబంధం లేని మొబైల్‌ని పొట్టలో ఉంచుకోవడం షాకింగ్ విషయమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.