యాప్నగరం

viral: కొంపముంచిన కరెంటు కోత.. అక్క వరుణ్ని చేసుకున్న చెల్లి

సినిమాల్లో జరిగే సిల్లీ ఘటన నిజంగానే జరిగింది. సీరియస్ పెళ్లి కాస్తా కామెడీ అయిపోయింది. దీనంతటికీ కారణం కరెంటు కోత. మనం విదేశాలతో పోటీ పడి దూసుకుపోవాలని కలలు కంటాం. తీరాచూస్తే... ఇంకా కరెంటు కోతలే పోగొట్టుకోలేని దుస్థితి. ఇది మన దేశ దరిద్రం. సరైన ప్లానింగ్ ఉండదు. విజన్, మిషన్ ఏమీ ఉండవు. ఇప్పటికి ఇలా గడిచిపోతే చాలు అనే భావన నేతల్లో కనిపిస్తోందా? అందుకే దేశం, రాష్ట్రాలు ఇలా ఉంటున్నాయా? ఈ పెళ్లి ఇలాంటి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది.

Authored byKrishna Kumar | Samayam Telugu 10 May 2022, 9:37 am
కొన్ని కొన్ని విషయాలు వినడానికి కామెడీగా ఉంటాయి... కానీ ఆ ఘటనల వల్ల బాధితులైన వాళ్ల ఫీలింగ్స్ ఎంతో బాధాకరంగా ఉంటాయి. మధ్యప్రదేశ్.. ఉజ్జయినీలో జరిగిందీ దారుణం. విషయమేంటంటే... ఇద్దరు అమ్మాయిలు (అక్క, చెల్లి) పెళ్లికి రెడీ అయ్యారు. ఇద్దరూ ఒకే రకమైన పెళ్లి డ్రెస్ వేసుకున్నారు. పెళ్లికి బోలెడు మంది వచ్చారు. బంధువులు, ఫ్రెండ్స్ అంతా కోలాహలం. ఇంతలో కరెంటు పోయింది. అలాగని ఆగితే ఎలా? ముహూర్తానికి పెళ్లి జరగకపోతే మంచిది కాదంటారు కదా... ఒకేసారి రెండు పెళ్లిళ్లూ జరిగాయి. ఆ తర్వాత చూస్తే... పెళ్లి కొడుకులు మారిపోయారు. అక్క చేసుకోవాల్సిన అబ్బాయిని... చెల్లి చేసుకుంది. చెల్లి చేసుకోవాల్సిన అబ్బాయిని అక్క చేసుకుంది? ఈ తప్పు ఎవరిది? దీనికి ఎవర్ని నిందించాలి? (wedding with wrong grooms)
Samayam Telugu కొంపముంచిన కరెంటు కోత.. అక్క వరుణ్ని చేసుకున్న చెల్లి (image credit - twitter - graduatetalkspk)


రమేష్ లాల్ కూతుర్లైన నికిత, కరిష్మా పెళ్లిళ్లు ఇలా జరిగాయి. ముందుగా అనుకున్నదాని ప్రకారం... నికిత... దంగ్వారా భోలాని పెళ్లి చేసుకోవాలి. కరిష్మా... గనేష్‌ని చేసుకోవాలి. కానీ.. నికిత... గణేష్‌ని చేసుకుంది. కరిష్మా... దంగ్వారా భోలాని చేసుకుంది. ఉజ్జయినీకి 20 కిలోమీటర్ల దూరంలోని బద్నాగర్ తహసిల్‌లోని అస్లానా గ్రామంలో ఇది జరిగింది. (brides married the wrong grooms)
viral lion: అదిగో సింహం.. అల్లాడిపోయిన రైతు... చివరకు ఏమైంది?
పెళ్లిలో జరిగిన ఈ గందరగోళం విషయం వెంటనే తెలియలేదు. చాలాసేపటి తర్వాత తెలిసింది. ఇద్దరు వరుళ్లూ... తాము పెళ్లి చేసుకున్న అమ్మాయిలను తమ తమ ఇళ్లకు తీసుకెళ్లారు. అక్కడ ఈ విషయం తెలిసింది. అందరికీ దిమ్మతిరిగింది. (strange news)

అంతా అయ్యాక.. మళ్లీ రెండు కుటుంబాల వాళ్లూ ఓ చోటికి వచ్చారు. ఒకర్ని ఒకరు తిట్టుకున్నారు. "మీరు... చూసుకోవద్దా... అంటే మీరు చూసుకోవద్దా..." అని అనుకున్నారు. సరే... ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించి... మళ్లీ మర్నాడు... అసలు పెళ్లిళ్లు జరిపించారు. ఈసారి... పద్ధతి ప్రకారం పెళ్లిళ్లు జరిగాయి.
viral video: విచిత్ర జలపాతం.. ప్రకృతి సహజ అద్భుతం
ఇదంతా తెలిశాక... కొంతమంది నెటిజన్లు... ఇండియాలోనే ఇలా జరుగుతుంది అంటున్నారు. మరికొంతమంది అయ్యో అని జాలి పడుతున్నారు. దీనంతటికీ కారణం ఆ కరెంటు కోతే కదా. అదే లేకపోయి ఉంటే... ఇలా జరిగేదే కాదు కదా. పెళ్లి కాస్తా జోక్ అయిపోయింది. వేదమంత్రాలకు విలువ లేకుండా పోయింది. మధ్యప్రదేశ్ లోనే కాదు.. చాలా రాష్ట్రాల్లో ఈ కరెంటు కోతలు, గతుకుల రోడ్లు, వరదల సమస్యలు, కనీస మద్దతు ధర లేకపోవడం, దళారుల దోపిడీలు... ఇలా ఏళ్లుగా ఇవన్నీ ఉంటూనే ఉన్నాయి. మరి పాలకులు ఎందుకు శాశ్వత పరిష్కారాలు చూపించట్లేదనే ప్రశ్న నెటిజన్ల నుంచి వస్తోంది. తమలో ఉన్న ఆగ్రహావేశాల్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.