యాప్నగరం

బాత్‌రూమ్‌లో బందీ.. టబ్‌లో చిక్కుకుని 8 రోజులుగా మహిళ నరకయాతన!

ఓ ఒంటరి మహిళ బాత్ టబ్ నుంచి లేవలేక ఎనిమిది రోజులు బాత్రూమ్‌ నీళ్లను తాగుతూ ప్రాణాలు కాపాడుకుంది. ఆ ఫుడ్ డెలవరీ సంస్థ చొరవ చూపకపోతే ఆమె ఆ బాత్ టబ్‌లోనే చనిపోయేది.

Samayam Telugu 23 Nov 2019, 9:19 pm
మీరు ఎప్పుడైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు గది తలుపు దానికదే లాక్ అయిపోతే ఏం చేస్తారు? అందుబాటులో ఫోన్ ఉంటే.. మీ స్నేహితులకో, బంధువులకో చెబుతారు. ఒక వేళ ఫోన్ కూడా అందుబాటులో లేకపోతే? కిటికీ నుంచి అరిచో, తలుపులు బద్దలకొట్టో బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తారు. కానీ, ఆ మహిళ బాత్ టబ్‌లోనే బందీ అయ్యింది. కానీ, బయటకు రాలేకపోయింది. కారణం.. వృద్ధాప్యం.
Samayam Telugu bathroom_tub_GettyImages-1130591556
Photo: iStock


Also Read: పచ్చని పొలాల మధ్య బురదలో దొర్లుతూ.. పెళ్లి ఫొటోలకు పోజులు!

ఇంగ్లాండ్‌లోని లౌబరౌ‌లో ఒంటరిగా నివసిస్తున్న 70 ఏళ్ల వృద్ధురాలు స్నానం చేసేందుకు బాత్రూమ్‌కు వెళ్ళింది. బాత్ టబ్‌లో కూర్చున్న తర్వాత మళ్లీ పైకి లేవకపోయింది. శరీరం సహకరించకపోవడంతో ఆమె అందులోనే బందీ అయ్యింది. ఆమె బాగోగులు చూసేందుకు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సాయం కోసం కేకలు పెట్టలేపోయింది. అలా ఎనిమిది రోజులు ఆహారం లేకుండా బాత్ టబ్‌లోనే ఉండిపోయింది. కేవలం పైపు నుంచి వచ్చే నీటిని మాత్రమే తాగుతూ ప్రాణాలను దక్కించుకుంది.

ఇలా బయటపడింది: విల్ట్‌షైర్ ఫామ్ ఫుడ్స్ నుంచి ఆమెకు రోజు ఆహారం అందుతూ ఉంటుంది. ఆమె ఫోన్ ద్వారా తనకు కావాల్సిన వస్తువులు, ఆహారాన్ని ఆర్డర్ చేస్తే వాళ్లే ఇంటికి వచ్చి ఇస్తుంటారు. అయితే, గత కొద్ది రోజులుగా ఆమె ఆహారం ఆర్డర్ చేయడం లేదు. ఆ సంస్థ నుంచి వారానికి ఒకసారి ఆమె ఇంటి వద్దకు వచ్చే ‘వీల్స్ ఆన్ సర్వీస్’ సిబ్బంది ఓ రోజు ఆమె ఇంటి కాలింగ్ బెల్ కొట్టారు. కానీ, ఆమె స్పందించలేదు.

Also Read: పచ్చని పొలాల మధ్య బురదలో దొర్లుతూ.. పెళ్లి ఫొటోలకు పోజులు!

ఈ సందర్భంగా విల్ట్‌షైర్ ఫామ్ ఫుడ్స్ యజమాని సుజీ లీసన్ మాట్లాడుతూ.. ‘‘ఆమె ఒంటరిగా నివసిస్తుండటం వల్ల రోజు ఆమెతో ఫోన్లో మాట్లాడుతుంటాం. గత కొద్ది రోజులుగా ఆమె మా ఫోన్లకు స్పందించడం లేదు. దీంతో ఆ ప్రాంతంలో ఆహార డెలవరీ చేసే వ్యాన్ డ్రైవర్‌ను ఆమె ఇంటికి వెళ్లాలని కోరాం. తలుపులు లోపలి నుంచి వేసి ఉండటంతో ఇంటి చుట్టూ తిరుగుతూ ఆమెను పిలవసాగాడు. దీంతో ఆమె స్పందించి.. తాను బాత్ టబ్‌లో చిక్కుకున్నానని, లేవలేని స్థితిలో ఉన్నానని తెలిపింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తలుపులు బద్దలకొట్టి ఆమెను రక్షించారు. ఆహారం లేకపోవడం వల్ల ఆమె బాగా నీరసించి పోయింది. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు. ఇప్పుడు ఆమె కోలుకుంటోంది’’ అని తెలిపారు. చూశారుగా.. ఆ ఫుడ్ డెలవరీ సంస్థ చొరవ చూపి ఉండకపోతే ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారేదోమో కదూ!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.