యాప్నగరం

గాజులా మారిపోయిన వ్యక్తి మెదడు.. షాకింగ్ కారణాలు చెప్పిన నిపుణులు

మనిషి మెదడు గాజులా మారిపోతుందంటే.. చాలా చిత్రంగా అనిపిస్తోంది కదూ. ఒక జీవి గనిలా మారిపోవడం సాధ్యమేనా? మరి, ఆ వ్యక్తికి ఏమైంది? అతడి మెదడు ఎందుకలా గాజులా మారిపోయింది? కారణాలు ఏమిటీ? తదితర సందేహాలకు సమాధానం కావాలంటే.. ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

Samayam Telugu 24 Jan 2020, 3:36 pm
మనిషి మెదడు గాజులా మారిపోతుందంటే.. చాలా చిత్రంగా అనిపిస్తోంది కదూ. ఒక జీవి గనిలా మారిపోవడం సాధ్యమేనా? మరి, ఆ వ్యక్తికి ఏమైంది? అతడి మెదడు ఎందుకలా గాజులా మారిపోయింది? కారణాలు ఏమిటీ? తదితర సందేహాలకు సమాధానం కావాలంటే.. ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం గురించి తప్పకుండా తెలుసుకోవాలి.
Samayam Telugu extreme heat of mount vesuvius eruption turned mans brain into glass
గాజులా మారిపోయిన వ్యక్తి మెదడు.. షాకింగ్ కారణాలు చెప్పిన నిపుణులు



అత్యధిక ఉష్ణోగ్రత వద్ద మెదడులో మార్పులు

మనిషి మెదడు.. కంప్యూటర్‌లో మదర్ బోర్డులాంటిది. అది సక్రమంగా పనిచేస్తేనే మనిషి కూడా ఎలాంటి సమస్య లేకుండా చురుగ్గా ఉంటాడు. అతడి జీవితమంతా ఆ సున్నితమైన అవయవం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే, మెదడును సంరక్షించుకోవడం ఎంతో ముఖ్యం. అయితే, ఈ మెదడు.. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద చిత్రమైన మార్పులు చేసుకుంటుందని అధ్యయనంలో తేలింది.

అగ్నిపర్వతం బీభత్సం

క్రీస్తు శకం 79 కాలంలో ఇటలీలోని వెసువియస్ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో హెర్కులేనియమ్లోని ప్రాంతంలో నివసిస్తున్న వేలాది మంది ప్రజలు లావాలో చిక్కుకుని దుర్మరణం చెందారు. సునామీలా ఉబికి వచ్చిన లావా ప్రజలను సజీవ దహనం చేసింది. ప్రజలంతా తమ ఇళ్లల్లోనే తుదిశ్వాస విడిచారు.

1960 నుంచి అధ్యయనం

పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో అధ్యయనం చేస్తున్నారు. 1960లో పరిశోధకులకు ఆ పర్వతం వద్ద చనిపోయిన ఓ వ్యక్తి కళేబారాన్ని కనుగోన్నారు. దీనిపై ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.

గాజులా మారిన మెదడు

అగ్నిపర్వతం పేలుడు వల్ల ఏర్పడిన వేడికి ప్రజల శరీరాలు కరిగిపోయి ఉండవచ్చని పరిశోధకులు తెలిపారు. తాజా అధ్యయనంలో ఆ అగ్నిపర్వతం వద్ద చనిపోయిన వ్యక్తి మెదడు గాజులా మారిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అలా మారిపోవడానికి గల కారణలపై పరిశోధనలు జరిపారు.

అదెలా సాధ్యం?

అగ్నిపర్వతం వల్ల వెల్లడైన వేడి వల్ల వ్యక్తి మెదడు కరిగిపోయి ద్రవంలా మారిపోయింది. అది వెంటనే చల్లబడటం వల్ల.. అది క్రమేనా గాజులా మారిందని పరిశోధకులు వెల్లడించారు. దీన్నే ‘విట్రిఫికేషన్’ విధానం అంటారని తెలిపారు. ఈ విధానంలో అత్యధిక ఉష్ణోగ్రతకు గురయ్యే వస్తువును క్రమేనా చల్లబరచడం ద్వారా గాజులా మారుతుందని, అగ్నిపర్వతం పేలుడు తర్వాత కూడా ఇదే జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు.

గాజులో కొవ్వు ఆమ్లాలు

గాజులా మారిన అతడి మెదడులో కొవ్వు ఆమ్లాలు, వెంటుకలు కూడా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఒక్క వ్యక్తిపైనే పరిశోధనలు జరిగాయి. ఆ అగ్నిపర్వతం పరిసరాల్లో స్వాధీనం చేసుకున్న మరికొన్ని కళేబరాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. మిగతా వాటిలో కూడా ఇదే విషయం నిరూపితమైతే.. ఇది తప్పకుండా అద్భుతమే!!

Also Read: ఆ ఒక్కడే 93 మందిని రేప్ చేసి చంపేశాడు.. చివరికి ఇలా దొరికాడు, 35 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ! Photos: Pixabay

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.